భారాస పాలనలోనే ఇల్లెందు అభివృద్ధి: సత్యవతి రాథోడ్
పదేళ్ల భారాస పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ఇల్లెందులో గురువారం
మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పక్కన ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ
ఇల్లెందు, న్యూస్టుడే: పదేళ్ల భారాస పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ఇల్లెందులో గురువారం నిర్వహించిన రోడ్షోలో ఆమె మాట్లాడారు. అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని, భారాస హయాంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో మహోత్తర పథకాలు అమలుచేశామని తెలిపారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి దేశ ప్రజలను మోసగించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. భారాస అభ్యర్థి మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, దిండిగాల రాజేందర్, ఎస్.రంగనాథ్, కౌన్సిలర్లు జేకే శ్రీను, కటకం పద్మావతి, కడకంచి పద్మ, లలిత శారద, బిందు, వీణ తదితరులు పాల్గొన్నారు.
మాయమాటలకు తలొగ్గి మోసపోవద్దు: కవిత
గుండాల, ఆళ్లపల్లి, న్యూస్టుడే: కాంగ్రెస్, భాజపా నాయకుల మాయమాటలు, ప్రలోభాలకు తలొగ్గి మోసపోవద్దని భారాస అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలం పెద్దూరులలో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆమె మాట్లాడారు. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. భారాస హయాంలో అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగిందని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, గుండాల, కోలేటి భవానీశంకర్, వట్టం రాంబాబు, ఎంపీపీ మంజు భార్గవి, జడ్పీటీసీ సభ్యుడు హన్మంతరావు, పాయం నర్సింహారావు తెల్లం భాస్కర్, ఎడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి
[ 02-06-2024]
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ ఏన్కూర్లో ఓ యువకుడు వినూత్నంగా ప్రదర్శన చేశాడు. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఏన్కూర్ లో ఘనంగా నిర్వహించారు. -
పదేళ్ల పండగ.. అభివృద్ధి దండిగా..
[ 02-06-2024]
స్వరాష్ట్ర స్వప్నం నెరవేరి పదేళ్లు పూర్తవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. -
తొందరొద్దు.. సాగుకు అదను ముఖ్యం
[ 02-06-2024]
వానాకాలం పంటల సాగులో తొందరపాటు తగదని వైరా కేవీకే ప్రోగ్రామ్ సమన్వయకర్త, శాస్త్రవేత్త కె.రవికుమార్ సూచించారు. నిర్ధారిత కనీస వర్షపాతం నమోదయ్యాకే పత్తి విత్తనాలు నాటుకోవాలని, ఇతర పంటలకు పూనుకోవాలని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ దుర్మరణం
[ 02-06-2024]
తల్లాడ-దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిలోని మిట్టపల్లి గ్రామం వద్ద ఓ డీసీఎం వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో
[ 02-06-2024]
ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై జీలుగుమిల్లి మండలం రమణక్కపేట వద్ద శనివారం జరిగింది. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
[ 02-06-2024]
ఖమ్మం శివారు ధంసలాపురం ఫ్లైఓవర్ సమీపంలో ఓ యువకుడు మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ ఎస్సై భాస్కర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సింగరేణి ముస్తాబు
[ 02-06-2024]
సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. -
పదేళ్ల ప్రస్థానం.. ప్రగతికి సోపానం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొత్తగూడెం పట్టణం కీలక భూమిక పోషించింది. 1968లో మొట్టమొదటిసారిగా ‘ప్రత్యేక తెలంగాణ’ నినాదం ఇక్కడే పురుడు పోసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు