సంక్షిప్త వార్తలు
ఉస్మానియా ఆసుపత్రిపై నియమించిన చీఫ్ ఇంజినీర్ల కమిటీ త్వరగా నివేదిక ఇవ్వాలని మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ..
‘ఉస్మానియా’పై త్వరగా నివేదిక ఇవ్వాలి
ఇంజినీర్ల కమిటీకి మంత్రుల ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిపై నియమించిన చీఫ్ ఇంజినీర్ల కమిటీ త్వరగా నివేదిక ఇవ్వాలని మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం సోమవారమిక్కడ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలతో కలిసి మంత్రులు.. చీఫ్ ఇంజినీర్ల కమిటీతో భేటీ అయ్యారు. హైకోర్టు సూచనలు, కమిటీ నివేదిక ప్రకారం హెరిటేజ్ భవనానికి ఇబ్బందులు కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఈ సందర్భంగా కమిటీకి పలు సూచనలు చేశారు.
ఒరిజినల్ డాక్యుమెంట్ను అప్పగించండి
హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 తీర్పు
ఈనాడు, హైదరాబాద్: బీమా పత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీరుపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వృద్ధురాలిని ఇబ్బంది పెట్టినందుకు రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది. డాక్యుమెంట్ను కమిషన్లో అప్పగించాలని తీర్పు వెలువరించింది. సంజీవ్రెడ్డినగర్కు చెందిన ఫిర్యాదీ పి.వి.మణి(61) ఎల్ఐసీ సంస్థలో బీమా కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. ఈ మేరకు రూ.757 సంవత్సర ప్రీమియం కింద మొత్తం 25 సంవత్సరాలు కడితే చివర్లో రూ.50 వేలు, తదుపరి 10 సంవత్సరాలు ఎలాంటి ప్రీమియం లేకుండానే బీమా పొందే సదుపాయం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో 1994 ఆగస్టు 1న పాలసీ తీసుకున్నారు. 25 సంవత్సరాల ప్రీమియం డబ్బులు ఫిర్యాదీ చెల్లించారు. 2019 ఆగస్టు 22తో ఆ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఒరిజినల్ ఇన్సూరెన్స్ పాలసీ కాగితాలను సదరు సంస్థకు అప్పగించగా మెచ్యూరిటీ లబ్ధి కింద రూ.30,280 చెల్లించారు. అనంతరం మరో 10 సంవత్సరాల బీమా రావాల్సి ఉందని ఒరిజినల్ పాలసీ కాగితాలు ఇవ్వాలని ప్రతివాద సంస్థను కోరగా స్పందించలేదు. దీంతో ఫిర్యాదీ హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. బషీర్బాగ్లోని ఎల్ఐసీ హైదరాబాద్ డివిజన్ కార్యాలయాన్ని ప్రతివాదిగా చేర్చారు. స్పందించిన ప్రతివాద సంస్థ బీమా కాగితాలను ఫిర్యాదీకి పంపామని.. అయితే తప్పుడు చిరునామా ఇవ్వడంతో అవి తిరిగి కార్యాలయానికే వచ్చాయని తెలిపింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 బెంచ్ అధ్యక్షురాలు బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్ ఎల్ఐసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదీ మానసిక వేదనకు పరిహారంగా రూ.15 వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు చెల్లించడంతో పాటు ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ను కమిషన్కు అప్పగించాలని అనంతరం ఫిర్యాదీ దాని సర్టిఫైడ్ కాపీని ఇచ్చి తీసుకోవచ్చని సూచించింది. 45 రోజుల్లో తీర్పును అమలు చేయాలని ప్రతివాద సంస్థను ఆదేశించింది.
ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
కొడంగల్: రావల్పల్లి జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనంపైనుంచి జారి పడి ఒకరు మృతి చెందారు. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్మిటకల్ తాలూకా గుండ్లకుంట గ్రామానికి చెందిన బాబుమియా (50), మాడేపల్లి బుగ్గప్ప కలిసి తాండూరు నుంచి సొంత గ్రామానికి వాహనంపై వెళ్తున్నారు. కొడంగల్ మండలం రావల్పల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే.. వారిలో వెనక కుర్చోన్న బాబుమియా జారిపడి కింద పడ్డాడు. సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
అక్రమ నిర్మాణం కూల్చివేత
శంకర్పల్లి, న్యూస్టుడే: నాలా, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంకర్పల్లి ఆర్ఐ విక్రమ్రెడ్డి అన్నారు. టంగటూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం:300లోని బఫర్ జోన్లో నిర్మిస్తున్న అక్రమ ప్రహరీని సోమవారం రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించి కూల్చివేశారు. ఎవరైనా నాలా, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు.
బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్
పూడూరు: బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని మహిళా ఐక్యకార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. పూడూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో మద్యం తాగించి ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం జరపగా, మరొకరు అత్యాచార యత్నం జరిపిన విషయం తెలిసిందే. ఆ బాలిక కుటుంబాన్ని మహిళా, మానవ హక్కుల సంఘాల నేతలు సంధ్య, ఖలీదా, పర్వీన్, సత్యవతి, సుజాత సూరేపల్లి, దీప్తి, గీతా, మజీద్, ఖలీద్ తదితరులు పరామర్శించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు