అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు.
నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం
కోదాడ పట్టణం, న్యూస్టుడే: వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. సరస్వతీదేవిగా పూజిస్తారు. చరిత్రాత్మక ఉద్యమాలకు నాడు పుస్తకాలు ఆయుధాలుగా నిలిచాయి. పుస్తక పఠనమే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పునాది అయినా పాశ్చాత్య సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానంతో జనం చరవాణులకు బానిసలవుతూ పుస్తక పఠనంపై ఆసక్తి కోల్పోతున్నారు.
మనిషిని చదివినట్లే:
హనుమంతరావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
కొత్త పుస్తకం చదివితే కొత్త మనిషిని చదివినట్లే. పుస్తకాన్ని రాసిన వ్యక్తి జీవితానుభవసారం మొత్తం మనకు ఆ పుస్తకాన్ని చదివితే తెలుస్తుంది. అది జ్ఞానంగా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తకాలు లేనిదే మానవ అభివృద్ధి లేదు.
విచక్షణతో ఎంపిక చేసుకోవాలి:
పుప్పాల కృష్ణమూర్తి, కథా రచయిత
మంచి పుస్తకాలు చదివి మహాత్ములైనవారు ఉన్నారు. నేటి డిజిటల్ యుగంలో పుస్తక పఠనం తగ్గిపోయింది. అయినా పుస్తకాలను మంచి స్నేహితులుగా భావించి పుస్తక పఠనాన్ని పెంచుకోవాలి. మనిషికి క్రాంతిని, శాంతిని ఇవ్వగలిగేది పుస్తకమే.
ఏకాగ్రత పెరుగుతుంది:
మంత్రిప్రగడ భరతారావు, సాహితీవేత్త
పుస్తక పఠనంతోనే ఏకాగ్రత పెరుగుతుంది. ప్రజ్ఞావంతుడైన వ్యక్తులు తన తదనంతరం కూడా ఆలోచనలు సజీవంగా ఉండాలని పుస్తకాలు రాస్తారు. ఆ పుస్తకాలు చదువుతున్నంత కాలం అతడు భౌతికంగా లేకపోయినా అతని పేరు సజీవంగా ఉంటుంది.
పుస్తకం హస్తభూషణం:
బచ్చలకూరి జార్జి, పుస్తక రచయిత
పుస్తకం ఒక వ్యక్తి జీవితాన్ని మారిస్తే.. గ్రంథాలయం ఒక తరాన్ని ప్రభావితం చేస్తుంది. పుస్తకాలు విజ్ఞానం, వినోదం, మనోవికాసాన్ని కలిగిస్తాయి. అంబేడ్కర్ పీహెచ్డీలో సమర్పించిన పరిశోధన పత్రం ప్రపంచ మేధావులను ఆకర్షించింది. ఒక పుస్తకం హస్తభూషణమై గృహాలంకారంగా ఉంటుంది. పుస్తకాలతోనే విజ్ఞానాన్ని పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు..
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని