హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది.
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు విచారించినట్లు తెలుస్తోంది. ఇటీవల హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అతడిపై కేసు నమోదు తర్వాత పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫిర్యాదులు చేశారు. అనుమతుల కోసం తమ వద్ద రూ.కోట్లలో వసూలు చేసినట్లు ఏసీబీ దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో పుప్పాలగూడలోని ఓ భూమిలో భవన నిర్మాణ అనుమతులకు పెద్దమొత్తం వసూలులో.. శివబాలకృష్ణతోపాటు ఆ కీలకాధికారి ప్రమేయంపై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో కొత్త కేసుగా దీనిని నమోదు చేసి ఆధారాల సేకరణకు దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు నిజమని తేలితే అరెస్టు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
నామినేషన్ తిరస్కరణలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ
ఈనాడు, హైదరాబాద్: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి న్యాయవాది కె.వి.గీతాకుమారి నామినేషన్ను తిరస్కరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ దాఖలులో లోపాలను సరిదిద్దినా ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల వ్యయం నిమిత్తం ప్రత్యేక బ్యాంకు ఖాతా వివరాలను, ఫొటోలను, ఫాం-ఎ అసమగ్రంగా పూర్తి చేయడంతో నామినేషన్ను తిరస్కరించినట్లు తెలిపారు.
ఏడున్నరేళ్లు భారాసలో పంజరంలో పక్షిలా ఉన్నా: దానం
నారాయణగూడ, న్యూస్టుడే: ‘భారాసలో ఏడున్నరేళ్లు పంజరంలో పక్షిలా ఉన్నా.. నాతో పాటు నడిచే కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయా.. కాంగ్రెస్లోకి వచ్చిన తరువాత స్వతంత్రం వచ్చినట్లుంది’ అని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం హిమాయత్నగర్ వై.జంక్షన్ వద్ద డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మిగౌడ్, పార్టీ నాయకుడు జి.రామన్గౌడ్లతో కలిసి సికింద్రాబాద్ నియోజకవర్గ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసీఫ్నగర్ నియోజకవర్గం నుంచి తన రాజకీయ జీవితం మొదలైందని, ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యానని వివరించారు. భారాసలో ఉన్నప్పుడు కార్యకర్తలకు, ఓటర్లకు ఏదైనా సమస్య వచ్చి తనను ఆశ్రయిస్తే.. అధికారులు, వైద్యులకు సహాయం చేయమని కోరినప్పుడు ముఖ్యమంత్రి లేఖ ఉందా? కేటీఆర్కు చెప్పారా? అనే అడిగేవారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు. కిషన్రెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో తాము రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రకటించారన్నారు.
హజ్ యాత్రలో నిబంధనలు తప్పక పాటించాలి
నాంపల్లి, న్యూస్టుడే: హజ్ యాత్ర- 2024కు ఎంపికైనవారు యాత్రలో నిబంధనలు తప్పకుండా పాటించాలని పలువురు ముస్లిం మతగురువులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మాజీ ఛైర్మన్ మహ్మద్ సలీం నేతృత్వంలో గురువారం నాంపల్లిలోని రెడ్రోజ్ ఫంక్షన్హాల్ వేదికగా హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. జామియా నిజామియా మతగురువు ముఫ్తీ సయ్యద్ జియాఉద్దీన్నక్్్షబందీ, డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ మజీబ్, ఆమీర్ ఎ మిల్లత్ ఇస్లామియా మహమ్మద్ హుసాముద్దీన్ సానిజాఫర్పాషా, సయ్యద్షా నామత్ఉల్లాఖాద్రీ, మహమ్మద్ అబ్దుల్ రహీం ఖుర్రం, మక్కామసీదు ప్రతినిధులు డాక్టర్ రిజ్వాన్ఖురేషీ, హామెద్మహమ్మద్ఖాన్, సియాసత్ ఎడిటర్ ఆమిర్అలీఖాన్, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇర్ఫాన్షరీఫ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 7వ తేదీ నుంచి హైదరాబాద్లోని నాంపల్లిలో గల హజ్హౌజ్లో తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం హజ్ శిబిరం నిర్వహిస్తుందని, 9వ తేదీన సౌదీకి తొలి విమానం బయలుదేరుతుందని చెప్పారు. ఈసారి కూడా తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ యాత్రికులు కూడా హైదరాబాద్ హజ్ టెర్మినల్ నుంచే హజ్యాత్రకు బయలుదేరుతారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.