ఉద్యోగులకు ప్రలోభాల ఎర
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రాల (ఫెసిలిటేషన్) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు.
డబ్బు ఫోన్పే చేస్తామని బేరసారాలు
వైకాపా శ్రేణుల బరితెగింపు
పోలింగ్ కేంద్రం సమీపంలో వైకాపా నాయకులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రాల (ఫెసిలిటేషన్) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు. ఓటు వేసేది లేదని మొహం మీదే ఛీదరించుకుంటున్నా.. డబ్బు ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలింగ్ జరిగే ఫెసిలిటేషన్ కేంద్రాల వద్దే మకాం వేసి ఓట్ల కొనుగోలుకు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినా సరే ఉద్యోగ, ఉపాధ్యాయులు నిక్కచ్చిగా తెగేసి చెబుతున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెట్టింది.
- ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 23,900 మందిని నియమించామని అధికార యంత్రాంగం ప్రకటించింది. కేడర్ల వారీగా ఎంతమంది అన్న వివరాలు మాత్రం బయటకు పొక్కడం లేదు. అయినా సరే.. 23,532 మంది ఎన్నికల సిబ్బంది ఫాం-12 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చాలా మంది పేర్లు పోస్టల్ బ్యాలెట్ ఓటరు జాబితాలో గల్లంతయ్యాయి. ఈ నెల 3 నుంచి 6 దాకా ఓటు వినియోగం కోసం పోలింగ్ సాగుతోంది. సులువుగా..వేగంగా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించలేదు. అయినా సరే..ఓటు వేసి తీరుతామంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. అధికార వైకాపాకు తగిన బుద్ధి చెప్పాలన్న కసి, పట్టుదల వారిలో కనిపిస్తోంది.
- వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు తమ శ్రేణుల ద్వారా ఓట్లను పొందడానికి రకరకాల ప్రలోభాలు చేస్తున్నారు. ఒక్క అనంత నగరంలోనే 6 వేల ఓట్లు ఉన్నాయి. శింగనమల, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో 3 వేల పైచిలుకు ఉన్నాయి. ప్రస్తుతం అనంత నగరం, శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు వంటి ప్రాంతాల్లో తాయిలాలు ఎర చూపిస్తున్నారు. ఎలాగైనా సరే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లను పొందడానికి ఫోన్ పే, గూగూల్ పే, పేటీఎం.. వంటి రూపాల్లో డబ్బులు పంపిణీ చేయడానికి యత్నిస్తున్నారు. ప్రతి ఫెసిలిటేషన్ కేంద్రం వద్దే మకాం వేసి.నీళ్ల బాటిళ్లు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, సమోసా.. వంటి వాటిని పంపిణీ చేసి మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆర్ఓ, పోలీసు అధికారుల కళ్లెదుటే ఇవన్నీ కొనసాగిస్తున్నా వైకాపా శ్రేణుల బరితెగింపునకు అడ్డుచెప్పకపోవడం విశేషం.
సార్... ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. రూ.5 వేలు తీసుకోండి.. అంటూ శింగనమల నియోజకవర్గ ఫెసిలిటేషన్ కేంద్రం సమీపంలో ఓ ఉద్యోగ సంఘం నాయకుడు హల్చల్ చేస్తుండటం చర్చనీయాంశమైంది.
కొత్తూరు జూనియర్ కళాశాల ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద వైకాపా నాయకురాలు, మహిళా టీచరు మధ్య సంభాషణ ఇది
- వైకాపా నాయకురాలు: మేడమ్.. నమేస్తే. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.
- మహిళా టీచరు: ఎవరు మీరు?.
- వైకాపా నాయకురాలు: వైకాపా నాయకురాలిని. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. మీ ఫోన్ నంబరు ఇస్తే.. డబ్బులు ఫోన్పే చేస్తాం.
- మహిళా టీచరు: అసలు.. మీరు ఇక్కడ ఉండటమే తప్పు. ఇక్కడ ప్రచారం ఎలా చేస్తారు.
- వైకాపా నాయకురాలు: ప్లీజ్ మేడమ్.. ఫ్యాన్కు ఓటు వేయండి.
- మహిళా టీచరు: ఒక్కసారి చెబితే అర్థం కాదా. మీ నిర్వాకం చాలు. వెళ్లిపోండి (కోపంగా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచిగా వండాలంటే.. శుచి, శుభ్రతకు చోటేది?
[ 02-06-2024]
మధ్యాహ్న భోజనం నాణ్యమైన రుచులతో వడ్డించాలని ఆర్భాటం చేసిన అధికారులు వండటానికి శుచి, శుభ్రతతో కూడిన చోటు కల్పించడంలో విఫలమవుతున్నారు. సదుపాయమే లేనిచోట రుచికరమైన వంటలెలా తయారవుతాయోనన్న ఆలోచనను విస్మరించారు. -
కూటమి వైపే ఓటర్లు!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెదేపా నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
ఆగని కబ్జా పర్వం.. కుంటలు మాయం
[ 02-06-2024]
గుత్తి శివారులోని చాకలి కుంటలో కొంత భాగాన్ని వైకాపా నాయకులు ఆక్రమించారు. బంకులు ఏర్పాటు చేసి కబ్జా చేశారు. ఈవిషయం అధికారులకు తెలిసి బంకులను పక్కకు తోసేశారు. -
తొలుత సిఫార్సులతో నియామకం.. తర్వాత కాంట్రాక్టు హోదా
[ 02-06-2024]
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన ఉద్యోగాల నియామకం వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, సహాయార్యుల కొరత కారణంగా టీచింగ్ అసిస్టెంట్లు, అతిథి, తాత్కాలిక అధ్యాపకులను నియమించుకుంటున్నారు. -
జిల్లా అంతటా నిఘా
[ 02-06-2024]
‘ఈనెల 4న ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. జిల్లాంతటా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా 315 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ప్రత్యేక నిఘా ఉంటుంది’ అని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ గౌతమిశాలి స్పష్టం చేశారు. -
కొందరికే పింఛను సొమ్ములు
[ 02-06-2024]
బ్యాంకులకు వెళ్లి పింఛను తీసుకోవాలని చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంకులు ఉంటాయని ఉదయం 9 గంటలకే బ్యాంకులకు చేరుకున్నారు. సొమ్ము పడలేదని సచివాలయంలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించడంతో మళ్లీ అక్కడకు పరుగులు తీశారు. -
పేదలకు బియ్యంతో సరి
[ 02-06-2024]
పౌర సరఫరాల ద్వారా నిరుపేదలకు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా రేషన్ సరకుల్లో కోత విధిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అరకొరగా పంపిణీ చేసే కందిపప్పు, గోధుమ, రాగిపిండిని పూర్తిగా నిలిపివేసింది. -
దిక్కూ మొక్కూ లేని స్థితిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు
[ 02-06-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు దిక్కుమొక్కులేని స్థితిలో కునారిల్లిపోయాయి. పనులు లేవు, నిధుల మంజూరు లేదు, అభివృద్ధి లేదు అన్నది సుస్పష్టం. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి (ఏఎంసీ) పాలకవర్గ నియామకం ఊసే మరిచిపోయారు. -
భద్రతా వలయంలో జేఎన్టీయూ
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో పోలీసు వర్గాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా చర్యలను పూర్తిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు
-
ఎగ్జిట్ పోల్స్కి విలువ లేదు.. మమత రియాక్షన్ ఇదే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సినీ నటుడి బ్యాగులో 40 బుల్లెట్ల గుర్తింపు