జీర్ణావస్థలో జీసీసీ
గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని ప్రభుత్వం ఖూనీ చేసింది.
అయిదేళ్లలో నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం
మరమ్మతులకు నోచుకోని లేవిడి జీసీసీ డిపో భవనం
గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని ప్రభుత్వం ఖూనీ చేసింది. 1960లో మార్కెటింగ్ సొసైటీగా ఏర్పడి గిరిజన సహకార సంస్థగా మారి దశాబ్దాల పాటు సేవలందించిన జీసీసీ కేవలం అయిదేళ్లలో నామరూపాల్లేకుండా పోయింది. దీంతో అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడంలేదు.
న్యూస్టుడే, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట, మక్కువ
ఇదీ చేయాల్సింది..
విశాఖ కేంద్రంగా జీసీసీ పని చేస్తోంది. పార్వతీపురం మన్యంలో పార్వతీపురం, సీతంపేట డివిజన్లుగా సేవా, వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు శాఖల పరిధిలో 102 డిపోలు, సీతంపేట పరిధిలో సీతంపేట, భామిని మండలాల్లో పలు డిపోలు ఉన్నాయి.
- గిరిజనులు అడవి నుంచి సేకరించిన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి.
- వ్యవసాయ కాలంలో పంట రుణాల కోసం వడ్డీ వ్యాపారులు, దళారుల బారిన పడకుండా గిరిజనులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించాలి.
- గిరిజనులకు అవసరమైన రోజువారీ సరకులు డీఆర్ డిపోల ద్వారా తక్కువ ధరకే చేరువ చేయాలి.
సంతలకు సరకులు తీసుకొస్తున్న గిరిజనులు
కానరాని కొనుగోళ్లు..
గిరిజనుల ప్రధాన పంట ఉత్పత్తి చింతపండును గతంలో వేల టన్నుల్లో కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వందల్లోనూ కొనడం లేదు. కొండచీపుర్లు, నరమామిడిచెక్క, ఇండుగ పిక్కలు, విప్పపప్పు, విప్పపువ్వు, కరక్కాయలు, కొండతామర జిగురు, ఉసిరిక పప్పు, తానికాయ, నల్ల జీడిపిక్కలు, తేనె మొదలైనవి కొనేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేక గిరిజనులు వారపు సంతలకు తీసుకువచ్చి అమ్ముతున్నారు.
రుణాలు కల్పించలేని పరిస్థితి..
గిరిజనులను వడ్డీ వ్యాపారుల నుంచి రక్షించేందుకు వ్యవసాయ రుణాలను జీసీసీ ఇవ్వాల్సి ఉన్నా లక్ష్యాలను చేరలేకపోతోంది. ఇప్పటికే ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేసే యంత్రాంగం లేకపోవడంతో చతికిలపడింది. దీంతో రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జీసీసీలో ఉద్యోగుల విరమణ తప్ప కొత్త నియామకాలు లేవు. ఒకప్పుడు వేలల్లో ఉండే ఉద్యోగుల సంఖ్య నేడు వందల్లోకి చేరింది. మరో ఆరు నెలల్లో వీరి సంఖ్య మరింత తగ్గనుంది. అప్పుడు జీసీసీని నడిపించే వారే కానరారు.
శిథిల భవనాల్లో విధులు
పార్వతీపురం డివిజన్ పరిధిలో 102 డీఆర్ డిపోలున్నాయి. సుమారు 60 శాతం సొంతవి. 30 శాతం వరకు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులకు 2022లో రూ.1.90 కోట్లతో, తర్వాత రూ.2.25 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా ఎలాంటి నిధులు విడుదల కాలేదు. గొరడ, దేరువాడ, దుడ్డుఖల్లు, కూనేరు, సారిక ప్రాంతాల్లో కొత్త డిపోల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. దీంతో శిథిల భవనాల్లోనే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో నిత్యావసర సరకులు తడుస్తున్నా రక్షణ లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీనివాసుడికి ప్రత్యేక అలంకరణ, పూజలు
[ 01-06-2024]
బలిజిపేట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వెలసిన శ్రీనివాసుడికి ఆలయ అర్చకులు జేబీ హరికృష్ణమాచార్యులు శనివారం ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. -
వేగావతి నది రూపురేఖలు కనుమరుగు
[ 01-06-2024]
మండలంలోని వంతరాం గ్రామ వేగావతి నది రూపరేఖలు పూర్తిగా మారిపోయాయి. -
విత్తనాల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
[ 01-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ ఏడీ కె. రత్నకుమారి అన్నారు. -
కలుషిత జలం.. కాలనాగు విషం
[ 01-06-2024]
ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛ జలం అందిస్తాం.. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్నాం.. పథకాలు నిర్మిస్తున్నాం.. పైపులైన్లు వేస్తున్నాం.. అంటూ అయిదేళ్లుగా మాటల కోటలు కట్టిన ప్రభుత్వం.. హామీలన్నీ నీటి మూటలుగానే మిగిల్చింది. నీటి పథకాలూ లేవు.. ఉన్నవీ పూర్తిస్థాయిలో గొంతు తడపడం లేదు. -
లెక్కింపునకు సర్వం సన్నద్ధం
[ 01-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. ఆ మేరకు జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాలు, అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పోలైన పోస్టల్ బ్యాలట్ పత్రాలను లెక్కించే ప్రక్రియ పార్వతీపురం ఉద్యాన కళాశాలలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. -
తరలిపోతున్న రబీ ధాన్యం
[ 01-06-2024]
ఈ ఏడాది రబీ సీజన్లో ధాన్యం పండించొద్దంటూ జలవనరులు, వ్యవసాయ శాఖలు రైతులను కోరుతూ వచ్చాయి. సాగునీటి వనరుల నుంచి నీరు విడుదలకు అవకాశం లేదని చెప్పాయి. మరోవైపు వ్యవసాయ శాఖ అపరాలు, తృణధాన్యాలను ప్రోత్సహించాలని భావించింది. -
వంబరిల్లి ప్రమాదంలో మరో మహిళ మృతి
[ 01-06-2024]
ఆటో బోల్తా పడి తీవ్రంగా గాయపడిన ఓ గిరిజన మహిళ విశాఖపట్నంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. సీతంపేట ఎస్సై ఎం.జగదీశ్ నాయుడు వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు
[ 01-06-2024]
అమనాం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. సవరవిల్లికి చెందిన బి.రమేష్, బి.జగన్, జి.గణేష్ ద్విచక్ర వాహనంపై సవరవిల్లి నుంచి పోలిపల్లి వెళ్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో కార్మికుడి మృత్యువాత
[ 01-06-2024]
పెట్రోలు బంకులో పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రాజాంలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం రాజాం మండలం వీఆర్.అగ్రహారం గ్రామానికి చెందిన బి.రామచంద్రరావు(54) పట్టణంలోని చీపురుపల్లి రహదారిలో ఉన్న ఓ బంకులో పనిచేస్తున్నాడు. -
4 వేల ఎకరాల ఎదురు చూపులు!!
[ 01-06-2024]
పక్కనే సాగునీటి కాలువలు.. అయినా చుక్కనీరందని పరిస్థితి వెంగళరాయ సాగర్ జలాశయ పరిధిలోని పంట పొలాలది. ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్నవాటిదీ అదే దుస్థితి. దీనికి ప్రధాన కారణం అక్విడక్ట్ లేకపోవడమే. -
సాలూరులో పింఛనుదారు
[ 01-06-2024]
పండుటాకుల బ్యాంకు ఖాతాలకు పింఛను జమ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకు ఖాతాలకు, ఆధార్ సంఖ్యలు అనుసంధానం కాకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. -
రూ.లక్ష కోసం రెండు హత్యలు
[ 01-06-2024]
ఒకరి ఆశ.. రెండు ప్రాణాలను బలిగొంది.. నాణెం ఎర చూపి స్నేహం ముసుగులో దంపతులను కిరాతకంగా హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీతంపేట మండలంలోని పులిపుట్టిలో కలకలం రేపిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. -
ఇద్దరి ప్రాణాలు బలిగొన్న మలుపు
[ 01-06-2024]
విజయనగరం జిల్లా కేంద్రంలోని రామారాయుడు రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తూ డివైడర్ను ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మృతులిద్దరూ నగరంలోని లంకాపట్నం వాసులు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.. -
అమ్మో.. పార్వతీపురం రోడ్లా!!
[ 01-06-2024]
పార్వతీపురం జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా.. రావాలన్నా గుండెలు పట్టుకుని రాకపోకలు సాగించాల్సిందే. పట్టణానికి నలువైపులా ఉన్న ప్రధాన రహదారుల అధ్వాన దుస్థితే ఈ పరిస్థితి గల కారణం.
తాజా వార్తలు (Latest News)
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్
-
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
-
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..