logo

ఆరుగురితో బిజద 7వ జాబితా

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోమవారం 6 అసెంబ్లీ స్థానాలకు 7వ జాబితా ప్రకటించారు. క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషార్‌కాంతి బెహరాకు, విద్యాశాఖ మంత్రి సుధాం మారాండి భార్య రంజితాకు, ఢెంకనాల్‌ ఎంపీ ముహేష్‌సాహుకు టికెట్లు కేటాయించారు.

Published : 23 Apr 2024 02:53 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోమవారం 6 అసెంబ్లీ స్థానాలకు 7వ జాబితా ప్రకటించారు. క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషార్‌కాంతి బెహరాకు, విద్యాశాఖ మంత్రి సుధాం మారాండి భార్య రంజితాకు, ఢెంకనాల్‌ ఎంపీ ముహేష్‌సాహుకు టికెట్లు కేటాయించారు.

అభ్యర్థులు వీరే..

తుషార్‌ కాంతి బెహరా (కాకట్‌పూర్‌), దంజితా మారండి (బంగిరిపొషి), మహేశ్వర సాహు (విందోళ్‌), బిశ్వరంజన్‌ మల్లిక్‌ (బొరి), అర్చనామల్లిక్‌ (రఘునాథపల్లి), శారదాజెనా (బలికుద - ఎరసమ)లు అభ్యర్థులుగా నిలిచారు. బిజద నాయకత్వం ఇంతవరకు 21 లోక్‌సభ, 141 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 6 సీట్లకు సంబంధించి బలాబలాల పరిశీలన ఇంకా తేలలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని