logo

నేడు నవీన్‌ నామినేషన్‌

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మంగళవారం గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Published : 30 Apr 2024 05:09 IST

నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మంగళవారం గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఛత్రపురం చేరుకోనున్న సీఎం తరాతరిణి శక్తిపీఠానికి వెళ్లి పూజలు చేస్తారు. తర్వాత ఆయన ఛత్రపురం రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేసి భువనేశ్వర్‌ ప్రయాణమవుతారు. ఆయన వరుసగా ఆరోసారి హింజిలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతసారి మాదిరిగా ఈసారి రెండు స్థానాల నుంచి బరిలో దిగుతున్నారు. బొలంగీర్‌ జిల్లా కంటాబంజి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. గతసారి సీఎం హింజిలితోపాటు బరగఢ్‌ జిల్లా బిజెపూర్‌ నుంచి పోటీ చేశారు. రెండుచోట్లా గెలిచారు. హింజిలి స్థానం ఉంచుకున్న నవీన్‌ బిజెపూర్‌ వదులుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని