పాలమూరు ఓటర్లు @ 34,20,724
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడంతోపాటు చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగించారు.
మహబూబ్నగర్లో 15,274, నాగర్కర్నూల్లో 7,538 మంది కొత్తగా నమోదు
ఈనాడు, మహబూబ్నగర్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడంతోపాటు చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగించారు. పూర్వ మహబూబ్నగర్లోని 14 నియోజకవర్గాల్లో మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే కొత్త జాబితాను రాజకీయ పార్టీల నేతలకు అందించారు. ఈ జాబితా ప్రకారం మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,32,256 మంది పురుషులు, 8,50,172 మంది మహిళలు, 42 మంది ఇతరులున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 2,977 మంది పురుషులు, 8,385 మంది స్త్రీలు, ముగ్గురు ఇతరులు కలిపి మొత్తం 15,274 మంది కొత్తగా నమోదయ్యారు. స్థానికంగా లేని, చనిపోయిన వారిలో 6,713 మంది పురుషులు, 6,508 మంది స్త్రీలు మొత్తం కలిపి 13,221 మందిని జాబితా నుంచి తొలగించారు. నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,64,875 మంది పురుషులు, 8,73,340 మంది మహిళలు, 39 మంది ఇతరులు ఉన్నారు. ఈ స్థానం పరిధిలో 3,501 మంది పురుషులు, 4,035 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు కలిపి మొత్తం 7,538 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. స్థానికంగా లేనివారు, చనిపోయిన వారిని కలిపి 4,480 మంది పురుషులు, 3,983 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 8,465 మందిని జాబితా నుంచి తొలగించారు. మార్పులు, చేర్పుల తర్వాత మహబూబ్నగర్ పరిధిలో అదనంగా 2,053, నాగర్కర్నూల్ పరిధిలో 3,481 మంది ఓటర్లు పెరిగారు. మహబూబ్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువగా 2,59,260 మంది ఓటర్లు, జడ్చర్ల సెగ్మెంట్లో 2,22,838 మంది తక్కువ ఓటర్లు ఉన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నాగర్కర్నూల్ పరిధిలో అత్యధిక ఓటర్లు వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో 2,73,863 మంది ఉన్నారు. తక్కువగా నాగర్కర్నూల్ సెగ్మెంట్లో 2,36,094 మంది ఓటర్లు ఉన్నారు. ఐదు(వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, అలంపూర్, అచ్చంపేట) సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రెవెన్యూ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైబ్సైట్లో ఓటర్లు తమ పేరు ఉందో? లేదో? చెక్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ఐజ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. -
నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తే చర్యలు
[ 02-06-2024]
నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ శశికళ అన్నారు. -
భారాస నాయకుల సంబరాలు
[ 02-06-2024]
ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారాసకు చెందిన నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. -
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి
[ 02-06-2024]
సోమవారం నుంచి జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. -
గద్వాలలో నటుడు సుమన్ సందడి
[ 02-06-2024]
గద్వాల పట్టణంలో ఆదివారం ప్రముఖ సినీ నటుడు సుమన్ సందడి చేశారు. -
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
[ 02-06-2024]
గద్వాల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. -
ప్రగతి విరిసేలా.. పాలమూరు మెరిసేలా!
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయ్యింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఉమ్మడి మహబూబ్నగర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు రంగాల్లో ప్రగతి దశగా అడుగులు పడ్డాయి. -
సమగ్ర వికాసమే సంకల్పం
[ 02-06-2024]
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ తమ నియోజక వర్గ సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయమని పాలమూరు శాసనసభ్యులు అంటు న్నారు. ప్రధానంగా సాగునీటి వనరులపై దృష్టి సారిస్తామంటున్నారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భారీ భద్రత
[ 02-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అవాంఛనీయ ఘటనలు -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పాలమూరు పట్టణం ముస్తాబైంది. తెలంగాణ, అంబేడ్కర్, క్లాక్టవర్, వన్టౌన్, కూడళ్లను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
డబ్బాలతోనే రండి.. మాంసం తీసుకెళ్లండి
[ 02-06-2024]
చికెన్, మటన్ కొనడానికి వెళ్లేందుకు ఇక నుంచి వట్టి చేతులతో వెళ్లవద్దని, స్టీల్ డబ్బాలు వెంట తీసుకెళ్లాలని మహబూబ్నగర్ పురపాలక సంఘం పట్టణవాసులను కోరుతోంది. -
విద్యుత్తు శాఖలో ప్రతి పనికి ఓ రేటు!
[ 02-06-2024]
విద్యుత్తు కనెక్షన్ లేని ఇల్లు బహుశ ఉండదేమో. అదే, ఆ శాఖ అధికారులు కొందరికి కలిసి వస్తోంది. నిబంధనల పేరుతో జాప్యం చేయడం.. చేయి తడిపితే పనులు చకచకా చేయడం వారికి సాధారణమైంది. -
చినుకు.. పడితే వణుకే!
[ 02-06-2024]
పట్టణాల్లో రహదారి పక్కనున్న కాలువ చిన్నదే అయినప్పటికీ అది సక్రమంగా లేకపోతే ఎదురయ్యే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఏళ్ల తరబడి నుంచి పట్టణాల్లో నివసిస్తున్న వారికి వర్షం పడితే దడే. -
లోతట్టు కాలనీలపై దృష్టేది?
[ 02-06-2024]
వర్షాల నేపథ్యంలో పురపాలకల్లోని లోతట్టు కాలనీల్లో ఆందోళన నెలకొంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది వార్డుల్లోని మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు -
వానాకాలం.. వ్యాధుల ముప్పు
[ 02-06-2024]
రుతువులతోపాటు వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల వచ్చే వ్యాధులే సీజనల్ రుగ్మతలు. అందులోనూ వానాకాలంలో దోమల వృద్ధి అపారంగా ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్కు ఐదో పెళ్లి
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు