ఎస్.కోటను అభివృద్ధి చేస్తా
ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.
నియోజకవర్గాన్ని విశాఖలో కలుపుతాం
ప్రజాగళం సభలో చంద్రబాబు
మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు, చిత్రంలో శ్రీభరత్, కోళ్ల లలితకుమారి
శృంగవరపుకోట, గరివిడి, గజపతినగరం, కొత్తవలస, వేపాడ, ఎల్.కోట, న్యూస్టుడే: ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ఎస్.కోటలోని ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎన్నో కలలుగన్నాం. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాం. సుజల స్రవంతిని తీసుకువచ్చి ఎస్.కోట నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనుకున్నాం. గిరిజనుల ఉజ్వల భవిష్యత్తు కోసం గిరిజన విశ్వవిద్యాలయానికి భూమిపూజ చేశాం. కానీ జగన్ ప్రభుత్వం అభివృద్ధిని నీరుగార్చింది. విశాఖలో అదానీ డేటా సెంటరు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలను తరిమేసింది. దేశంలో ఏ మూలన గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖ జిల్లాలో ఉంటున్నాయి. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులు కొల్లగొట్టారు’ అని నిప్పులు చెరిగారు.
ప్రజాగళం సభకు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
యుద్ధానికి సిద్ధంగా..
‘శృంగవరపుకోట ప్రజలు యుద్ధానికి సిద్ధమని కాలు దువ్వుతున్నారు. ఇక్కడ జనాలను చూస్తుంటే సముద్రాన్ని తలపిస్తోంది. ఊళ్లకు ఊళ్లు కదిలి వచ్చాయి. మే 13న రాజకీయ పెనుతుపాను రాబోతోంది. ఆ తుపానులో వైకాపా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం’ అని చంద్రబాబు అన్నారు.
అవినీతి కోటగా మార్చేశారు..
‘జిల్లాను నిలువునా దోచేసిన మంత్రి బొత్స సత్యనారాయణ పక్కనున్న విశాఖ జిల్లాపై పడ్డారు. తన భార్యను విశాఖ ఎంపీగా పోటీలో పెట్టారు. అవినీతిపరులకు విశాఖ జిల్లా ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. ఇక్కడి ఎమ్మెల్యే శృంగవరపుకోటను అవినీతి కోటగా మార్చారు. ముఖ్యమంత్రి జగన్ రుషికొండకు బోడిగుండు కొట్టేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కడితే.. ఇక్కడ ఎమ్మెల్యే నేనేం తక్కువ కాదని కొండను తొలిచేసి రూ.50 కోట్లతో ప్యాలెస్ కట్టారు. అర్ధానపాలెం గ్రామంలో 100 ఎకరాల గిరిజనుల భూములను కొట్టేయడానికి చూస్తున్నారు’ అని ఆరోపించారు.
వరాల జల్లు
బీ శృంగవరపుకోటలో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. బీ విశాఖ- అరకు రోడ్డును జాతీయ రహదారిగా మార్చాం. అరకును టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం. విశాఖ- అరకు రోడ్డుకు ఇరువైపులా భూమి, నీరు ఉంది. పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం. బీ భీమసింగి చక్కెర కర్మాగారం పునరుద్ధరణకు ఏం చేయాలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. బీ జామిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తవలసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం.
విశాఖను తలదన్నేలా ప్రగతి..
‘శృంగవరపుకోట నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన విశాఖ జిల్లాలో కలుపుతాం. ఇక్కడి ప్రజలు విశాఖపైనే ఆధారపడతారు. విశాఖ పార్లమెంటు పరిధిలోనే ఈ నియోజకవర్గం ఉంది. కానీ ఆ జిల్లాలో కలపకుండా విజయనగరంలో ఉంచారు. మంత్రి బొత్స డ్రామాలాడి ఇదంతా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్.కోటను విశాఖ జిల్లాలో కలుపుతాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గద్దెనెక్కావ్.. చెరబట్టావ్
[ 04-05-2024]
ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు. -
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
[ 04-05-2024]
ఎందరో అభాగ్యులకు పింఛనే ఆధారం. ఆ డబ్బులు వస్తేనే పూట గడిచేది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరెందరో.. ఆ సొమ్ములతోనే మందులు కొనుక్కొని ప్రాణాలు నిలబెట్టుకునేది.. -
జగన్మోసం ఇంటింత కాదయా!
[ 04-05-2024]
పదేళ్ల కిందట సంభవించిన హుద్హుద్ తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తీరంతో పాటు వందలాది గ్రామాల్లో బీభత్సం సృష్టించి తీవ్ర నష్టం మిగిల్చింది. -
తరుణీ.. ఛీకొట్టాల్సిన తరుణమిదే!
[ 04-05-2024]
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు ప్రచారాలకు పదును పెడుతున్నారు. అధికార పార్టీ మహిళా ఓట్లపై దృష్టి పెట్టి తాయిలాల పంపిణీకి పథకాలు రూపొందిస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి మహిళలకు చీర, రూ.500 నోటు పంపిణీ చేస్తున్న వీడియో ఇటీవల చక్కర్లు కొట్టింది. -
ఆమె నేత్రాలు సజీవం
[ 04-05-2024]
మనిషి మరణించాక.. దేహంతో పాటు నేత్రాలను మట్టిలో కలిపేయడం కంటే వాటిని దానం చేస్తే మరో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించొచ్చు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన బండి సత్యవతి (73) వయోభారంతో గురువారం మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. -
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
[ 04-05-2024]
అప్పుల బాధ తాళలేక చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చందులూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. చందులూరు గ్రామానికి చెందిన వాడబోయిన అప్పలరాజు (36) అప్పులు చేసి తీర్చలేక అవస్థలు పడుతున్నాడు. -
కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు
[ 04-05-2024]
కూటమి విజయంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని జిల్లాలోని సాలూరు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయకృష్ణ, బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి అన్నారు. -
దళితవాడలని వదిలేశారా?
[ 04-05-2024]
పురపాలక పరిధిలోని ఎక్కువ జనాభా ఉన్న దళితవాడ నందమూరి కాలనీ సమస్యలు నెలవుగా మారింది. ఇక్కడి నివాసితులు శిథిÅల గృహాల్లో భయంతో జీవనం సాగిస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళితులకు 150 గృహాలతో నందమూరి కాలనీ నిర్మించారు. -
పాలకా.. ఇది మీ పాపమే
[ 04-05-2024]
భామిని మండలంలోని అంపోలు-బత్తిలి మార్గంలో కొరమ నుంచి బత్తిలి వరకు వెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తోంది. ఆరు నెలల కిందట రోడ్డును పూర్తిగా తవ్వేశారు. తారురోడ్డు వేయకుండా అలాగే వదిలేయడంతో దుమ్ము రేగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు