Andhrapradesh news: తిరిగొస్తావనుకుంటే.. కడుపుకోత మిగిల్చావా..!
అదృశ్యమైన బిడ్డ కోసం కాళ్లు అరిగేలా తిరిగారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఏ క్షణమైనా తిరిగొస్తాడని ఆశగా చూస్తున్నారు.
హోసన్న (పాత చిత్రం)
చాగల్లు, న్యూస్టుడే: అదృశ్యమైన బిడ్డ కోసం కాళ్లు అరిగేలా తిరిగారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఏ క్షణమైనా తిరిగొస్తాడని ఆశగా చూస్తున్నారు. తీరా చెరువులో విగతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కొవ్వూరు మండలం పంగిడికి చెందిన వి.జాన్రత్నం, మరియమ్మ దంపతులు స్థానికంగా నల్లపూసలు వంటివి విక్రయిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మూడో సంతానమైన హోసన్న(9) ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం చాగల్లులోని మాతంగి చెరువులో ఓ బాలుడి మృతదేహం దొరికిందన్న సమాచారంతో వెళ్లి చూశారు. దుస్తులు ఆధారంగా హోసన్నగా నిర్ధారించారు.
గతేడాది తమ్ముడు.. ఇప్పుడు అన్న..
ఏడాది క్రితం నాలుగో సంతానమైన జయరాజు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి వద్ద నీటి తొట్టెలో పడి మృతి చెందాడు. ఇప్పుడు హోసన్న మృతితో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. చిన్న కొడుకు నీటి తొట్టెలో, పెద్దకొడుకు చెరువులో పడి మృత్యువాత పడటంతో విధి తమపై పగబట్టిందా అంటూ ఆ తల్లిదండ్రులు విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిడదవోలు తరలించారు. జాన్రత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై హుస్సేన్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ బలవన్మరణం
రాజమహేంద్రవరం నేరవార్తలు: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన బొమ్మూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై జగన్మోహన్రావు తెలిపిన వివరాల మేరకు.. దివాన్చెరువు గ్రామానికి చెందిన అక్కిరెడ్డి రామకృష్ణ(63) నగరంలో ఆటో నడుపుతూ.. అతడి భార్య సీత స్థానికంగా కూరగాయల అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 8న రామకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గమనించిన కుటుంబీకులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా కోటలు.. కూల్చేసిన ఘట్టాలు
[ 06-06-2024]
ప్రజాకంఠక ప్రభుత్వ పతనానికి.. జగన్ కోటలు కుప్పకూలడానికి.. వైకాపా నేతల ఘోర పరాజయానికి తూర్పు కేంద్ర బిందువైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలక పరిణామాలకు మన ఉమ్మడి జిల్లా వేదికయ్యింది. ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీ నాయకుల అరాచకాలకు ప్రజలు విసిగిపోయారు. -
తూర్పు తీర్పు.. సిరా శాసనమే!
[ 06-06-2024]
ఇది నా మాట.. నా మాటే శాసనం.. అన్నట్లు తూర్పు తీర్పు రాష్ట్ర రాజకీయాలనే శాసిస్తోంది. ఇక్కడి ఓటర్ల నిర్ణయమే.. రాష్ట్రానికి దిశానిర్దేశంగా మారుతోంది. ఇక్కడ లిఖించిన సిరా శాసనమే.. రాష్ట్రంలో ఏ పార్టీకైనా ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తోంది. -
వీరి నోట.. నోటా
[ 06-06-2024]
సార్వత్రిక సమరంలో కొందరు ఓటర్లు విలక్షణమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే.. వారికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ‘నోటా’ మీట నొక్కి ‘పైవారు ఎవరూ కాదు’ అనే సంకేతాలను పంపే అధికారం ప్రజాస్వామ్యం కల్పించింది. -
బడిబస్సుపై పన్నుల మోత
[ 06-06-2024]
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోతకు తోడుబస్సుల రవాణా ఖర్చుల భారం తడిసి మోపెడవుతోంది. గతేడాది నుంచి ప్రభుత్వం పన్నులు పెంచడంతో ఆ భారం బడి బస్సులపై పడుతోంది. దీంతో జిల్లాలో వివిధ ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్, పాఠశాల విద్యకు సంబంధిత విద్యాలయ బస్సుల్లో వెళ్లే విద్యార్థులకు ఆర్థిక అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంది. -
ప్రజాసమస్యలు ప్రభుత్వం దృష్టికి: పురందేశ్వరి
[ 06-06-2024]
కూటమిలో మిత్రపక్షంగా ఉంటూనే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికైన దగ్గుబాటి పురందేశ్వరి శ్రేణులకు పిలుపునిచ్చారు. -
హోంమంత్రికి స్వగ్రామంలోనూ భంగపాటే
[ 06-06-2024]
ఆమె రాష్ట్రానికి సాక్షాత్తూ హోంమంత్రి. తాజా సార్వత్రిక పోరులో ఓటమిపాలయ్యారు. కీలకమైన అంశమేమిటంటే తన స్వస్థలంలోనూ ఓట్లు తక్కువగా పడటం.. వివరాలిలా ఉన్నాయి.. -
అక్కడి ఫలితమే ప్రథమం
[ 06-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడిలో తూర్పుగోదావరి ప్రథమంగా నిలిచింది. రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రౌండ్లతో ఉన్న రాజమహేంద్రవరం గ్రామీణ ఫలితం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వెలువడుతుందని తొలుత అధికారులు వెల్లడించారు. -
కూటమికి పట్టం కట్టిన ఉద్యోగులు
[ 06-06-2024]
వైకాపా పాలనతో విసుగు చెందిన ఉద్యోగులు, సామాన్యులు ఒక్క సారిగా తమ ప్రతాపాన్ని ఓటు రూపంలో చూపారు. ఈ ఎన్నికలు వైకాపా విముక్త పోరాటం లక్ష్యంగా జరిగాయనేందుకు ఈనెల 4వ తేదీన వెలువడిన ఫలితాలే నిదర్శనం. -
గ్లాస్కు 10,728.. ఫ్యాన్కు 5,020
[ 06-06-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల తుది లెక్క తేలింది. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 18,616 పోస్టల్ బ్యాలట్లు నమోదయ్యాయి. -
ముంపు ముప్పును తప్పించలేరా..?
[ 06-06-2024]
సాగులో పంట కాలువల ద్వారా సాగునీరు అందించడం ఎంత కీలకమో.. భారీ వర్షాల సమయంలో ముంపు బారినపడిన పంటలను కాపాడుకునేందుకు మురుగు కాలువల వ్యవస్థ అంతే కీలకం. -
పదో తరగతికీ ఆన్లైన్ మూల్యాంకనం
[ 06-06-2024]
పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో సాంకేతికతను అమలు చేస్తున్నారు. సమయ పాలన, వేగవంతం, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియలో సాంకేతికతను జోడిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ప్రత్యేక పిల్లలు.. భవితకు బాటలు
[ 06-06-2024]
ప్రత్యేక అవసరాల చిన్నారులను గుర్తించి వారిని సమీప భవిత కేంద్రాల్లో చేర్పించే పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. జూన్ తొమ్మిదో తేదీ వరకూ దివ్యాంగ చిన్నారుల్ని గుర్తించడం, వారి తల్లిదండ్రులతో మాట్లాడటం, భవిత కేంద్రాలకు రప్పించే పనుల్లో ఉపాధ్యాయులు (ఐఈఆర్టీ) కసరత్తు చేస్తున్నారు. -
నీట్ ఫలితాల్లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
[ 06-06-2024]
నీట్-2024 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ ఎన్కె.దీపక్రెడ్డి తెలిపారు. -
సొంత బూత్లో జక్కంపూడికి ఎదురుదెబ్బ!
[ 06-06-2024]
రాజానగరం నియోజకవర్గంలో 16 రౌండ్లలోనూ ఆధిక్యత చూపిన జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ చివరికి తాజా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఓటు వేసిన సొంత గ్రామంలోనూ పైచేయి సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ సుజుకీ ఆఫర్.. ఈ మోడళ్లపై రూ.74వేల వరకు తగ్గింపు
-
పవన్ కల్యాణ్ ‘థ్యాంక్స్ పోస్ట్’.. చిత్తశుద్ధితో ముందడుగేస్తాం
-
ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ రవిచంద్ర?
-
‘స్టాక్ మార్కెట్ స్కామ్’లో మోదీ, షా.. రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
మోదీ ప్రమాణ స్వీకారానికి ముయిజ్జుకు ఆహ్వానం
-
రైలుతో సెల్ఫీకి యత్నం.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాద దృశ్యాలు వైరల్