కాలువలు తవ్వి పదేళ్లు
పొలాలను ఆనుకునే కాలువలు ఉన్నా సాగునీరు రాని దుస్థితి. జలాశయంలో సాగునీరున్నా సేద్యం చేయలేని పరిస్థితి. కాలువలు వస్తే పంటలు పుష్కలంగా పండుతాయనుకున్న రైతులకు చివరకు నిరాశే మిగిలింది.
గుర్రాలపాలెం సమీపంలో పనికిరాని మొక్కలతో నిండిపోయిన మడ్డువలస కాలువ
లావేరు, న్యూస్టుడే: పొలాలను ఆనుకునే కాలువలు ఉన్నా సాగునీరు రాని దుస్థితి. జలాశయంలో సాగునీరున్నా సేద్యం చేయలేని పరిస్థితి. కాలువలు వస్తే పంటలు పుష్కలంగా పండుతాయనుకున్న రైతులకు చివరకు నిరాశే మిగిలింది. జిల్లాలోని మడ్డువలస ప్రాజెక్టు కింద లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, పొందూరు మండలాల పరిధిలో పరిస్థితి ఇది.
ఇదీ పరిస్థితి..: లావేరు మండల పరిధిలోని కొత్త, పాతకుంకాం, గుర్రాలపాలెం, అదపాక, బుడుమూరు పంచాయతీలతో పాటు ఎచ్చెర్ల మండలం అరిణాంఅక్కివలస, అల్లినగరం, పొందూరు మండలంలోని రాపాక తదితర ప్రాంతాలతో పాటు జి.సిగడాం మండలంలోని 12 పంచాయతీలకు మడ్డువలస ప్రాజెక్టు ద్వారా సాగు నీరందాల్సి ఉంది. ఈ మండలాల పరిధిలో 22 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వకాలు చేపట్టగా 12,500 ఎకరాలకు సాగు నీరందాల్సింది. కాలువ తవ్వకాలు పూర్తయినప్పటికీ చుక్కనీరు రాలేదని ఆయా గ్రామాలకు చెందిన రైతులు వాపోతున్నారు. పలుమార్లు ప్రాజెక్టు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోతున్నారు. అప్పట్లో జి.సిగడాం మండల పరిధిలోని దేవరవలస సమీపంలో కాలువకు అడ్డంగా పెద్ద బండరాయి ఉండటంతో దిగువ ప్రాంతానికి నీరు రావడం లేదని అధికారులు తెలిపారు. ఇటీవలే ఈ రాయిని కొంతమేర తొలగించారు. ఈ ఏడాదైనా సాగునీరు వస్తుందాని ఎదురు చూస్తున్నారు.
పూడిపోతున్న వైనం: కాలువలను నిరుపయోగంగా వదిలేయడంతో ప్రస్తుతం పనికిరాని మొక్కలు, ముళ్లపొదలు, ఎక్కడికక్కడ గట్లు మరమ్మతులకు గురై దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతం రైతులు నీరు లేక నీలగిరి, సరుగుడు తోటలు వేసుకుంటున్నారు.
ఏళ్లతరబడి..: మడ్డువలస జలాశయం ద్వారా సాగునీరు వస్తుందని విలువైన భూములను తక్కువ ధరకు ఇచ్చాం. కాలువ తవ్వకాలు చేపట్టడంతో ఎంతో సంతోషపడ్డాం. ఏళ్లు గడుస్తున్నా చుక్కనీరు రాని పరిస్థితి. ఏటా ఎదురుచూపులే మిగులుతున్నాయి.
కె.దామోదరరావు, రైతు, కొత్తకుంకాం, లావేరు మండలం
అధికారులు పట్టించుకోవడం లేదు: పొలాల్లో నుంచి కాలువ తవ్వకాలు చేపట్టి వదిలేశారు. సాగునీరు విడుదల చేయడం మరిచారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కాలువల్లో పనికిరాని మొక్కలు దట్టంగా పెరిగాయి. వచ్చే ఖరీఫ్ నాటికైనా సాగునీరు విడుదల చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది.
ఎ.కృష్ణ, పెద్దకొత్తపల్లి, లావేరు మండలం
రూ.22 కోట్లతో పనులు: మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్-2 కింద రూ.22 కోట్లతో కాలువలు అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం. కొంతమేర భూసేకరణ చేయాల్సి ఉంది. అదీ పూర్తిచేస్తాం. కాలువల్లో ఉన్న పొదలు తదితర వాటిని తొలగించి వచ్చే ఖరీఫ్ నాటికి 4 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నాం.
డీవీ రమణ, డీఈఈ, మడ్డువలస ప్రాజెక్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్