ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజలకు ఒరిగేదేమిటి?
దుయ్యబట్టిన విపక్ష నేతలు
భువనేశ్వర్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి.
గతసారీ హామీలిచ్చారు
నవీన్కు కలిసొచ్చిన స్థానం హింజిలిజ గంజాం జిల్లాలోని ఈ స్థానం నుంచి ఆయన వరుసగా అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆరోసారి (ఈసారి) మళ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం తరచూ రాకపోయినా ఓటర్లు ఆయనకు పట్టం కడుతున్నారు. గతసారి రాజకీయ ఎత్తుగడలో భాగంగా పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ జిల్లా బిజెపూర్ నుంచి కూడా పోటీ చేశారు. భాజపా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికే ఈ పోటీ అని అప్పట్లో బిజద వర్గాలు చెప్పుకున్నాయి. ఆ సమయంలో సీఎం ఎన్నో హామీలిచ్చారు. దీంతో బిజెపూర్ వాసులు నవీన్ను గెలిపించారు. పోటీ చేసిన రెండు సీట్లు నిలబెట్టుకున్న సీఎం బిజెపూర్ను వదులుకున్నారు. అక్కడి ప్రజలకు తానిచ్చిన హామీలు మాత్రం విస్మరించబోనని చెప్పుకున్నారు. ఇందులో కీలకమైనది పదంపూర్ సబ్ డివిజన్కు జిల్లా హోదా. అయిదేళ్లయినా ఈ హామీ నెరవేరలేదు. తర్వాత ముఖం చాటేశారన్న అసంతృప్తి ప్రబలింది.
ఈసారి కంటాబంజి
ఈసారి నవీన్ హింజిలితోపాటు పశ్చిమ ఒడిశాలోని కంటాబంజి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్థానానికి పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోదీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్న వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో భాజపా దూకుడుకు పశ్చిమ ఒడిశాలో కళ్లెం వేయాలంటే తాను స్వయంగా రంగంలోకి దిగాలని ఆయన భావించారు.
నవీన్కు ఓటమి ఖాయం
కంటాబంజి సిటింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ సింగ్ సలూజా గురువారం కంటాబంజిలో విలేకరులతో మాట్లాడుతూ... నవీన్కు ఇక్కడ ఓటమి ఖాయన్నారు. ఒకసారి వంచనకు గురైన పశ్చిమ వాసులు మరో పొరపాటు చేయరని, విజ్ఞత కల ఓటర్లు బూటకం హామీలు విశ్వసించబోరని, కాంగ్రెస్ను మళ్లీ గెలిపిస్తారన్నారు.
సీఎం అబద్ధాల కోరు
దీనిపై మాజీ మంత్రి, భాజపా అగ్రనేత కనకవర్ధన్ సింగ్దేవ్ బుధవారం రాత్రి పాట్నాగఢ్లో విలేకరులతో మాట్లాడుతూ... సీఎంను అబద్ధాల కోరుగా అభివర్ణించారు. గతసారి బిజెపూర్ వాసులకు ఎన్నో హామీలిచ్చి విస్మరించిన నవీన్, ఈసారి కంటాబంజి (బొలంగీర్ జిల్లా) వాసులను మభ్యపెట్టడానికి సన్నద్ధమయ్యారన్నారు. పశ్చిమంలో భాజపా బలం ముందు బిజద నిలవదని గ్రహించి స్వయంగా పోటీకి సన్నద్ధమయ్యారన్నారు. ఈ ఎత్తుగడ ఫలితమివ్వదన్నారు.
మరో ఉపఎన్నిక అనివార్యం
సీఎల్పీ నేత నర్సింగ మిశ్ర గురువారం బొలంగీర్లో విలేకరులతో మాట్లాడుతూ... పశ్చిమ ఒడిశా ప్రాంతాల పట్ల విపక్ష చూపుతున్న నవీన్ మరోసారి ఓటర్లను మభ్యపెట్టడానికి కంటాబంజిని ఎంచుకున్నారన్నారు. ఒకవేళ ఇక్కడ ఆయన గెలిస్తే ఈ సీటు వదులుకోవడం ఖాయమని, తమ అంచనా ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత కంటాబంజి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖుల బరి... ఎవరిదో విజయం మరి?
[ 02-05-2024]
పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. -
రాయగడలో ఎన్నికల వే‘ఢీ’
[ 02-05-2024]
రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్ లోక్సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. -
ఇంటింటా అభ్యర్థుల ప్రచారం
[ 02-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. -
పాండ్యన్ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ఖండన
[ 02-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే మిషన్శక్తి, బీఎస్కేవై కార్యక్రమాలు నిలిపివేయడం తథ్యమంటూ బిజద నేతలు చేస్తున్నది దుష్ప్రచారమని భాజపా నాయకులు స్పష్టం చేశారు. -
బిజద అంటే విరక్తి ఏర్పడింది: షానవాజ్
[ 02-05-2024]
సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారి పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, బిజద అంటే ప్రజల్లో విరక్తి ఏర్పడిందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి షానవాజ్ చౌదరి విమర్శించారు. -
ఈ ముద్ద మీకు.. మీ ఓట్లు మాకు
[ 02-05-2024]
అభ్యర్థులు ప్రచారానికి అందొచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఉత్సవం, పండగ, పెళ్లి.. ఇలా ఏదయినా హాజరై ఓట్లు అడిగేస్తున్నారు. -
మౌనం మాట్లాడింది
[ 02-05-2024]
వీరంతా అమాయక ఆదివాసీలు. కష్టం వచ్చినా.. బాధ కలిగినా తమలో తాము కుమిలిపోతారే తప్పా నోరు తెరిచి అడగరు. -
మౌలిక సౌకర్యాలు కల్పిస్తేనే ఓటేేస్తాం
[ 02-05-2024]
అపార ఖనిజ సంపదకు నిలయమైన కాశీపూర్ సమితిలో మారుమూల గ్రామాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. -
ఇంటిపై పడిన చెట్టు: చిన్నారికి గాయాలు
[ 02-05-2024]
నందపూర్ సమితిలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో చిన్నారికి గాయాలయ్యాయి.