హైటెక్సిటీలో అరకు కాఫీ ఘుమఘుమ
ఆంధ్రప్రదేశ్ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హబ్ అరబికా పేరిట హైటెక్సిటీలో అరకు వ్యాలీ ఉత్పత్తుల స్టోర్ ఆరంభమైంది.
తెలంగాణలో తొలి స్టోర్ ప్రారంభం
స్టోర్ను ప్రారంభిస్తున్న గిరిజన కార్పొరేషన్ ఛైర్పర్సన్ శోభ స్వాతిరాణి, చిత్రంలో సురేష్బాబు, సెల్వరాజ్, రాంప్రసాద్ తదితరులు
హైదరాబాద్, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హబ్ అరబికా పేరిట హైటెక్సిటీలో అరకు వ్యాలీ ఉత్పత్తుల స్టోర్ ఆరంభమైంది. రాయదుర్గం మెట్రోస్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ స్టోర్ను ఏపీ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ శోభ స్వాతిరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరకు ప్రాంత గిరిజనులు తయారు చేసిన సేంద్రియ ఉత్పత్తులను గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా సేకరించి వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో తొలి అరకు వ్యాలీ కాఫీ స్టోర్ను రాయదుర్గం మెట్రోస్టేషన్ వద్ద ప్రారంభించినట్లు చెప్పారు. ఈ స్టోర్లో అరకు ఆర్గానిక్ కాఫీతో పాటు వివిధ రకాల సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. గిరిజనులు సేకరించిన తేనెతో పాటు, నూనెలు, షాంపూలు, సీకాయ పొడి, సబ్బులు, త్రిఫల రసం వంటి ఉత్పత్తులు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ వైస్ ఛైర్మన్ సురేష్బాబు, రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, జీఎం యుస్టస్, సినీదర్శకుడు శ్రీనివాస్రెడ్డి, జబర్దస్త్ నటుడు ఆటో రాంప్రసాద్, బుల్లితెర నటుడు సెల్వరాజ్, ఏపీ ఆధ్యాత్మిక పర్యాటక ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్థానిక సమరానికి దీటుగా..
[ 01-06-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సార్వత్రిక సమరంలో ఓటర్లు పోటెత్తారు. అన్ని నియోజకవర్గాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. -
సజావుగా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 01-06-2024]
ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. -
లోయలోకి దూసుకెళ్లిన బైకు.. తండ్రీకుమారుల దుర్మరణం
[ 01-06-2024]
బంధువుల ఇంటి నుంచి తిరిగొస్తూ బైకు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతి చెందారు. కొయ్యూరు పంచాయతీ చింతవానిపాలెం ఘాట్రోడ్డులో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
వాణిజ్య పంటలపై వాత్సల్యమేదీ?
[ 01-06-2024]
ఒకప్పుడు వాణిజ్య పంటల సాగుకు చిరునామాగా ఉన్న మన్యం ప్రాంతంలో ఇప్పుడు ఆయా పంటలకు ఆదరణ తగ్గుతోంది. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
[ 01-06-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులతో శుక్రవారం భారీ వర్షం కురిసింది. -
రాయితీల్లో కోత.. ధరల వాత
[ 01-06-2024]
ఓవైపు తమది రైతు పక్షపాత ప్రభుత్వమని బాకాలు ఊదుతున్నారు.. మరోవైపు విత్తు నుంచి ఎరువుల వరకు ధరలు పెంచి రైతులపై భారాన్ని మోపుతున్నారు. -
విరిగిన బెంచీలు..మొక్కల్లేని కుండీలు!
[ 01-06-2024]
నర్సీపట్నం ఆర్టీసీ బస్స్టేషన్ నుంచి వివిధ మండలాల నుంచి రోజూ 10 వేల మంది వరకు వచ్చి వెళ్తుంటారు. -
కేజీ అల్లం రూ.140
[ 01-06-2024]
మన్యంలో అల్లం పంట అధిక ధర పలుకుతోంది. వాణిజ్యపరంగా సాగు చేసిన ఈ పంటకు మంచి ధర లభించడంతో గిరిరైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ నెల పింఛనైనా చేతికిస్తారా?
[ 01-06-2024]
వృద్ధాప్య పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటంతో చాలామందికి అవస్థలు తప్పడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM