కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు నామ పత్రాలు అందజేస్తున్న నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి, చిత్రంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్, ఈరవత్రి అనిల్, ఏ.లలిత
నిజామాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ ఏ.లలితతో కలిసి రెండు సెట్ల నామ పత్రాలను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణుతో కలిసి మరో రెండు సెట్ వేశారు.
భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తరఫున నామినేషన్ వేస్తున్న పార్టీ ప్రతినిధులు పల్లె గంగారెడ్డి, దినేష్, ప్రకాష్రెడ్డి, స్రవంతి, బోగ శ్రావణి
భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తరఫున పార్టీ నాయకులు పల్లె గంగారెడ్డి, దినేష్ కులాచారి, మేడపాటి ప్రకాశ్రెడ్డి, స్రవంతిరెడ్డి, బోగ శ్రావణి మూడో సెట్ నామ పత్రాలు అందజేశారు. బీఫాం అందజేశారు. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున ఆయన కొడుకు బాజిరెడ్డి జగన్, నాయకులు నాలుగో సెట్ పత్రాలు దాఖలు చేశారు. రాజ్కుమార్(ఇండియా ప్రజాబంధు పార్టీ), పానుగంటి రజిత వాణి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), నాగార్జున(ప్రజాసేన పార్టీ) నామినేషన్ వేశారు. స్వతంత్రులు రాజేందర్, గంగాధర్, నవీన్, రఘు, ఎం.డి. షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ) అభ్యర్థులు నామినేషన్ వేశారు. పార్లమెంట్ స్థానానికి ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు 62 సెట్ల నామినేషన్ పత్రాలు వేసినట్లు రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
నేటితో ఆఖరు: నామినేషన్ దాఖలుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ నెల 18 నుంచి నామ పత్రాల స్వీకరణ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలైన భారాస, భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కలిసి గురువారం మరో సెట్ వేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటి సరఫరాకు అంతరాయం తలెత్తొద్దు
[ 04-05-2024]
వేసవి నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి శరత్ తెలిపారు. -
ప్రాంగణాలు.. బేజారు..!
[ 04-05-2024]
మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రాంగణాల్లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా భావించే ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మాత్రం మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతోంది. -
మాతృభాషలో తడబాటు
[ 04-05-2024]
తన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారి నుంచి ఏ భాష వింటూ, ఇబ్బంది లేకుండా తన్మయత్వంతో నేర్చుకుంటున్నారో అందులోనే మందగమనం మొదలైంది. -
వజ్రాయుధాన్ని వదులుకోవద్దు!
[ 04-05-2024]
ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వజ్రాయుధం. ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల అధికారులు ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
అర్బన్ నియోజకవర్గంలో ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి కోసం ఓటు వేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 04-05-2024]
కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
‘చక్కెర పరిశ్రమపై హస్తం పార్టీ డ్రామా’
[ 04-05-2024]
చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 04-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. -
ఓటింగ్ శాతంపెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. -
‘భాజపాతోనే అభివృద్ధి సాధ్యం’
[ 04-05-2024]
ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
‘పదేళ్లలో చేసిందేమీ లేదు’
[ 04-05-2024]
పదేళ్లలో ఎంపీ బీబీపాటిల్ బాన్సువాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీలేదని జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అన్నారు. -
నిర్భయంగా ఓటేయాలి
[ 04-05-2024]
నిర్భయంగా ఓటేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆవరణలోని సెల్ఫీపాయింట్ వద్ద శుక్రవారం స్వీయ చిత్రం దిగారు. -
ఎవరికెంత మెజార్టీ అంటే..!
[ 04-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 ఎన్నికలు జరిగాయి. -
ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు
[ 04-05-2024]
కాస్బాగ్ తండా వెనుక ప్రాంతంలో ఉన్న పోతుల మోరి వాగు చెక్డ్యామ్ వద్ద ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేసి వ్యాపారులు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. -
‘భాజపాను గద్దెదించాలి’
[ 04-05-2024]
ప్రజా సంక్షేమం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్న భాజపాను గద్దెదించాలని జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. -
‘గల్ఫ్ కార్మికుల ప్రశ్నలకు అర్వింద్ సమాధానాలు ఇవ్వాలి’
[ 04-05-2024]
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగేముందు నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీమ్రెడ్డి డిమాండ్ చేశారు. -
పురపాలికలకు ముందస్తు ఆదాయం
[ 04-05-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పురపాలికలకు ‘ముందస్తు’ ఆదాయం వచ్చింది. -
ఓట్లతోనే జాతీయ, ప్రాంతీయ పార్టీల గుర్తింపు
[ 04-05-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలు అని తరచూ వింటూ ఉంటాం. జాతీయ పార్టీలు దిల్లీ కేంద్రంగా, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల రాజధానుల కేంద్రంగా పనిచేస్తాయి. -
ఎన్నికల సహాయకేంద్రంలో సీసీ వీరంగం..!
[ 04-05-2024]
కలెక్టరేట్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి వద్ద సీసీగా పనిచేస్తున్న వ్యక్తి గురువారం రాత్రి కలెక్టరేట్లో వీరంగం సృష్టించినట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?