ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది.
ప్రథమంలో 27.. ద్వితీయంలో 29వ స్థానం
ఏటేటా ఫలితాల్లో వెనుకబడుతున్న జిల్లా
న్యూస్టుడే, నిజామాబాద్ విద్యావిభాగం
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా మార్చి 14న ప్రధాన, మార్చి 19న వృత్తివిద్య పరీక్షలు ముగిశాయి. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 14,974 మంది, వృత్తివిద్యలో 2399 మంది పరీక్షలు రాయగా, ద్వితీయ జనరల్ విభాగంలో 13,988, ప్రైవేటులో 1,804, వృత్తివిద్య విభాగంలో 2,192 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకన ప్రక్రియ మార్చి 2న ప్రారంభించిన అధికారులు 20 రోజుల క్రితమే పూర్తి చేశారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడం, రాష్ట్రస్థాయిలో ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఇందూరు ఏటా వెనుకబడుతుండటం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది. బోధనలో నాణ్యత పెంచాల్సిన అవసరముందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో అనుత్తీర్ణులైన వారితో పాటు మార్కులు పెంచుకోవాలనుకునే వారి కోసం విద్యాశాఖ రీకౌంటింగ్, రీ వాల్యుయేషన్కి ఈ నెల 25 నుంచి మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి పేపర్కు రీ వెరిఫికేషన్ చేయించుకోవాలనే విద్యార్థులు రూ.100 చొప్పున, రీకౌంటింగ్తో పాటు పరీక్ష జవాబు పత్రాల జిరాక్స్ పత్రాలు పొందడానికి రూ.600 చొప్పున ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆందోళన వద్దు.. ఆలోచనతో ముందుకు..
రవికుమార్, డీఐఈవో
అనుత్తీర్ణులైన వారు ఆందోళన చెందొద్దు. వెంటనే నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఆలోచనతో ముందడుగు వేయాలి. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. ఇంకా ఏమైనా అనుమనాలుంటే టెలిమానస్, 14416 టోల్ఫ్రీ నెంబర్లను సంప్రదించాలి. ఫలితాల్లో తప్పులు గుర్తిస్తే helpdeskie@telangana.gov.in ను సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటి సరఫరాకు అంతరాయం తలెత్తొద్దు
[ 04-05-2024]
వేసవి నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి శరత్ తెలిపారు. -
ప్రాంగణాలు.. బేజారు..!
[ 04-05-2024]
మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రాంగణాల్లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా భావించే ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మాత్రం మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతోంది. -
మాతృభాషలో తడబాటు
[ 04-05-2024]
తన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారి నుంచి ఏ భాష వింటూ, ఇబ్బంది లేకుండా తన్మయత్వంతో నేర్చుకుంటున్నారో అందులోనే మందగమనం మొదలైంది. -
వజ్రాయుధాన్ని వదులుకోవద్దు!
[ 04-05-2024]
ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వజ్రాయుధం. ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల అధికారులు ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
అర్బన్ నియోజకవర్గంలో ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి కోసం ఓటు వేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 04-05-2024]
కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
‘చక్కెర పరిశ్రమపై హస్తం పార్టీ డ్రామా’
[ 04-05-2024]
చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 04-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. -
ఓటింగ్ శాతంపెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. -
‘భాజపాతోనే అభివృద్ధి సాధ్యం’
[ 04-05-2024]
ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
‘పదేళ్లలో చేసిందేమీ లేదు’
[ 04-05-2024]
పదేళ్లలో ఎంపీ బీబీపాటిల్ బాన్సువాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీలేదని జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అన్నారు. -
నిర్భయంగా ఓటేయాలి
[ 04-05-2024]
నిర్భయంగా ఓటేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆవరణలోని సెల్ఫీపాయింట్ వద్ద శుక్రవారం స్వీయ చిత్రం దిగారు. -
ఎవరికెంత మెజార్టీ అంటే..!
[ 04-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 ఎన్నికలు జరిగాయి. -
ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు
[ 04-05-2024]
కాస్బాగ్ తండా వెనుక ప్రాంతంలో ఉన్న పోతుల మోరి వాగు చెక్డ్యామ్ వద్ద ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేసి వ్యాపారులు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. -
‘భాజపాను గద్దెదించాలి’
[ 04-05-2024]
ప్రజా సంక్షేమం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్న భాజపాను గద్దెదించాలని జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. -
‘గల్ఫ్ కార్మికుల ప్రశ్నలకు అర్వింద్ సమాధానాలు ఇవ్వాలి’
[ 04-05-2024]
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగేముందు నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీమ్రెడ్డి డిమాండ్ చేశారు. -
పురపాలికలకు ముందస్తు ఆదాయం
[ 04-05-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పురపాలికలకు ‘ముందస్తు’ ఆదాయం వచ్చింది. -
ఓట్లతోనే జాతీయ, ప్రాంతీయ పార్టీల గుర్తింపు
[ 04-05-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలు అని తరచూ వింటూ ఉంటాం. జాతీయ పార్టీలు దిల్లీ కేంద్రంగా, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల రాజధానుల కేంద్రంగా పనిచేస్తాయి. -
ఎన్నికల సహాయకేంద్రంలో సీసీ వీరంగం..!
[ 04-05-2024]
కలెక్టరేట్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి వద్ద సీసీగా పనిచేస్తున్న వ్యక్తి గురువారం రాత్రి కలెక్టరేట్లో వీరంగం సృష్టించినట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!