కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ
సూర్యాపేటలో శిక్షణ పొందుతున్న అధికారులు
భానుపురి, న్యూస్టుడే: ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ నుంచి ఫలితాలు వెల్లడి చేసే వరకు అధికారులు, పోలింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపుతుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సూచనలతో కరదీపికలను రూపొందించింది.
మొదటి శిక్షణ పూర్తి
ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోలింగ్ నిర్వహణపై మూడు విడతల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండగా.. ఇప్పటికే మొదటి దశ పూర్తయింది. పోలింగ్ సమయంలో ప్రిసైడింగ్ అధికారి(పీవో), సహాయ ప్రిసైడింగ్ అధికారి(ఏపీవో), ఇతర పోలింగ్ అధికారులు (ఓపీవో) తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. పోలింగ్ ముందు రోజు ఎన్నికల సామగ్రి తీసుకోవటం నుంచి మొదలు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాట్లు, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వటం, మాక్ పోలింగ్కు సకాలంలో హాజరయ్యేలా సూచనలు చేయాల్సి ఉంటుంది. పోలింగ్రోజు ముందస్తుగా ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పని తీరుపై ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలతోపాటు పోలింగ్ సామగ్రిని అధికారులకు అందించే వరకు సిబ్బంది సమన్వయంతో చేపట్టాల్సిన విధులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
చేయాల్సినవి.. చేయకూడనివి
అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా అక్కడక్కడ పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల విధుల్లో చేయాల్సినవి.. చేయకూడనవి పేరుతో ప్రత్యేక పుస్తకాలు అందజేశారు. ఈ కరదీపికల్లో ప్రధానంగా పంపిణీ(డిస్ట్రిబ్యూషన్) కేంద్రం, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రారంభం, ముగింపు బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్, కంట్రోల్ యూనిట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీల్ చేసే విధానం తదితర అంశాలపై పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించటంపై పుస్తకాలు తయారు చేశారు. ఈ కరదీపికలు ఇప్పటికే పీవో, ఏపీవోలకు అందజేశారు.
మరింత సులభతరం
ఎన్నికల సంఘం రూపొందించిన చెక్లిస్ట్ కరదీపిక
ఎన్నికల విధుల్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు చెక్లిస్ట్ పేరుతో మరో పుస్తకాన్ని అందజేశారు. పీవో, ఏపీవోలకు పోలింగ్ నిర్వహణ సమయంలో ఏదైనా చిన్న సందేహం వచ్చినా గతంలో కరదీపికలోనే వివరాలు ఉండటంతో పుస్తకం మొత్తం తిరిగేయడానికి ఎంతో ఇబ్బందిపడేవారు. ప్రస్తుతం చెక్లిస్ట్ పుస్తకాన్ని విడిగా తక్కువ సమాచారంతో ఇవ్వడంతో సులభంగా అనుమానాలను నివృత్తికి వెసులుబాటు ఏర్పడింది. ఈ పుస్తకంలో సందేహాల నివృత్తికి అవసరమైన పేజీని తెరచి చదువుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్