ఇంటికి పిలిచి.. సన్నిహితంగా ఉన్నట్లు నటించి..
ఫేస్బుక్ ద్వారా యువకులతో స్నేహం పెంచుకొని తర్వాత వారిని ఇంటికి పిలిచి దాడి చేసి వారి వద్దనున్న బంగారం, నగదు దోచుకుంటున్న ముఠాకు చెందిన నలుగురిని భువనేశ్వర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
దోచుకుంటున్న ముఠా అరెస్టు
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: ఫేస్బుక్ ద్వారా యువకులతో స్నేహం పెంచుకొని తర్వాత వారిని ఇంటికి పిలిచి దాడి చేసి వారి వద్దనున్న బంగారం, నగదు దోచుకుంటున్న ముఠాకు చెందిన నలుగురిని భువనేశ్వర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీసీపీ ప్రతీక్ సింగ్ విలేకరులకు అందించిన వివరాల ప్రకారం... భువనేశ్వర్ తమాండొ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై దర్యాప్తు జరిపి ఈ ముఠాను అరెస్టు చేశారు. ఇరానీ పాత్ర్ అనే మహిళ, ఆమె భర్త రవి పాత్ర్ ముఠాలో ప్రధాన పాత్ర పోషించేవారు. ఇరానీ పాత్ర్ తన ఫొటోలను పేస్బుక్లో ఉంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపేది. దానిని అంగీకరించినవారి ఫోన్ నెంబరు తీసుకొని రెచ్చగొట్టే మెసేజ్లు పంపేది. తర్వాత వారికి ఇంటికి పిలిచేది. అలా వెళ్లిన యువకుడ్ని ఏసీ గదిలో కూర్చోబెట్టేది. తర్వాత ఆయనతో కొంత సన్నిహితంగా ఉన్నట్లు నటించేది. అప్పటికే అక్కడున్న ఇద్దరు యువకులు రహస్యంగా ఈ దృశ్యాలను చిత్రీకరించేవారు. తర్వాత వారిద్దరూ వచ్చి ఆయనను మారణాయుధాలతో బెదిరించి బంగారం, డబ్బు దోచుకొనేవారు. మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి మరికొంత తీసుకునేది. భువనేశ్వర్కి చెందిన యువకుని భార్యకు ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.3.60 లక్షలు కాజేసినట్లు మరో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు ముఠాను అరెస్టు చేయడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో వీరిపై నమోదైన కేసులు వెలుగులోకి వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖుల బరి... ఎవరిదో విజయం మరి?
[ 02-05-2024]
పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. -
రాయగడలో ఎన్నికల వే‘ఢీ’
[ 02-05-2024]
రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్ లోక్సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. -
ఇంటింటా అభ్యర్థుల ప్రచారం
[ 02-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. -
పాండ్యన్ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ఖండన
[ 02-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే మిషన్శక్తి, బీఎస్కేవై కార్యక్రమాలు నిలిపివేయడం తథ్యమంటూ బిజద నేతలు చేస్తున్నది దుష్ప్రచారమని భాజపా నాయకులు స్పష్టం చేశారు. -
బిజద అంటే విరక్తి ఏర్పడింది: షానవాజ్
[ 02-05-2024]
సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారి పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, బిజద అంటే ప్రజల్లో విరక్తి ఏర్పడిందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి షానవాజ్ చౌదరి విమర్శించారు. -
ఈ ముద్ద మీకు.. మీ ఓట్లు మాకు
[ 02-05-2024]
అభ్యర్థులు ప్రచారానికి అందొచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఉత్సవం, పండగ, పెళ్లి.. ఇలా ఏదయినా హాజరై ఓట్లు అడిగేస్తున్నారు. -
మౌనం మాట్లాడింది
[ 02-05-2024]
వీరంతా అమాయక ఆదివాసీలు. కష్టం వచ్చినా.. బాధ కలిగినా తమలో తాము కుమిలిపోతారే తప్పా నోరు తెరిచి అడగరు. -
మౌలిక సౌకర్యాలు కల్పిస్తేనే ఓటేేస్తాం
[ 02-05-2024]
అపార ఖనిజ సంపదకు నిలయమైన కాశీపూర్ సమితిలో మారుమూల గ్రామాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. -
ఇంటిపై పడిన చెట్టు: చిన్నారికి గాయాలు
[ 02-05-2024]
నందపూర్ సమితిలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో చిన్నారికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM