మహిళాభ్యున్నతికి బాటలు
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే.
పొదుపు సంఘాలకు రుణ లక్ష్యాలు ఖరారు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. బ్యాంకు రుణాలు తీసుకుంటూ మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయం ఉపాధి దిశగా పలువురు అడుగులు వేస్తూ కుటుంబ ఉన్నతిలో భాగస్వాములవుతున్నారు. బ్యాంకు రుణాల సద్వినియోగంపై అధికారులు చైతన్యం తీసుకురావడంతో నెలవారీ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రుణ లక్ష్యాలు ఖరారు చేశారు.
1.90 లక్షల మంది సభ్యులు
జిల్లాలో 692 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలు 18,795. ఆయా సంఘాల్లో 1.90లక్షల మంది సభ్యులు ఉన్నారు. అర్హత గల వారందరినీ మహిళా సంఘాల్లో చేర్పించేందుకు కొత్త సంఘాలను ఏర్పాటు చేసే కార్యక్రమం సైతం కొనసాగుతోంది.
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే..
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏదైనా బ్యాంకు పరిధిలో లింకేజీ తక్కువగా ఉంటే సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాల పంపిణీ వేగవంతమయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయించాలని భావిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఏ నెలకు సంబంధించిన లక్ష్యాలు అదే నెలలో అధిగమించేందుకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు.
లక్ష్యం రూ.927.37 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రుణాల పంపిణీ లక్ష్యాన్ని రూ.927.37 కోట్లుగా నిర్దేశించారు. 15,097 సంఘాలకు రుణాలు అందించనున్నారు. సమష్టిగా ముందుకు సాగితే లక్ష్యాలను చేరుకోవడం సులభమే. గత ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేశారు. రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తుండటంతో మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం పోటీపడుతున్నాయి. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 14,040 మహిళా సంఘాలకు రూ.769.60 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా లక్ష్యాన్ని అధిగమించారు. రూ.840.60 కోట్లు పంపిణీ చేయడం విశేషం.
సమన్వయంతో ముందుకు..
మహిళా సంఘాలకు రుణాల పంపిణీ లక్ష్యాలను గత ఆర్థిక సంవత్సరం గడువుకు ముందే అధిగమించాం. ఈ ఆర్థిక సంవత్సరమూ అదే ఒరవడిని కొనసాగిస్తాం. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతాం. రుణాల పంపిణీపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యాల సాధనపై సిబ్బందిని అప్రమత్తం చేస్తాం. బ్యాంకు రుణాల పంపిణీతోపాటు సద్వినియోగంపై సంఘాల సభ్యులకు అవగాహన పెంపొందిస్తాం. -జంగారెడ్డి, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పచ్చందాలకు.. ప్రత్యేక కార్యాచరణ
[ 13-06-2024]
పర్యావరణ పరిరక్షణలో వృక్షాలే కీలకం. వీటి వల్లే ఆహ్లాదకర వాతావరణంతోపాటు, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ముఖ్యంగా అడవుల్లో మొక్కలు నాటి వాటిని పెంచితే భారీ వర్షాలు కురిసి భూగర్భజలాలు పెరిగి పంటలు బాగా పండేందుకు ఆస్కారం ఉంటుంది. -
ధాన్యం మరాడించడంపై దృష్టి
[ 13-06-2024]
కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మరాడించడంపై అధికారులు దృష్టి సారించారు. నాలుగు సీజన్లకు సంబంధించి ఆయా మిల్లులకు ధాన్యం కేటాయించగా, -
చదువులమ్మ నెలవుల్లో.. చిన్నారుల చిరునవ్వులు
[ 13-06-2024]
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా చిన్నారులతో సందడి నెలకొంది. సర్కారు బడులను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో అలంకరించారు. -
5 నెలలు.. 175 మరణాలు
[ 13-06-2024]
రహదారులు అభివృద్ధికి చిహ్నాలంటారు. అవే దారులపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లడం, మద్యం తాగి నడపడం, ఇష్టారీతిన వాహనాలు నిలపడం, -
ఉద్యాన సాగుకు ఊతమేదీ?
[ 13-06-2024]
విత్తు నాటగానే వరుణుడి కటాక్షం కోసం ఆకాశం వైపు చూడాలి.. మొలకెత్తింది మొదలు పంటకు చీడపీడల నివారణ.. చేను కోతకొచ్చి ఉత్పత్తులను మార్కెట్కు తరలించేదాకా అన్నదాతలకు కష్టాలే. -
సర్కారు బడుల్లోనే నాణ్యమైన బోధన
[ 13-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోనే డీఎస్సీ అర్హతతో ఉద్యోగాలు సాధించిన అత్యున్నతమైన ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేస్తారని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. -
లీకేజీలతో శుద్ధ జలం కలుషితం
[ 13-06-2024]
మిషన్భగీరథ పథకం నీటి సరఫరాలో నెలకొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం నేపథ్యంలో నీటి లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. -
టోల్గేట్తో ఆదాయం.. ఏదీ సదుపాయం?
[ 13-06-2024]
రహదారులు అభివృద్ధికి సూచిక. వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా ప్రయాణించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన రహదారులను నాలుగు నుంచి ఆరు వరుసలుగా నిర్మించాయి. -
పర్యావరణహితమే సంకల్పం
[ 13-06-2024]
పర్యావరణ శ్రేయస్సు.. సమాజ హితాన్ని కాంక్షిస్తూ పలువురు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. స్వార్థం చూసుకోకుండా స్వచ్ఛతలో భాగస్వామ్యమవుతూ ఇతరులకు ప్రేరణ కల్పిస్తున్నారు. -
కృత్రిమ ఇసుకతో భూమాత నిస్సారం
[ 13-06-2024]
పంటల సాగు చేపట్టాలంటే మట్టి, ఇసుకరేణువులతో కూడిన సారవంతమైన భూమి అవసరం. కొందరు మట్టి నుంచి కృత్రిమంగా ఇసుక తయారుచేసి అక్రమ దందా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక డాలరు పెట్టి కొన్న పాత పేపర్లలో.. అన్నీ సైనిక రహస్యాలే!
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. 16,347 పోస్టులు
-
లోక్సభ ఎన్నికల్లో దూకుడు.. ‘మహా’ పట్టుకు శరద్ పవార్ ప్రయత్నాలు
-
భారత్-చైనా టెన్షన్లు తగ్గాలంటే సమష్టి ప్రయోజనాలను గుర్తించాలి: అమెరికా
-
దిల్లీలో నీటి సంక్షోభం వేళ.. సుప్రీంకోర్టులో హిమాచల్ యూటర్న్
-
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు