గ్రామీణ రహదారులకు మోక్షం
అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో రహదారులు చిన్నాభిన్నమయ్యాయి. పెద్దపెద్ద గోతులతో రాకపోకలు సాగించలేని దుస్థితికి చేరాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేవారికి నరకం చూపిస్తున్నాయి. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులనే తేడా లేకుండా ఘోరంగా
ఏటూరు-రామిరెడ్డిపల్లె రహదారి దుస్థితి
ఈనాడు, డిజిటల్ కడప అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో రహదారులు చిన్నాభిన్నమయ్యాయి. పెద్దపెద్ద గోతులతో రాకపోకలు సాగించలేని దుస్థితికి చేరాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేవారికి నరకం చూపిస్తున్నాయి. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులనే తేడా లేకుండా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇటు రహదారులు, భవనాలశాఖ అటు పంచాయతీరాజ్శాఖలో గత రెండేళ్లుగా మరమ్మతులు చేపట్టలేదు. ఏటా చేపట్టే నిర్వహణ పనులను గాలికొదిలేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులకు మోక్షం కలిగించే కబురు కేంద్రం నుంచి అందింది. వడ్డీలేని రుణం ఇవ్వడానికి పచ్చజెండా ఊపింది. ఇదే తరుణంలో గుత్తేదారులకు బిల్లుల బకాయిల చెల్లింపులు మెరుగుపడుతున్నాయి.
కేంద్రం ఆర్థిక సాయం...
కేంద్రం నుంచి రూ.1,072 కోట్ల ఆర్థిక సాయం వడ్డీలేని రుణం కింద త్వరలో పంచాయతీరాజ్శాఖ ఇంజినీరింగ్ విభాగానికి అందనుంది. ఈ నిధులతో సుమారు 4,600 కిలోమీటర్ల పొడవున్న 1,646 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. పాఠశాలలు, వైద్యశాలల అభివృద్ధి తరహాలో చేపట్టిన నాడు- నేడు కింద రహదారుల పనులు జరగనున్నాయి. ప్రస్తుత రహదారుల స్థితి... బాగు చేసిన అనంతరం చిత్రాలను తీసి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ప్రస్తుత రహదారుల స్థితిని ఫొటోలు తీయించడం ప్రారంభించారు. రహదారుల అభివృద్ధికి కేటయించిన నిధుల మళ్లింపునకు అవకాశం లేకుండా ఎస్ఎన్ఏ ఖాతా కిందకు తీసుకొస్తున్నారు. పనులు చేపట్టబోయే గుత్తేదారులకు సీఎంఎంఎస్ పేరుతో కాకుండా ఆస్క్రో ఖాతా ద్వారా చెల్లింపునకు సన్నాహాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు దాదాపు పూర్తికావొచ్చింది.న్యాయస్థానం ఆదేశాల మేరకు చెల్లింపులు చేపట్టారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గుత్తేదారులకు ముందుగా చెల్లించారు. మొత్తంగా 2,800 బిల్లులకుగానూ 2,200 వరకు చెల్లించారు. మిగిలినవి వారం... పదిరోజుల్లో చెల్లింపునకు సన్నాహాలు చేస్తున్నారు. రహదారులు, భవనాలశాఖలోనూ చాలా వరకు పెండిండ్ బిల్లుల చెల్లించారు.
ఆరు నెలల్లో పూర్తి చేస్తాం...
కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయంతో ఆరు నెలల్లోగా రహదారులను బాగుచేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నాం. దాదాపు అన్ని రహదారులు లభివృద్ధి చెందనున్నాయి. గుత్తేదారులకు చాలా వరకు పెండింగ్ బిల్లులు చెల్లించాం. మిగిలినవి త్వరలో చెల్లిస్తాం. నిధులూ కొంత వరకు మిగుల్లోకి రానున్నాయి. - శ్రీనివాసులురెడ్డి, ఎస్ఈ, పంచాయతీరాజ్శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
[ 02-05-2024]
బద్వేలు... వైకాపా అరాచక పాలనకు అద్దం పట్టే నియోజకవర్గాల్లో ముందుంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా భూదందాలు రాజ్యమేలాయి. ‘ఒక్క అవకాశమివ్వండి’ అంటూ జనాన్ని నమ్మించి పీఠమెక్కిన జగన్ తన అరాచక దండును కావాల్సినంత దోచుకోనిచ్చారు. -
పేరులోనే కాంతి... ప్రజలకేదీ శాంతి?
[ 02-05-2024]
చూడ్డానికి మంచి వ్యక్తిగా కనిపిస్తారు... నీతులు వల్లిస్తారు... గంభీరంగా మాట్లాడుతూ సచ్చీలుడిగా నటిస్తారు... అన్నా...అన్నా అంటూనే వ్యవహారాలన్నీ చక్కబెడతారు... అయిదేళ్లుగా సహజ వనరులు, భూములను దోచేశారు... -
అధికార పార్టీ అండ... ఇసుకాసురుల దందా!
[ 02-05-2024]
తాగునీటి కరవుతో కడప నగరం గొంతెండుతోంది... నగరంలోని నాలుగు లక్షల మందికి తాగునీరందించే పెన్నానది జలకళను కోల్పోయింది. -
నేడు రాయచోటి, కడపకు చంద్రబాబు
[ 02-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి, వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపకు రానున్నారు. -
నిరుద్యోగులకు సీఎం జగన్ మోసం
[ 02-05-2024]
‘బద్వేలు ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు అంటకదన్నా.. గెలిచాక ఎప్పుడైనా చూశారా.. అంతా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూసుకుంటాడంట కదా.. కొండలు.. గుట్టలు వదలిపెట్టడం లేదంటకదా’ అని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల ఘాటుగా విమర్శలు సంధించారు. -
కలల వంతెన... జగన్ వంచన!
[ 02-05-2024]
పెన్నానదికి అటు, ఇటు ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వంతెన లేకపోవడాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం గుర్తించింది. -
జగన్నాటకం... ఉపాధి బూటకం!
[ 02-05-2024]
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరక్క, బతకడానికి మరోదారి లేక కన్నవాళ్లని, కట్టుకున్నవారిని, బిడ్డలను వదిలి జీవనోపాధి కోసం జిల్లాలోని చాలామంది విదేశాలకు వలస వెళ్లారు. -
వైకాపా పాలనలో సమస్తం దోపిడీయే
[ 02-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతలకు కీలక పదవులు
[ 02-05-2024]
ఉమ్మడి కడప జిల్లాలో తెదేపాకు చెందిన పలువురు నేతలకు పార్టీ అధిష్ఠానం కీలక పదవులు కట్టబెట్టింది. -
దేవుడి భూముల కబ్జా... వైకాపా నేతల దర్జా!
[ 02-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో జిల్లాలోని వివిధ దేవాలయాలకు చెందిన దేవుడి మాన్యం భూములకు రక్షణ లేకుండాపోయింది. -
కలుషిత నీరు... వ్యాధులతో బేజారు
[ 02-05-2024]
జీవజలం అంతటా కలుషితమవుతోంది. కనీస వసతుల్లో ప్రధానమైనది తాగు నీరు. పురపాలక సంస్థల్లోని కాలనీల్లో ఎక్కడ చూసినా ఇదే సమస్య కనిపిస్తోంది.