వేదన వినండి
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కలెక్టరేట్కు వచ్చి తమ వేదన వినిపించుకుంటే పరిష్కారం లభిస్తుందన్న ఆశ. సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో కనిపించిన కొంతమందిని పలకరించినపుడు తమ ఆవేదన వినిపించారు
- ఈనాడు, ఒంగోలు
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కలెక్టరేట్కు వచ్చి తమ వేదన వినిపించుకుంటే పరిష్కారం లభిస్తుందన్న ఆశ. సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో కనిపించిన కొంతమందిని పలకరించినపుడు తమ ఆవేదన వినిపించారు
చక్రాల కుర్చీలో స్పందన భవన్కు వస్తున్న యాకూబ్
మర్రిపూడి మండలం యల్లంపల్లికి చెందిన యాకూబ్ బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంతో నడవలేని స్థితికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోరుతూ ఇప్పటికి పది దఫాలు స్పందనకు వచ్చి వినతులు అందించారు. తనకు వచ్చే పింఛనుతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, రేషన్ బియ్యమే ఆధారమన్నారు. తనకు సాయం కోరుతూ మరో దఫా వినతి ఇచ్చారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధ దంపతుల పేర్లు కాశింపీరా, ఖాదర్బి. వీరిది కంభం మండలం కందులాపురం. 1994లో గ్రామంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం బతుకుదెరువు కోసం కర్నాటక వలస వెళ్లారు. వీరు స్థానికంగా లేకపోవడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించేశాడని వీరు వాపోయారు. మండల అధికారులు, పోలీసులను కలిసి తమ సమస్యపై పలు దఫాలు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో సోమవారం కలెక్టర్ను కలిసి అర్జీ అందించారు.
ఏడాదిగా వేతనాలు లేవు
కలెక్టర్కు సమస్యలు వివరిస్తున్న ఎఫ్ఎన్ఓలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పారిశుద్ధ్య కార్మికులుగా, కాపలాదారులుగా, వైద్యులకు సహాయకులుగా (ఎఫ్ఎన్ఓలు) దాదాపు వందమంది పనిచేస్తున్నారు. ‘ఆప్కాస్’ కింద ఒప్పంద ఉద్యోగులుగా ప్రభుత్వం వీరిని నియమించింది. అందరికీ వ్యక్తిగత గుర్తింపు కార్డులూ మంజూరు చేశారు. 60 మందికి మాత్రమే ప్రతీ నెలా వేతనాలు వస్తున్నాయి. మిగిలిన 40 మందికి గత ఏడాదిగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలూ వీరి కుటుంబ సభ్యులకు వర్తించకుండా పోయాయి. కలెక్టర్ దినేష్కుమార్ను కలిసి వారంతా తమ గోడు విన్నవించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15,87,681 మంది మదిలో ఏముందో!
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. మే 13న ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. తామెవరికి జైకొట్టిందీ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలుండగా, వాటి పరిధిలో 18,22,470 మంది ఓటర్లున్నారు. -
పులొస్తుంది.. వేటాడుతుంది
[ 03-06-2024]
పులుల సంరక్షణ కేంద్రాల్లో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఒకటి. విస్తీర్ణంలో ఇది దేశంలోని యాభై మూడింటిలోనే పెద్దది. జిల్లాలో మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలోని పెద్దదోర్నాల, కొర్రప్రోలు, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, నెక్కంటి, వీపీ సౌత్, మార్కాపురం రేంజ్లలో విస్తరించి ఉంది. -
వై.పాలెం పోలీసులా! చెవిరెడ్డి తొత్తులా!!
[ 03-06-2024]
యర్రగొండపాలెం ఆర్వోగా శ్రీలేఖ బాధ్యతలు చేపట్టింది మొదలు నిజాయతీగా వ్యవహరించారు. అధికార యంత్రాంగం నుంచి సహాయ నిరాకరణ ఎదురైనా తన విధులు తాను నిర్వర్తించారు. -
రానున్న ఫలితాల్లో కూటమి ప్రభంజనం
[ 03-06-2024]
మే 13న నాటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తెదేపా కూటమి తరఫున నిలిచారు. ఆ విషయాన్నే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ వెల్లడించాయి. మంగళవారం వెలువడే అసలైన ఫలితాలూ అదే చెప్పనున్నాయి. -
తపాలా ఓట్లపై వైకాపా కుయుక్తులు
[ 03-06-2024]
‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైకాపా కుయుక్తులు పన్నుతోంది. లెక్కింపు సమయంలో ఆ పార్టీ ఏజెంట్లు గొడవలకు దిగే అవకాశం ఉంది. -
నడిబొడ్డున కబ్జా దుకాణం
[ 03-06-2024]
యంత్రాంగం పర్యవేక్షణ లోపంతో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. పట్టణం నడిబొడ్డున చిన్న జాగాలో పాగా వేసి దుకాణం తెరుస్తున్నారు. దాన్ని అద్దెకిచ్చి వేల రూపాయలు దండుకుంటున్నారు. -
ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావివ్వొద్దు
[ 03-06-2024]
ఈ నెల 4న రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
పశ్చిమంలో కుండపోత
[ 03-06-2024]
నిప్పుల కుంపటిలా మారిన పశ్చిమంపై వరుణుడు కరుణ చూపాడు. సెగలు కక్కుతున్న కనిగిరి, కంభం, బేస్తవారపేట ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. -
వరుస చోరీలతో బెంబేలు
[ 03-06-2024]
పట్టపగలే దొంగతనాలతో జనం బెంబేలెత్తుతున్నారు. పోలీసుల నిఘా లోపంతో చోరులు పేట్రేగిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. గత కొంతకాలంగా జిల్లా శివార్లలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. -
కొత్తపాలెంలో రూ.4 లక్షల సొత్తు చోరీ
[ 03-06-2024]
శనివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో సుమారు రూ.నాలుగు లక్షల విలువైన సొత్తు చోరీకి గురైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. -
కుమారుడ్ని తుపాకీతో కాల్చిచంపిన కానిస్టేబుల్ అరెస్టు
[ 03-06-2024]
క్షణికావేశంతో కుమారుడ్ని తన సర్వీసు రివాల్వర్తో కాల్చిచంపిన కానిస్టేబుల్ను ఆదివారం అరెస్టు చేశారు. భాగ్యనగర్ నాలుగోలైన్లోని ఈవీఎం, వీవీప్యాడ్ల రిజర్వ్డ్ గోదాం వద్ద ఏఆర్ కానిస్టేబుల్ కొదమల ప్రసాద్బాబు
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఢీకొన్న విమానాలు.. పైలట్ మృతి.. వీడియోలో రికార్డయిన దృశ్యాలు!
-
కాసేపట్లో తెలంగాణ పాలిసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో
-
తాగి ఉన్నా.. మర్చిపోయా!: పుణె కారు ప్రమాద నిందితుడి సమాధానం
-
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మిస్సింగ్
-
కత్తితో దాడి చేసినా.. హైదరాబాద్లో దొంగలను ప్రతిఘటించిన యువకుడు
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్లివే!