కొందరికే పోస్టల్ బ్యాలెట్..
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కొందరు ఉద్యోగులకు దక్కడంలేదు. ఫారం-12 సమర్పించినా జాబితాలో పేర్లు లేకపోవడంతో రెండోరోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.
న్యూస్టుడే, వి.ఎల్.పురం, దేవీచౌక్ (రాజమహేంద్రవరం): పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కొందరు ఉద్యోగులకు దక్కడంలేదు. ఫారం-12 సమర్పించినా జాబితాలో పేర్లు లేకపోవడంతో రెండోరోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో మంగళవారం పోలీసు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్ విధుల్లో భాగస్వాములయ్యే ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. జాబితాలో పేర్లులేక కొందరు.. తాము ఎక్కడ ఓటు వేయాలనే దానిపై స్పష్టమైన సమాచారంలేక ఇంకొందరు ఇబ్బంది పడ్డారు. మరికొందరు అక్కడే మళ్లీ ఫారం-12 పూర్తిచేసి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకొందరికి ఆ అవకాశం కూడా లేక వెనుదిరిగారు.
రెండోరోజూ అవే సమస్యలు
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని బుద్ధభవన్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉదయం 9 గంటల నుంచి పోలీసు సిబ్బంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసు సిబ్బందిలో చాలామంది పేర్లు జాబితాలో లేవు. ఇదివరకే ఆయా పోలీస్స్టేషన్ల నుంచి ఫారం-12 దరఖాస్తులు ఆర్వోలకు పంపించినప్పటికీ కొందరికే బ్యాలెట్ వచ్చిందని చెబుతున్నారు. వర్షం కారణంగా గంటన్నర పాటు ప్రక్రియ నిలిపివేశారు.
కావాలనే చేస్తున్నారా..
ఇతర జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులు, కొందరు మైక్రోఅబ్జర్వర్లకు పోస్టల్ బ్యాలెట్ రాలేదు. ఆయా నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చి పరిశీలించుకోగా జాబితాలో పేర్లు లేకపోవడంతో మళ్లీ ఫారం-12 సమర్పించాల్సి వచ్చింది. పోలీసు సిబ్బందికి మాత్రం ఆ అవకాశం కూడా లేకుండాపోయింది. కావాలనే గందరగోళం సృష్టించి ఓటు వినియోగించుకోకుండా చేస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు.
వైకాపా నాయకుల ప్రలోభాలు
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వచ్చిన వారిని వైకాపా నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. గేటు బయట నిలబడి తమకు ఓటేస్తే డబ్బులు పోన్పే చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఓటుకు రూ.3 వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధపడినప్పటికీ కొందరు సున్నితంగా తిరస్కరించారు.
రాజమహేంద్రవరం: పోస్టల్
బ్యాలెట్ వినియోగించుకునేందుకు క్యూలో పోలీసు సిబ్బంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏజెంట్ 004
[ 02-06-2024]
సజ్జల వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేసూ నమోదయ్యింది. ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తంచేస్తున్నాయి. -
నలుచెరుగులా బలగాలు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 48 గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూం, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,100 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తు ఉంటుంది. -
కూటమి ఖుషీ
[ 02-06-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు అనుకూలంగా రావడంతో తమ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమనే ధీమా కనిపిస్తోంది. -
ఓట్ల లెక్కింపునకు 17 కేంద్రాలు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి నన్నయ విశ్వవిద్యాలయంలో మొత్తం 17 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. కలెక్టరేట్లో శనివారం విలేకరుల సమావేశంలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. -
ఎన్డీఏ కూటమిదే విజయం: సీఎం రమేష్
[ 02-06-2024]
కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, భాజపాకు చెందిన సి.ఎం.రమేష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి శనివారం రాత్రి విమానంలో వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బ్యాంకుల్లో 47.82 శాతమే పింఛను సొమ్ము ఉపసంహరణ
[ 02-06-2024]
సామాజిక భద్రత పింఛను డబ్బులు బ్యాంకుల ద్వారా తీసుకునేందుకు ఈ నెల కూడా జిల్లాలోని లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పలేదు. కొన్నిచోట్ల బ్యాంకుల్లో పింఛను నగదు కోసం గంటల తరబడి వరసలో నిరీక్షించాల్సి వచ్చింది. -
ఆగండి.. ఎలా వెళ్లాలో గమనించండి
[ 02-06-2024]
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ (కౌంటింగ్) జర¢గనుండటంతో ఆ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి అటుగా వెళ్లే భారీ వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు. -
4జీ సేవలు మరింత విస్తృతం
[ 02-06-2024]
4జీ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజరు ఎం.శేషాచలం చెప్పారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఈదురు గాలుల బీభత్సం
[ 02-06-2024]
కాకినాడ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం బెంబేలెత్తారు. శనివారం వేకువజామున 4 గంటల నుంచి జిల్లాలోని 14 మండలాలను ఒక్కసారిగా ఈదురుగాలులు చుట్టుముట్టాయి. -
పూడికతీత.. పనుల్లో రోత..!
[ 02-06-2024]
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా మారింది గోదావరి కాలువలో పూడికతీత పనుల పరిస్థితి. అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నా, పనులకు పక్కాగా అనుమతులు లభించినా పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం నెలకొంది. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమదే మొదటి స్థానం
[ 02-06-2024]
ఏలూరు రేంజ్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమ ప్రథమ స్థానంలో ఉందని ఎస్ఈబీ ఐజీ, జిల్లా లెక్కింపు ప్రత్యేకాధికారి ఎం.రవిప్రకాష్ తెలిపారు. శనివారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. -
సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు..
[ 02-06-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఆవశ్యకత, ఓటు విలువను గుర్తించిన యువత పెద్దఎత్తున ఓట్ల పండగలో పాల్గొని.. తమకు నచ్చినవారికి ఓటు వేశారు. జిల్లాలో పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు
-
ఎగ్జిట్ పోల్స్కి విలువ లేదు.. మమత రియాక్షన్ ఇదే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM