ధర లేక రైతన్న దిగాలు
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు.
సన్నధాన్యానికి లభించని గిట్టుబాటు
న్యూస్టుడే, చేగుంట: యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. సాధారణంగా యాసంగిలో సన్నధాన్యం పండించేందుకు రైతులు ఆసక్తి చూపరు. దానికి కారణం ఎక్కువగా నూకలు అవుతుంటాయి. అయినా ఈసారి మాత్రం జిల్లా వ్యాప్తంగా చాలా మంది సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు.
75 వేల ఎకరాల్లో సాగు : జిల్లా వ్యాప్తంగా 2,60,933 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. చేగుంట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, హవేలిఘనపూర్, రామాయంపేట, నిజాంపేట, శివ్వంపేట, మెదక్, కొల్చారం, నర్సాపూర్, నార్సింగి, కౌడిపల్లి, చిలప్చెడ్, తూప్రాన్ మండలాల్లో రైతులు వరి సాగుచేశారు. ఇందులో రికార్డు స్థాయిలో సుమారు 75 వేల ఎకరాల్లో సన్న ధాన్యం పండించారు. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని వేల ఎకరాల్లో సాగు చేయలేదు. ప్రస్తుతం మార్కెట్లో సన్నబియ్యం ధర ఆకాశాన్ని అంటుతోంది. రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ధర ఉంది. గత ఐదు నెలల నుంచి ధర రోజురోజుకు పెరుగుతూ పోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు సాగుచేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పంట చేతికి వస్తోంది.
వ్యాపారులు చెప్పినంత..: సన్నధాన్యానికి క్వింటాలుకు రూ.2,500 వరకు వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ ప్రైవేటుగా రైస్మిల్లర్లు, వ్యాపారస్థులు క్వింటాలుకు రూ.2,350 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు రూ.2,203 ఇస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా వస్తున్నా ఆశించిన మేర లేక నష్టపోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. దొడ్డు ధాన్యం కంటే సన్నధాన్యం దిగుబడి తక్కువగా వస్తుంది. ఎకరాకు దొడ్డురకం ధాన్యం 32 క్వింటాళ్ల వరకు వస్తుంది. అదే సన్నరకం ధాన్యం 28-30 క్వింటాళ్ల మధ్యలో వస్తుంది. ఈసారి పంటకు చీడలు ఎక్కువగా వచ్చాయి. దానివల్ల పురుగుమందులకు ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. కనీసం బియ్యంగా మార్చి విక్రయించాలని అనుకున్నా నూకలు ఎక్కువగా అయి నష్టపోవాల్సి వస్తుంది. అలాగే యాసంగి బియ్యంను నేరుగా రైతుల నుంచి ఎవరూ కొనుగోలు చేయరు. అందువల్ల ధర తక్కువైనా ప్రైవేటుగా విక్రయించుకుంటున్నారు. వ్యాపారస్థులు ధర ఎంత చెబితే అంతకు అమ్ముకుంటున్నారు. అలాగే వ్యాపారస్థులు తాలు పేరుతో క్వింటాలుకు ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారు. ఎంతో ఆశతో సన్నరకం సాగు చేసినా ఫలితంలేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. అదే వానాకాలంలో సాగు చేస్తే ఎంతో లాభం ఉండేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. వీటిని నిల్వ ఉంచుకున్నా ఉపయోగంలో ఉండదు. అందువల్ల ధర తక్కువగా వచ్చినా విక్రయించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు