‘ఎర్లీబర్డ్’ రాబడి రూ.15.15 కోట్లు
ఐదు శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్టుడే: ఐదు శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ అవకాశాన్ని 26,646 మంది భవన యజమానులు వినియోగించుకున్నారు. తద్వారా ఆయా నగర, పురపాలికలకు రూ.15.15 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా ఖమ్మం నగరపాలక సంస్థకు రూ.9.73 కోట్లు రాగా అత్యల్పంగా ఇల్లెందు పురపాలిక రూ.30 లక్షలు వసూలు చేసింది. ఈనెల మొదటి వారంలో ఈ పథకాన్ని పురపాలక శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో సిబ్బంది ఎన్నికల విధులు, పన్నుల వసూలు చేపట్టడంతో తొలుత మందకొడిగా సాగింది. తరువాత దీనిపై ప్రచారాన్ని ముమ్మరం చేయడం, పట్టణవాసులు స్పందించడంతో ఆశించిన మేరకు పన్నులు వసూలయ్యాయి. ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పన్నులు వసూలు చేయగలిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 01-06-2024]
చింతకాని మండలం వ్యాప్తంగా పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. -
ప్రజా పోరాటాలే జీవితానంతరం నిలబెడతాయి: సీపీఐ
[ 01-06-2024]
జీవించి ఉండగా చేసిన ప్రజా పోరాటాలే తనను జీవితానంతరం జనాల్లో నిలబెడతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా అన్నారు. -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 01-06-2024]
హనుమజ్జయంతి వేడుకలు అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. -
దశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధం
[ 01-06-2024]
పది వసంతాల తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ముస్తాబవుతున్నాయి. -
ఏ రకం పత్తి విత్తనమైనా దిగుబడి ఒకటే..!
[ 01-06-2024]
శాస్త్రవేత్తల కృషి ఫలితంగా విత్తనోత్పత్తిలో గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నా నిరక్షరాస్యత కారణంగా అనేక మంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానం కొరవడుతోంది. -
వాహన రిజిస్ట్రేషన్ కార్డుల్లేవ్..!
[ 01-06-2024]
ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వాహన రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ)ల కొరత వేధిస్తోంది. -
పాలవెల్లువ కావాలి
[ 01-06-2024]
పాలు, అనుబంధ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరిగింది. కొవిడ్ మహమ్మారి తర్వాత పరిణామాలను పరిశీలిస్తే ప్రతి ఇంట్లోనూ పాలు, పెరుగు, మజ్జిగ వాడకం పెరిగింది -
ఠారెత్తిస్తున్న ఎండలు
[ 01-06-2024]
భానుడి భగభగలతో జనం విలవిలలాడుతున్నారు. రోహిణి కార్తె ప్రవేశించడంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. -
తెలం‘గాన’మే పరిషత్తు నినాదం
[ 01-06-2024]
నిజాం పరిపాలన కాలంలో అక్షరాస్యత అంతంతమాత్రమే. ఉర్దూకు అన్నింటా ప్రాధాన్యం. తెలుగులో మాట్లాడితే నేరం. -
బొగ్గు ఉత్పత్తి సంతృప్తికరం
[ 01-06-2024]
సింగరేణిలో కొత్త ఉత్పత్తి సంవత్సరం మొదలై రెండు నెలలు కావస్తోంది. -
ఆర్థిక ఇబ్బందులతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
[ 01-06-2024]
ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహబూబాబాద్ పోలీస్ కంట్రోల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బత్తిని మనోహర్(49) బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. మూడోసారీ అధికారం ఎన్డీయేదే!
-
తెలంగాణలో హస్తం, కమలం నువ్వా నేనా!
-
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?
-
ఆంధ్రప్రదేశ్లో ‘ఎగ్జిట్ పోల్స్’ అంచనాలివే..
-
‘మా అమ్మే నాపై దాడి చేయించింది’: రూ.11వేల కోట్ల సామ్రాజ్యంలో వారసత్వ పోరు
-
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రత.. సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం