అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.
విస్తృత స్థాయి సమావేశాల్లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
కాంగ్రెస్, భాజపాల తీరుపై మండిపాటు
వరంగల్ లోక్సభ అభ్యర్థి డా.సుధీర్కుమార్ను పరిచయం చేస్తూ మాట్లాడుతున్న భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. చిత్రంలో ఎడమ నుంచి కుడికి ఎమ్మెల్సీ, లోక్సభ ఎన్నికల తూర్పు ఇన్ఛార్జి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డా.టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ బొల్లం సంపత్కుమార్, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్, డాక్టర్ హరిరమాదేవి, రాకేష్రెడ్డి తదితరులు
ఈనాడు, వరంగల్, కరీమాబాద్, బాలసముద్రం, న్యూస్టుడే: వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలకు హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్, భాజపాలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఇటీవల పార్టీలు మారిన కడియం శ్రీహరి, అరూరి రమేశ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారాస అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ను గెలిపించాలని కోరారు. మంగళవారం సాయంత్రం హెలికాప్టర్లో హనుమకొండకు చేరుకున్న ఆయన ముందుగా హనుమకొండ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ట్రోఫీ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు తర్వాత వరంగల్ ఉర్సు ప్రాంతంలోని నానిగార్డెన్లో జరిగిన తూర్పు, అక్కడి నుంచి హంటర్రోడ్డులోని డీ కన్వెన్షన్లో జరిగిన వర్ధన్నపేట విస్తృత స్థాయి సమావేశాలకు హాజరై ప్రసంగించారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ చేతిలో మోసపోకూడదంటే భారాస అభ్యర్థిని గెలిపించాలన్నారు. కేటీఆర్ తన ప్రసంగంలో పలుమార్లు భారాసకు బదులు తెరాస అని ప్రస్తావించారు.
వరంగల్ తూర్పు సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులు..
వరంగల్ అభివృద్ధి కోసం భారాసకు ఓటేయాలి..
కాంగ్రెస్ పాలనలో వరంగల్ విధ్వంసానికి గురైందని భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ ఆరోపించారు. 1930లోనే వరంగల్లో ఏర్పాటు చేసిన విమానాశ్రయం అజంజాహిమిల్లు, దేశాయిపేట తోళ్లపరిశ్రమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మూతపడ్డాయని అన్నారు. పరిశ్రమలు రావాలన్నా, వరంగల్ అభివృద్ధి చెందాలన్నా భారాసకు ఓటేయాలని ప్రజలను కోరారు.
ఎవరు ఏమన్నారంటే..
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి కాంగ్రెస్ నాయకుల మధ్య చిచ్చుపెడుతున్నారని.. ఎక్కువ రోజులు ప్రభుత్వం కొనసాగదని అన్నారు. కడియం, అరూరి, మార్నేని పదవులు అనుభవించి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. భారాస అభ్యర్థి 50 వేల ఆధిక్యంతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
- అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసో తెలియకో తప్పుచేశామని.. మరోసారి తప్పు జరగకుండా భారాస ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కోరారు.
- మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కడియం శ్రీహరి, కాంగ్రెస్ అభ్యర్థి కావ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కడియం అవకాశవాది అని, నకిలీ దళితుడు, అవినీతి పరుడు, పదేళ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన అవినీతిపై ఖల్నాయక్ అనే పుస్తకమే వచ్చిందని ధ్వజమెత్తారు. కడియం శ్రీహరి, అతని కూతురు కావ్యది ఏ కులమో చెప్పాలని సవాలు విసిరారు. రేవంత్రెడ్డి మంత్రివర్గంలో ఒక్క మాదిగకు కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదని ఆరోపించారు.
- మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు ప్రజలకు దూరంగా ఉంటున్న మంత్రి సురేఖ భారాస హయాంలో తాను చేసిన రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులను ఆమె చేసినట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- భారాస హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్ మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు సుధీర్కుమార్ను ఉద్యమస్ఫూర్తితో గెలిపించాలని కోరారు.
సమావేశానికి దూరంగా మేయర్
భారాస సమావేశానికి నగర మేయర్ గుండు సుధారాణి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. తూర్పు నియోజకవర్గ సమావేశ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్పై సైతం ఆమె ఫొటోను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.ఆమె ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టి కప్పుతూ.. మాయ చేస్తూ..!
[ 04-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కళ్ల ముందే.. దోచేస్తున్నా.. రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిన్నకుండి పోతున్నారు. -
ఎక్కడ తూటా పేలినా ఇక్కడ ఉలికిపాటు!
[ 04-05-2024]
మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలకపాత్ర. పీపుల్స్వార్ ఉద్యమంలో చేరి కీలక పదవులను చేపట్టారు. -
ఓరుగల్లు వాసికి భారాస అవకాశం
[ 04-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏనుగుల రాకేశ్రెడ్డిని తమ అభ్యర్థిగా భారాస ప్రకటించింది. -
జాతీయ రహదారి.. అభివృద్ధికి మార్గసూచి!
[ 04-05-2024]
రాష్ట్రంలో జాతీయ రహదారుల అనుసంధానం కలిగిన జిల్లాల్లో ఖమ్మం తర్వాత ఉమ్మడి వరంగల్ ఉంటుంది. ఇవి వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 847.62 కి.మీ. విస్తరించాయి. -
రేపటి నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ నెల 5న ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత పరీక్ష -2024 (నీట్)కు నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. -
ఓటు సామాజిక బాధ్యత
[ 04-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
‘కడియంది వెన్నుపోట్ల చరిత్ర’
[ 04-05-2024]
ఓటర్లు తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. -
వేసవి సెలవులు.. ఆటపాటలతో బాలానందం కొలువు
[ 04-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు బాలలు సిద్ధమయ్యారు. -
మట్టిని కొల్లగొడుతున్నారు!
[ 04-05-2024]
జిల్లా కేంద్రంలో మొరం, మట్టి వ్యాపారాన్ని కొందరు గుత్తేదారులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా తయారు చేసి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
నోరు మెదపని వారిని లోక్సభకు పంపొద్దు: సీతారాంనాయక్
[ 04-05-2024]
నోరు మెదపని వారిని పార్లమెంట్కు పంపొద్దని భాజపా ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ కోరారు. -
దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు
[ 04-05-2024]
వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల అధికారులు శుక్రవారం నుంచి ఇంటి వద్దనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. -
8న లక్ష్మీపురంలో ప్రధాని మోదీ బహిరంగ సభ
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని లక్ష్మీపురంలో ఈ నెల 8న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు భాజపా శ్రేణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు
[ 04-05-2024]
వరంగల్ జిల్లా ఖానాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయి. -
రూ.2తో ఓటు సవాలు
[ 04-05-2024]
కేవలం రూ.2లతో ఓటును సవాలు (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు..
[ 04-05-2024]
వ్యాపారి నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వాలని బాధితుడు నిలదీస్తే ‘మాకు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు. -
ద్విచక్రవాహనంతో సహా బావిలో పడి ఒకరి మృతి
[ 04-05-2024]
రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో ద్విచక్రవాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన