జనం ఆస్తులపై.. జగన్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు శాపంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలకు తీవ్ర నష్టం
అవగాహన లేకపోతే సామాన్యులు సమిధలే
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం తీరిది
ఈనాడు, అమరావతి - న్యూస్టుడే, కలెక్టరేట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు శాపంగా మారింది. వీరందరూ సాగు చేస్తున్న భూములకు చాలా మంది వద్ద హక్కుపత్రాలు ఉండవు. వీరందరూ వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. వీరు హక్కుపత్రాలు చూపి నిర్ధారించుకోవాల్సి ఉన్నందున వారికి అన్యాయం జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములపై ఎవరైనా అభ్యంతరం తెలిపితే వాటిని వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. వివాదం పరిష్కారమయ్యేంత వరకు సదరు భూమి తనఖా పెట్టడం, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఇది పేదవర్గాలకు చాలా ఇబ్బందికరమైన అంశం. అంతేకాకుండా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత హక్కుదారులు వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి నిర్ణీత సమయంలో తెలియజేయకపోతే బాధ్యులైనవారికి ఆరునెలల వరకు జైలుశిక్ష వేయడం అసంబద్ధమైన నిర్ణయమని నిపుణులు వాపోతున్నారు.
వివాదం ఏర్పడితే రైతులకు చిక్కులే
ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు, సాగుదారులు 80శాతం మంది ఉన్నారు. చిన్న కమతాలకు సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే వాటిని పరిష్కరించుకోవడానికి స్థానిక సివిల్ కోర్డులకు వెళ్లే వెసులుబాటు లేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి(టీఆర్వో), ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ అధికారులు(ఎల్టీఏవో) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు హైకోర్టు స్థాయిలో అధికారుల ఆదేశాలను సవాల్ చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న వారిని వెంటాడుతోంది. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములు, ఆస్తులు, దుకాణాలు ఇలా ఎలాంటి స్థిరాస్తులైనా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిధిలోనే ఉంటాయి. టీఆర్వో, ఎల్టీఏవోలను రాష్ట్ర స్థాయిలో అథారిటీ నియమిస్తుండడం, ఇందుకు ఎలాంటి విధానాలు అనుసరిస్తారో స్పష్టత లేకపోవడంతో న్యాయవర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
తెనాలిలో న్యాయవాదుల రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలుపుతున్న నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ (పాతచిత్రం)
ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022పై వారం రోజులుగా రాష్ట్రంలో చర్చ జరుగుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు నెలలకుపైగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేసినా ప్రభుత్వం దిగిరాలేదు. ప్రజలకు కూడా అవగాహన లేక ఇది న్యాయవాదులకు సంబంధించిన అంశమని మిన్నకుండిపోయారు. అయితే ఈ చట్టం విధివిధానాలను అధ్యయనం చేసిన విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, మేధావులు చర్చావేదికలు నిర్వహించడం, ప్రతిపక్ష పార్టీలు చట్టం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో అందరూ అప్రమత్తమయ్యారు. చట్టాన్ని తెలుగులోకి అనువాదం చేసి విస్తృత ప్రచారంలోకి తీసుకురావడంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. చట్టంలో అనేక అంశాలు ప్రజాశ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉండడంతోపాటు భవిష్యత్తులో అనేక సమస్యలకు మూలకారణాలవుతాయన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. దీంతో రోజురోజుకు ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం హక్కుదారుల వద్ద ఉన్న పత్రాల ఆధారంగా వారి ఆస్తులను నిర్ధారించుకోవాల్సి రావడంతో అత్యంత ప్రతికూలమైన అంశంగా చెబుతున్నారు. అంతేకాకుండా ఆస్తుల వివరాలు వెబ్సైట్లో పెడితే ప్రజలే చూసుకుని నిర్ణీత కాలంలో అభ్యంతరం తెలియజేయడం అనేది పెద్ద సవాలుగా మారనుంది. అదేవిధంగా స్థానిక న్యాయస్థానాల్లో వివాదాలు పరిష్కరించుకునే వెసులుబాటు లేకపోవడం సామాన్యులకు శాపంగా మారింది.
ఆ రిజిస్టర్లో నమోదైతే తలనొప్పే
ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఒక వ్యక్తి ఆస్తులపై అభ్యంతరం చెబితే వాటిని వివాదాల రిజిస్టర్లో నమోదు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికితోడు ఆస్తుల నిర్ధారణ, అప్పిలేట్ అధికారం కూడా రెవెన్యూ వర్గాలకు కట్టబెట్టడం వల్ల న్యాయం జరగని వారు హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. న్యాయపరిజ్ఞానం లేని రెవెన్యూఅధికారులు వివాద పరిష్కారాల సమయంలో తీసుకునే నిర్ణయం ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇలా సున్నితమైన ఎన్నో అంశాలు చట్టంలో హక్కుదారులకు ప్రతికూలంగా ఉన్నాయన్న నిపుణుల అభిప్రాయాలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రజల్లో విస్తృతమైన చర్చ పెట్టి ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చట్టాలను రూపొందించకుండా హడావుడిగా చేస్తే ఇలాంటి విపరిణామాలు ఎదురవుతాయని మేధావులు హెచ్చరిస్తున్నారు.
అవసరానికి ఆస్తి విక్రయించే పరిస్థితి ఉండదు
పెండ్యాల శ్రీకాంత్, రైతు సంఘ నాయుకుడు, పెదకాకాని
ల్యాండ్ టైటిలింగ్ చట్టం కారణంగా యజమాని తన అవసరానికి భూమి విక్రయించే పరిస్థితి ఉండదు. వారసత్వంగా వచ్చే ఆస్తులు సైతం ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి వివాదాల్లో ఉన్న భూములను టీఆరోవో తన ఇష్టం వచ్చిన వారికి కట్టబెట్టే ప్రమాదం ఉంది. ఇలాంటి భూవివాదాలకు సంబంధించిన సివిల్ కేసులు జిల్లా స్థాయి కోర్టుల్లో వేసే అవకాశం లేకుండా కేవలం హైకోర్టుకు వెళ్లాలని ఉంది. హైకోర్టుకు వెళ్లే పరిస్థితిలో లేని సామాన్యుడు భూమిని వదులుకోవాల్సిందే. వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి.
తీరని నష్టం
కట్టా శ్రీహరిరావు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలందరికీ తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. మన భూమి మన కష్టార్జితం. తాత, తండ్రులు వారసత్వంగా ఇచ్చిన ఆస్తి. భూపత్రాలపై జగన్ ఫొటోలు పెట్టడం సరికాదు. అసలు పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటే.. అధికారులు, నాయకులూ కుమ్మక్కై ఆస్తిదారుడి పేరు మార్పు చేసే అవకాశముంది. ప్రభుత్వం వాటిని తనఖా పెట్టి రుణాలు సైతం తెచ్చుకోవచ్చు. హక్కుదారుడికి ఆ విషయం తెలిసే అవకాశం కూడా లేదు. వాటిపై బ్యాంకుల పెత్తనం ఉంటుంది. ఇది ఆస్తిదారుడికి ఆత్మహత్యతో సమానం.
భూమిపై హక్కు ఉండదు
బండారుపల్లి సత్యనారాయణ, సాతులూరు
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో భూమిపై న్యాయపరమైన హక్కులు ఆస్తిదారుడికి ఉండవు. ఎవరైనా కావాలని కొర్రీ పెట్టినా కోర్టుకు వెళ్లలేం. జగన్ రెడ్డి నియమించిన అధికారి ఎదుటే మన వాదన వినిపించుకోవాలి. దీంతో వారసత్వంగా వచ్చిన భూమిపై హక్కు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అప్పు అవసరమై బ్యాంకుల్లోనో, వేరే వాళ్ల దగ్గరో తనఖా పెట్టాలంటే అసలు పత్రాలు ఉండవు. కాబట్టి అప్పు కూడా పుట్టదు. ఇది రైతులకే కాదు.. అందరికీ ఇబ్బందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
[ 01-06-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. -
రాత్రి 7 గంటలైనా పగటి వెలుగులే
[ 01-06-2024]
రోహిణి కార్తెలో రోళ్లు బద్దలవుతాయనేది నానుడి. అందుకు అనుగుణంగానే ఎండలు మండిపోతున్నాయి. గత మూడురోజులుగా 44, 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడి భగభగలకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తొలి ఫలితం తాడికొండదే!
[ 01-06-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 4న గుంటూరు లోక్సభ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్నారు. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం తొలుత వెల్లడి కానుంది. మంగళగిరి ఫలితం చివరిలో రానుంది. -
పార్టీ గెలిస్తేనే పంటల సాగు
[ 01-06-2024]
జూన్ ప్రారంభంతో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. పల్నాడు జిల్లాలో ఇప్పటికే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ పాటికే పొలాలు శుభ్రం చేసి దుక్కులు దున్ని విత్తనాలు నాటడానికి సిద్ధం చేయాలి. -
‘వైకాపా ఓడిపోవడం ఖాయం’
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఓడిపోతుందని అధికార పార్టీ నాయకులే బాహాటకంగా చెబుతున్నారని రాజధాని రైతులు పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని వైకాపా నాయకులే బెట్టింగ్లు కాస్తున్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడమే దానికి నిదర్శనమని చెప్పారు. -
మళ్లీ పెంచేశారు
[ 01-06-2024]
ప£త్తి రైతులకు చేదు వార్త. బీటీ పత్తి విత్తనాల ధర ఈఏడాది కూడా పెరిగింది. వరుసగా నాలుగో సంవత్సరం సైతం విత్తనాల ధరలను పెంచడం గమనార్హం. గిట్టుబాటు ధరలు దక్కక, తెగుళ్లు, వాతావరణ సమస్యలతో దిగుబడులు తగ్గిపోయి నష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో ధరలు పెంచడం రైతులకు మింగుడుపడడం లేదు. -
కోడ్ ఉన్న.. వారు చెప్పిందే చేస్తాం
[ 01-06-2024]
నగరంలో అసంపూర్తి పనులు పూర్తి చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యంత్రాంగం వైకాపా నేతల సిఫార్సులకు తలొగ్గి కొత్త పనులను మాత్రం రాత్రికి రాత్రే చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కొత్త పనులు చేయకూడదు. -
హనుమజ్జయంతి ఉత్సవాలపై పోలీసుల ఆంక్షలు
[ 01-06-2024]
దేవాదాయశాఖకు చెందిన నాజ్కూడలిలోని ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. జయంతికి ముందు రోజు గ్రామోత్సవం నిర్వహించేందుకు ఆలయ ఈవో, సహాయకమిషనర్ డి.శ్రీనివాసరావు ముందస్తుగా పోలీసులకు అనుమతులు తీసుకున్నారు. -
ఆర్టీసీ బస్సు, క్రేన్ ఢీ: ఇద్దరికి గాయాలు
[ 01-06-2024]
అది తెనాలి బాలాజీరావుపేట-బస్టాండ్ రోడ్డు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయం. జనం రాకపోకలు సాధారణంగా సాగుతున్న క్రమంలో ఆర్టీసీ బస్సు, భారీ క్రేన్ ఢీ కొని వెలువడిన పెద్ద శబ్దం, ప్రమాద తీవ్రతను చూసిన జనం ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. -
మారువేషంలో విత్తన దుకాణాల్లో తనిఖీలు
[ 01-06-2024]
నగరంలోని విత్తన విక్రయ దుకాణాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రాజాగారితోటలోని పలు దుకాణాల్లో పత్తి, మిర్చి విత్తనాలు అక్రమంగా నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్పీ ఈశ్వరరావు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశారు. -
భార్యను కత్తితో పొడిచిన భర్త
[ 01-06-2024]
భార్యను భర్త కత్తితో పొడిచిన ఘటన తెనాలి పట్టణ కొత్తపేటలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... చుండూరు మండలం వలివేరుకు చెందిన మానస, ఆమె మేనమామ కొల్లూరు వాసి రవిలకు సుమారు 7 సంవత్సరాల కిందట వివాహం అయ్యింది. -
నాలుగు రోజులు దుకాణాల బంద్
[ 01-06-2024]
ఎన్నికల లెక్కింపు తేదీ సమీపిస్తుండడంతో జిల్లాలో 144 సెక్షన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అంతేకాకుండా ఈనెల 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం వరకు దుకాణాలు స్వచ్ఛందంగా మూసేసి సహకరించాలని పోలీసులు మైక్ ప్రచారం చేస్తున్నారు. -
మొదటి ఫలితం చిలకలూరిపేట.. చివరగా గురజాల
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల లెక్కింపు పక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఎంపీ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం మరికొద్దిరోజుల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. -
తొలి ఫలితం బాపట్ల.. చివరగా అద్దంకి
[ 01-06-2024]
ఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ 4వ తేదీ పైనే అందరి చూపు ఉంది. మరో అయిదు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, బాపట్ల లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
బడ్డీ కొట్టు తీసేయ్
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపాకు ఓటు వేయలేదనే కోపంతో చిరు వ్యాపారాన్ని తొలగించాలంటూ స్థానిక నేతలు ఓ మహిళపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆ ఒంటరి మహిళ దిక్కుతోచని స్థితిలో ఆవేదన చెందుతున్నారు. -
పనులు పూర్తి చేస్తారా.. సొమ్ము తిరిగి ఇచ్చేస్తారా!
[ 01-06-2024]
గుంటూరు జిల్లా మేడికొండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిధులు ఎక్కువగా ఉన్నాయని వాటిని సమీపంలోని కొర్రపాడు, తురకపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలకు, సిరిపురం ప్రాథమిక పాఠశాలకు సర్దుబాటు చేశారు. -
ప్రమాద బాధితులు.. ప్రాణాలు అరచేతుల్లోనే!
[ 01-06-2024]
చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. రోడ్డు ప్రమాద బాధితులు వస్తే ఒంగోలు, గుంటూరు ఆసుపత్రులకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆర్థిక భారమైనా ప్రైవేట్ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు: కలెక్టర్ మల్లికార్జున
-
హీరో- హీరోయిన్ తిట్టుకుంటే సినిమా హిట్టే: శర్వానంద్
-
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
-
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత
-
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
-
రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్