కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
హాసన లైంగిక వేధింపుల కేసులో కీలకమైన పెన్డ్రైవ్ వ్యవహారంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న భాజపా నేత దేవరాజేగౌడను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ రేస్కోర్సు రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
దేవరాజేగౌడను అరెస్టు చేయాలని ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : హాసన లైంగిక వేధింపుల కేసులో కీలకమైన పెన్డ్రైవ్ వ్యవహారంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న భాజపా నేత దేవరాజేగౌడను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ రేస్కోర్సు రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కేపీసీసీ ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ భాజపా నేత దేవరాజేగౌడ మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కారుడ్రైవర్ కార్తిక్, భాజపా నేత దేవరాజేగౌడకు పెన్డ్రైవ్ ఇచ్చినట్లు ప్రకటించారని తెలిపారు. హాసన వీధుల్లో సామాజిక మాధ్యమాల్లో లైంగిక దౌర్జన్యాల సంఘటనలు ప్రసారం కావడానికి దేవరాజేగౌడ కారణమని ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణకు టికెట్ ఇవ్వకూడదని దేవరాజేగౌడ పోరాటం చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన జేడీఎస్ ఏజెంట్ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) బృందం ఆయనను అరెస్టు చేసి విచారించాలని డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగమొండి ప్రజ్వల్.. విచారణకు సహకరించడం లేదన్న సిట్
[ 02-06-2024]
వందలాది మందిపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు తెలిపారు. -
అంచనాల్లో.. కూటమిదే కోట!
[ 02-06-2024]
కర్ణాటకలో లోక్సభ ఎన్నికల ఎగ్జిట్పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వివిధ సంస్థల శ్యాంపుల్ సమీక్షల ఫలితాలు ఎన్డీఏ కూటమి ఆధిపత్యాన్ని చాటుతుందని తేల్చాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి భాజపా సాధించిన స్థానాల కంటే తక్కువ స్థానాలకు పరిమితమవుతుందని ఈ సమీక్షలు వెల్లడించాయి. -
సీఈటీ ర్యాంకుల్లో అబ్బాయిల జోరు!
[ 02-06-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయం, పశువైద్యం, నర్సింగ్, ఫార్మసీ, యోగా, నేచురోపతి విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కర్ణాటక ఉమ్మడి ప్రవేశ (కే-సీఈటీ)పరీక్షల్లో అబ్బాయిలు ర్యాంకుల్లో సత్తా చాటారు. -
విచారణకు హాజరైన సిద్ధు, డీకే
[ 02-06-2024]
విధానసభ ఎన్నికల సమయంలో ‘భాజపా నేతలు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు’ అంటూ ప్రకటనలు విడుదల చేసిన కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై నమోదైన కేసు విచారణ శనివారం ప్రారంభమైంది. -
పాలకుల మాటలు.. నీటి మూటలు
[ 02-06-2024]
రాజధాని నగరం ఈసారి వాననీటి ముంపునకు గురిచేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు ముందే అధికారులు, ఏలికలు భీకర ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలయ్యాక.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ముంపు ముప్పు ఎదురయ్యే ప్రాంతాలను చుట్టేసి ఈసారి సమస్య ఎదురుకాకుండా చూడడానికి అనేక ఆదేశాలిచ్చారు. -
నకిలీ ఖాతాలకు నగదు బదిలీ
[ 02-06-2024]
రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో అక్రమాలకు పాల్పడి, నకిలీ ఖాతాలకు బదిలీ చేసిన నగదులో కొంత భాగం హస్తినలోని కాంగ్రెస్ నేతలకు చేరిందని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆరోపించారు. -
భవ్య సేవలే ఓ సైన్యం!
[ 02-06-2024]
కాంగ్రెస్ పార్టీ మహిళా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన భవ్య నరసింహమూర్తి భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టారు. డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ 2022లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళగా ఆమె నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్కు ఐదో పెళ్లి
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు