Sharwanand: హీరో- హీరోయిన్ తిట్టుకుంటే సినిమా హిట్టే: శర్వానంద్
శర్వానంద్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘మనమే’. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకను శనివారం నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘హీరో- హీరోయిన్ తిట్టుకుంటే సినిమా హిట్టే’ అని అన్నారు నటుడు శర్వానంద్ (Sharwanand). తాను హీరోగా నటించిన తాజా చిత్రం ‘మనమే’ (Manamey). కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్లో ట్రైలర్ విడుదల వేడుకను శనివారం నిర్వహించింది. శర్వానంద్, కృతిశెట్టి, శ్రీరామ్ ఆదిత్య తదితరులు పాల్గొని, మీడియాతో ముచ్చటించారు. ఆ సంగతులివీ..
* మీరు తెరపై కనిపించి రెండేళ్లవుతోంది. గ్యాప్ ఎందుకొచ్చింది?
శర్వానంద్: నా సినిమాలు బాగున్నా, బాగోకపోయినా బాధ్యత నేనే తీసుకోవాలని నిర్ణయించుకున్నా. అలా ఆచితూచి వ్యవహరించడంతో గ్యాప్ వచ్చింది. కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో టీమ్నీ ఇబ్బంది పెట్టా (నవ్వుతూ). షూటింగ్ సరదాగా సాగలేదు.. అందరం కష్టపడి పనిచేశాం. ఈ చిత్రంతో కొత్త శ్రీరామ్ ఆదిత్య పరిచయమవుతాడు.
* మీ ఏజ్ హీరోలు లవ్స్టోరీలే చేస్తున్నారు. మీరు ఫ్యామిలీ స్టోరీతో రాబోతున్నారు. సీనియర్ హీరో జోన్లోకి వెళ్లినట్టు భావించారా?
శర్వానంద్: సినిమా చూశాక మీకే తెలుస్తుంది. మనలో చాలామందికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు ఇది. కొత్తదనం ఉన్న స్టోరీ, ఫ్రెష్ స్క్రిప్టు అని చెప్పలేనుగానీ ఇదొక మ్యాజికల్ ఫిల్మ్ అని నమ్మకంగా చెబుతున్నా. ‘ఇలాంటి మంచి సినిమా చూసి ఎన్నేళ్లయిందో’ అనే ఫీలింగ్తో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వస్తాడు.
* కృతిశెట్టితో కలిసి నటించడం ఎలా అనిపించింది?
శర్వానంద్: మేమిద్దరం ఈ చిత్రంలో ఎక్కువగా తిట్టుకుంటూనే ఉంటాం. హీరో, హీరోయిన్లు ప్రతీ చిన్నదానికి పోట్లాడుకునే కాన్సెప్టులు విజయవంతమవుతాయి. అందుకు ‘మురారి’, ‘ఖుషి’లాంటివి ఉదాహరణ. మా సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.
* ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు రామ్చరణ్ వస్తారా?
శర్వానంద్: ఇంకా ఖరారు కాలేదు. చరణ్ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ బట్టి ప్లాన్ చేస్తాం. త్వరలోనే అప్డేట్ ఇస్తాం.
* నిర్మాత దిల్రాజు ‘శతమానం భవతి 2’ని ప్రకటించారు కదా. అందులోనూ హీరో మీరేనా?
శర్వానంద్: దానిగురించి నాకేం చెప్పలేదు. ఆయన్నే అడగండి.
* క్రికెటర్ రోహిత్శర్మ బయోపిక్లో నటించే అవకాశం వస్తే అంగీకరిస్తారా?
శర్వానంద్: ఆలోచిస్తా.
* మీ స్టోరీల్లో కొత్తదనం ఉన్నా కమర్షియల్గా కాస్త వెనకబడతాయి. ఆ లోటు ‘మనమే’ భర్తీ చేస్తుందా?
శ్రీరామ్ ఆదిత్య: తప్పకుండా చేస్తుంది.
* మీ అబ్బాయినే ఈ సినిమాలో కీలక పాత్రకు తీసుకోవడానికి కారణం?
శ్రీరామ్ ఆదిత్య: ఈ కథ ఎప్పుడో రాసుకున్నా. శర్వానంద్తో సినిమా ఖరారయ్యాక.. ఆయన మా బాబు ఫొటో చూశారు. ‘ఎవరో ఎందుకు? మన సినిమాలో మీ వాడినే పెట్టేద్దాం’ అని ఆయన అన్నారు.
* హేషమ్ మ్యూజిక్ సినిమాపై ప్రభావం చూపుతుందా?
శ్రీరామ్ ఆదిత్య: ఆయన కెరీర్లో ఈ సినిమా బెస్ట్ అని చెప్పగలను. ఇందులో 16 పాటలున్నాయి. సినిమా ఆద్యంతం సంగీత ప్రధానంగా సాగుతుంది.
* ‘కస్టడీ’ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. అవకాశాలు రాలేదా?
కృతిశెట్టి: గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది. వేరే చిత్ర పరిశ్రమల్లో బిజీగా ఉండడం వల్ల ఇక్కడ సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు