భేష్.. ముహూర్త బలం
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట..
నేడే అత్యధిక నామినేషన్లు
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట..
ఈనాడు, విజయనగరం , న్యూస్టుడే, అర్బన్: ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆ ప్రకారం.. రెండు జిల్లాలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పదకొండు శాసనసభ స్థానాలకు ప్రధాన పార్టీల నుంచి 22 మంది అభ్యర్థుల పేర్లు ఖరారవ్వగా రెండో రోజు శుక్రవారం పది మంది నామినేషన్లు దాఖËలు చేస్తారు. తొలిరోజు నెలిమర్లలో నామినేషన్ వేసిన వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుతో కలుపుకొంటే రెండు రోజుల్లోనే 11 మంది పూర్తి చేసినట్లవుతుంది. ఈ నెల 25 వరకు గడువు ఉన్నప్పటికీ 19 నుంచి 25 వరకు మిగిలిన 11 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముహూర్తం నిర్ణయించారు. విజయనగరం ఎంపీ అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు (తెదేపా), బెల్లాన చంద్రశేఖర్ (వైకాపా), నియోజకవర్గాల వారీగా.. నెల్లిమర్ల- లోకం నాగమాధవి, గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్, రాజాం - కోండ్రు మురళీమోహన్, చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ, గజపతినగరం - బొత్స అప్పలనర్సయ్య, బొబ్బిలి - శంబంగి చిన అప్పలనాయుడు, ఎస్.కోట - కడుబండి శ్రీనివాసరావు, కురుపాం- పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ- కళావతి, సాలూరు - రాజన్నదొర (ముహూర్తానికి తొలిసెట్) శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్కసుడక్కడ.. ఇసుకాసురులిక్కడ!!
[ 02-05-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఇసుక తోడేళ్లు నదులపై పడ్డాయి.. ఈ ఐదేళ్లూ వాటిని గుల్ల చేసేశాయి.. నిత్యం టన్నుల మేర తవ్వేస్తూ తరలించుకుపోయాయి.. రూ.కోట్లలో లాభాలు ఆర్జించాయి.. -
నీ జమానాలో అక్కాచెల్లెమ్మలు బక్కచిక్కారు
[ 02-05-2024]
మైకు కనిపిస్తే చాలు... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎక్కడా లేని బంధుత్వాలు.. ఆప్యాయతలు.. తెగపుట్టుకొస్తాయి. ఏ వేదికపై మాట్లాడినా అక్కాచెల్లెమ్మలు.. నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. గిరిజనులు, మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామంటూ మాటలతో ఊదరగొట్టేస్తారు. -
నేడు పాలకొండలో వారాహి యాత్ర
[ 02-05-2024]
పాలకొండ పట్టణంలో గురువారం జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయ వారాహి యాత్ర జరగనుంది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరఘట్టం ప్రధాన రహదారిలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. -
వీరిని చూస్తుంటే బాధని‘పింఛన్’
[ 02-05-2024]
సామాజిక భద్రత పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులకు కష్టాలు వచ్చి పడ్డాయి. -
మన్యంలో ‘దారి’ద్య్రమిది..
[ 02-05-2024]
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు చెబుతున్నా మన్యంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఐదేళ్లలో గిరిశిఖర గ్రామాల రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో దారులు అధ్వానంగా మారాయి. -
అంతా ఓకేనా.. ఓ సెల్ఫీ తీసుకుందాం
[ 02-05-2024]
సాలూరు మండలం కురుకుట్టి, సారిక పంచాయతీల్లో బుధవారం ప్రచారం చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణితో పలువురు యువతులు స్వీయ చిత్రాలు తీసుకొని సందడి చేశారు. -
నీకు తప్ప.. రైతుకు ఏదీ భరోసా
[ 02-05-2024]
‘ఈ కేంద్రాల నుంచే వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అందుతాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాయి. -
ఒకటి పోయె.. రెండు వచ్చె
[ 02-05-2024]
సామాజిక భద్రత పింఛన్ల లబ్ధిదారులకు ఈ నెల నగదు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉందని, పరిశీలించాలని పండుటాకులు మొరపెట్టుకున్నా చెవికెక్కించుకోలేదు. -
జగన్ రాజ్యంలో.. ఇసుక దందా
[ 02-05-2024]
జగన్ రాజ్యంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతూ రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు రేవుల నుంచి విశాఖ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురానికి రోజూ వందల సంఖ్యలో లారీలతో తరలిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. -
పాలకా... విస్తరణ మరిచారా!
[ 02-05-2024]
‘పాలకొండ ప్రధాన రహదారిని అభివృద్ధి చేస్తున్నాం.. పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ఇరువైపులా పెద్ద కాలువలను నగర పంచాయతీ నిధులతో నిర్మించనున్నాం..’ అంటూ మూడేళ్ల క్రితం పాలకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. -
నేడు వెంకంపేటలో నితిన్ గడ్కరీ సభ
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అరకు పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థిని కొత్తపల్లి గీత తరఫున ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ గురువారం పార్వతీపురం వస్తున్నారు.