స్ట్రాంగ్ రూం తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదు
విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
పి.వెంకటరమణ
విజయనగరం గ్రామీణం, న్యూస్టుడే: విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వో లేని సమయంలో ఏఆర్వో అధికార పార్టీకి చెందిన బయట వ్యక్తులను ఎలా స్ట్రాంగ్ రూంలోకి అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూం విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, పోటీలో ఉన్న అభ్యర్థులందర్నీ పిలిచి సమావేశం నిర్వహించి అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈసీ చర్యలు తీసుకోవాలి: గీత
విజయనగరం అర్బన్: తహసీల్దారు కార్యాలయంలో అనధికార వ్యక్తుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను భద్రపరిచే స్ట్రాంగ్రూంను తెరవడంపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు చరవాణితో స్ట్రాంగ్ రూంలోకి వెళ్లి బ్యాలెట్లను తరలించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. స్థానిక అధికారులు వైకాపాతో కుమ్మక్కై తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీనివాసుడికి ప్రత్యేక అలంకరణ, పూజలు
[ 01-06-2024]
బలిజిపేట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వెలసిన శ్రీనివాసుడికి ఆలయ అర్చకులు జేబీ హరికృష్ణమాచార్యులు శనివారం ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. -
వేగావతి నది రూపురేఖలు కనుమరుగు
[ 01-06-2024]
మండలంలోని వంతరాం గ్రామ వేగావతి నది రూపరేఖలు పూర్తిగా మారిపోయాయి. -
విత్తనాల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
[ 01-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ ఏడీ కె. రత్నకుమారి అన్నారు. -
కలుషిత జలం.. కాలనాగు విషం
[ 01-06-2024]
ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛ జలం అందిస్తాం.. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్నాం.. పథకాలు నిర్మిస్తున్నాం.. పైపులైన్లు వేస్తున్నాం.. అంటూ అయిదేళ్లుగా మాటల కోటలు కట్టిన ప్రభుత్వం.. హామీలన్నీ నీటి మూటలుగానే మిగిల్చింది. నీటి పథకాలూ లేవు.. ఉన్నవీ పూర్తిస్థాయిలో గొంతు తడపడం లేదు. -
లెక్కింపునకు సర్వం సన్నద్ధం
[ 01-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. ఆ మేరకు జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాలు, అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పోలైన పోస్టల్ బ్యాలట్ పత్రాలను లెక్కించే ప్రక్రియ పార్వతీపురం ఉద్యాన కళాశాలలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. -
తరలిపోతున్న రబీ ధాన్యం
[ 01-06-2024]
ఈ ఏడాది రబీ సీజన్లో ధాన్యం పండించొద్దంటూ జలవనరులు, వ్యవసాయ శాఖలు రైతులను కోరుతూ వచ్చాయి. సాగునీటి వనరుల నుంచి నీరు విడుదలకు అవకాశం లేదని చెప్పాయి. మరోవైపు వ్యవసాయ శాఖ అపరాలు, తృణధాన్యాలను ప్రోత్సహించాలని భావించింది. -
వంబరిల్లి ప్రమాదంలో మరో మహిళ మృతి
[ 01-06-2024]
ఆటో బోల్తా పడి తీవ్రంగా గాయపడిన ఓ గిరిజన మహిళ విశాఖపట్నంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. సీతంపేట ఎస్సై ఎం.జగదీశ్ నాయుడు వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు
[ 01-06-2024]
అమనాం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. సవరవిల్లికి చెందిన బి.రమేష్, బి.జగన్, జి.గణేష్ ద్విచక్ర వాహనంపై సవరవిల్లి నుంచి పోలిపల్లి వెళ్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో కార్మికుడి మృత్యువాత
[ 01-06-2024]
పెట్రోలు బంకులో పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రాజాంలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం రాజాం మండలం వీఆర్.అగ్రహారం గ్రామానికి చెందిన బి.రామచంద్రరావు(54) పట్టణంలోని చీపురుపల్లి రహదారిలో ఉన్న ఓ బంకులో పనిచేస్తున్నాడు. -
4 వేల ఎకరాల ఎదురు చూపులు!!
[ 01-06-2024]
పక్కనే సాగునీటి కాలువలు.. అయినా చుక్కనీరందని పరిస్థితి వెంగళరాయ సాగర్ జలాశయ పరిధిలోని పంట పొలాలది. ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్నవాటిదీ అదే దుస్థితి. దీనికి ప్రధాన కారణం అక్విడక్ట్ లేకపోవడమే. -
సాలూరులో పింఛనుదారు
[ 01-06-2024]
పండుటాకుల బ్యాంకు ఖాతాలకు పింఛను జమ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకు ఖాతాలకు, ఆధార్ సంఖ్యలు అనుసంధానం కాకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. -
రూ.లక్ష కోసం రెండు హత్యలు
[ 01-06-2024]
ఒకరి ఆశ.. రెండు ప్రాణాలను బలిగొంది.. నాణెం ఎర చూపి స్నేహం ముసుగులో దంపతులను కిరాతకంగా హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీతంపేట మండలంలోని పులిపుట్టిలో కలకలం రేపిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. -
ఇద్దరి ప్రాణాలు బలిగొన్న మలుపు
[ 01-06-2024]
విజయనగరం జిల్లా కేంద్రంలోని రామారాయుడు రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తూ డివైడర్ను ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మృతులిద్దరూ నగరంలోని లంకాపట్నం వాసులు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.. -
అమ్మో.. పార్వతీపురం రోడ్లా!!
[ 01-06-2024]
పార్వతీపురం జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా.. రావాలన్నా గుండెలు పట్టుకుని రాకపోకలు సాగించాల్సిందే. పట్టణానికి నలువైపులా ఉన్న ప్రధాన రహదారుల అధ్వాన దుస్థితే ఈ పరిస్థితి గల కారణం.
తాజా వార్తలు (Latest News)
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్
-
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
-
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..