డివిజన్లలో తిరగలేకున్నాం!
నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి తొలి సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు సంధించిన కొన్ని ప్రశ్నలివి. మేయర్ స్రవంతి అధ్యక్షతన గురువారం కౌన్సిల్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను వివరించారు. ప్రతిపక్షం
నగరపాలక సంస్థ తొలి సర్వసభ్య సమావేశం
పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగాలపై వాడీవేడి చర్చ
సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు..
‘నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కాలువలు సిల్టుతో నిండిపోయాయి. గతంలో దోమల నివారణ మందైనా పిచికారీ చేసేవారు. ప్రస్తుతం అది కూడా లేదు. ప్రజలు దోమలతో అల్లాడుతున్నారు. కనీసం స్వచ్ఛమైన తాగునీరు సైతం అందించలేకున్నాం.’
‘హోర్డింగ్ల నుంచి పన్నులు వసూలు చేయడం లేదు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు.. హోర్డింగ్ నిర్వాహకులు ఏమైనా ఒప్పందాలు కుదర్చుకున్నారా! నగరంలో సమస్యల పరిష్కారానికి నిధులు లేవంటూ పదేళ్ల పాటు వాహనాలు లీజుకు తీసుకోవడం అవసరమా? ’
‘సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చినా స్పందన ఉండటం లేదు. భారీగా పన్నులు వసూలు చేస్తూ.. సమస్యలు పరిష్కరించకుంటే ఎలా? ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇలా అయితే డివిజన్లలో ఎలా తిరగాలి?’
నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్టుడే : నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి తొలి సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు సంధించిన కొన్ని ప్రశ్నలివి. మేయర్ స్రవంతి అధ్యక్షతన గురువారం కౌన్సిల్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను వివరించారు. ప్రతిపక్షం లేకపోవడంతో కౌన్సిల్లో ప్రవేశపెట్టిన 28 అజెండా అంశాలకు సభ్యులంతా ఆమోదం తెలిపారు. కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు.
పారిశుద్ధ్యంపై దృష్టేదీ?
ఆరోగ్య అధికారి హోటళ్లపై దాడులు చేయడం తప్ప పారిశుద్ధ్యం పట్టించుకోవడం లేదని 14వ డివిజన్ కార్పొరేటర్ ప్రతాప్రెడ్డి విమర్శించారు. కార్పొరేటర్ షేక్ సత్తార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా.. ఫాగింగ్ సరైన రీతిలో జరగడం లేదన్నారు. తాగునీరు, విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం తదితరాలను కూడా మెరుగుపరచలేకపోతున్నారన్నారు. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్, మరో కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ ఊటుకూరు నాగార్జున వివిధ అంశౄలను ప్రస్తావించారు. కిన్నెర మాల్యాద్రి జనవరి 19వ తేదీకే ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటరమణ ఉద్యోగ విరమణ పూర్తయినా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. వాటికి మేయర్ స్పందిస్తూ.. నగరపాలక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకువెళదామన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి సూచిస్తూనే.. సంపూర్ణ సహకారం అందించాలని ప్రజాప్రతినిధులను కోరారు.
సమస్యలు చక్కదిద్దుతాం
కమిషనర్ దినేష్కుమార్ సమాధానాలు ఇస్తూ కార్పొరేషన్కు అవసరమైన జేసీబీ వంటి భారీ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని, అందుకే, లీజు పద్ధతిలో తీసుకున్నామన్నారు. అన్ని డివిజన్లలో వీధి దీపాలు, రోడ్లు మరమ్మతులు, ఇంటింటికి మంచినీటి కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల ఫాగింగ్ , డ్రెయిన్లలో పూడిక తీత, వీధుల్లో కుక్కల బెడద, రోడ్లపై పశువుల సంచారాన్ని నివారిస్తామన్నారు. ఆదిత్యనగర్లో నిర్మాణంలో ఉన్న పార్కుకు గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలని, పొగతోటలో నాగులమిట్ట రోడ్డు నుంచి ట్రంకు రోడ్డు వరకు ఉన్న వీధికి డాక్టర్ పీఎల్రావు పేరు పెట్టాలని కౌన్సిల్ తీర్మానించిందన్నారు.
ఆ పథకాలు పూర్తి చేయాలి - వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ
ప్రతిపక్షం లేని పాలకవర్గాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తాను మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నా. కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తా. భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకానికి కేంద్రం నిధులు అందించింది. వాటిని పూర్తి చేయాలి. రోడ్ల బాగుకు చర్యలు తీసుకోవాలి.
అప్పు గ్రాంట్ కింద మార్చాలి - రూప్కుమార్యాదవ్, డిప్యూటీ మేయర్
గత ప్రభుత్వ హయాంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు 10.5 శాతం వడ్డీతో హడ్కో నుంచి రుణం తెచ్చుకున్నారు. అది కార్పొరేషన్కు మోయలేని భారంగా ఉంది. తాగునీటి పథకం 95 శాతం, భూగర్భ డ్రైనేజీ 85 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ అప్పును గ్రాంట్ కింద మార్చేందుకు కృషి చేయాలి అని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని కోరారు.
మాట్లాడుతున్న మేయర్ పొట్లూరి స్రవంతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరి దృష్టీ పోస్టల్ బ్యాలెట్పైనే.. వైకాపాలో ఇదే గుబులు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొనగా- ఈవీఎంల ద్వారా పడిన ఓట్ల కంటే, ఉద్యోగ, ఉపాధ్యాయులు వేసిన పోస్టల్ ఓట్లు మరింత కాకరేపుతున్నాయి. -
జై హనుమాన్.. శోభాయమానం
[ 03-06-2024]
నెల్లూరు నగరంలో ఆదివారం హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను వాహనాలపై కొలువుదీర్చి.. -
ప్రతి గెలుపు ప్రత్యేకమే!
[ 03-06-2024]
రోజులు గంటలయ్యాయి.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజారిటీ సర్వేలు కూటమికే అవకాశమని తేల్చగా- శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. మరోవైపు వైకాపా తమదే గెలుపని చెబుతోంది. -
నిమ్మ బస్తా రూ. 6వేలు
[ 03-06-2024]
పొదలకూరు మార్కెట్ నిమ్మకాయల బస్తా రూ. ఆరువేలు పలుకుతోంది. గత వారం రోజులుగా ఇక్కడ ఇదే ధర కొనసాగుతుండగా- వేసవి తీవ్రత నేపథ్యంలో మరోవైపు నాణ్యమైన కాయలు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. -
వీవీ ప్యాట్ మెమరీ చిప్ పరిశీలనకు అవకాశం
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ స్పష్టంచేశారు. -
పథకం.. పట్టించుకోని దైన్యం
[ 03-06-2024]
ఉమ్మడి జిల్లాలో ప్రజలకు రక్షిత నీటిని సరఫరా చేసేందుకు 46 మండలాల పరిధిలో 34 పథకాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెన్నా, కండలేరు, కాళంగి, స్వర్ణముఖి తదితర నదుల నీటి ప్రవాహాల ఆధారంగా 2008లో వీటికి శ్రీకారం చుట్టారు. -
ప్రత్యేకావసరాల చిన్నారులపై చొరవ
[ 03-06-2024]
చదువుకు దూరంగా ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించేందుకు సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన ప్రశస్త్ యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. -
కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆన్లైన్ పద్ధతిలో సిబ్బందిని కేటాయిస్తూ రెండో విడత కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ నిర్వహించారు. -
నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాల బంద్
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసేస్తారని ప్రచారం జరగడంతో మద్యంప్రియులు బీర్లు, వైన్ల కొనుగోలుకు బారులుదీరారు. -
తగ్గని బెట్టింగుల జోరు
[ 03-06-2024]
మరో 24గంటల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయినా పందెంరాయుళ్లు మాత్రం బెట్టింగులకు ఏమాత్రం తగ్గడం లేదు. నియోజకవర్గంలోని కందుకూరు, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో గత రెండు రోజులుగా రోజుకు రూ.2కోట్ల నుంచి రూ.4కోట్ల మేర పందేలుగాశారు. -
రెవెన్యూ సమస్యలకు పరిష్కారమెన్నడో?!
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల హడావుడి పుణ్యమా అని అధికారులు రెవెన్యూ సేవలకు సంబంధించిన పనులు వాయిదా వేస్తున్న పరిస్థితి నెలకొంది. -
ఆత్మ.. ఎక్కడమ్మా!
[ 03-06-2024]
జిల్లాలో 37 మండలాలుండగా 722 పంచాయతీలున్నాయి. ఏటా ఖరీఫ్, రబీ సీˆజన్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఈక్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ఆత్మ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిష్పత్తిలో నిధులు సమకూర్చాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
-
దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
-
న్యూయార్క్ స్టేడియం.. గాయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త: ద్రవిడ్
-
రవీనా టాండన్ మద్యం తాగలేదు.. దాడి ఘటనపై పోలీసుల స్పష్టత
-
ప్రపంచ కప్ను చూడాలని లేదు..: రియాన్ పరాగ్ వ్యాఖ్యలు
-
గాల్లో ఢీకొన్న విమానాలు.. పైలట్ మృతి.. వీడియోలో రికార్డయిన దృశ్యాలు!