స్కాన్ చేయండి... వివరాలు తెలుసుకోండి
ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది.
ఇది వరకు ఓటరు చీటీపై ఓటరు చిత్రంతో పాటు వివరాలు ఉండేవి. ఎన్నికల సంఘం ఓటరు చీటీపై గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మార్పులు చేసింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ అమలు చేస్తోంది. ఓటరు చీటీపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. వీటిని ప్రస్తుతం బీఎల్వోలు ఇంటింటికి పంచుతున్నారు. క్యూఆర్ స్కానర్ ద్వారా ఓటరు పూర్తి వివరాలు ఆన్లైన్లో తెలుసుకునే అవకాశముంది. ఓటర్స్ ఈసీఐ.ఇన్ వెబ్సైట్లో లాగినై ఓటరు పేరు వివరాలతో పాటు ఎపిక్ సంఖ్య, క్రమ సంఖ్య, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ పొందుపర్చారు. రూట్ మ్యాప్ కూడా ముద్రించారు. చీటీలు పంచుతున్న బీఎల్వోలు ప్రతిఒక్కరు ఓటు వేయాలని అవగాహన కల్పిస్తున్నారు.
న్యూస్టుడే, నిజామాబాద్ కలెక్టరేట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన పనులు చేపట్టాలి
[ 10-06-2024]
ప్రహరీ గోడ నిర్మాణంలో లోపాలు లేకుండా నాణ్యమైన పనులు చేపట్టాలని ఏఈ పీఆర్వో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. -
కనుల పండువగా హనుమాన్ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం
[ 10-06-2024]
మండలంలోని తాండూర్ గ్రామంలోని పురాతన కాలం నాటి హనుమాన్ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం సోమవారం కన్నుల పండువగా జరిగింది. -
రూ. కోట్లలో అక్రమం.. నోటీసులతో తాత్సారం
[ 10-06-2024]
జిల్లాలోని సహకార సంఘాల్లో నిధుల దుర్వినియోగం వ్యవహారాలు ఏటా వెలుగుచూస్తున్నాయి. అనేక చోట్ల పాలకవర్గాలు ఇష్టారాజ్యంగా అక్రమాలకు తెర లేపాయి. నిర్మాణాల పేరిట అధిక వ్యయాలు చేసి దండుకున్నట్లు కొన్నిచోట్ల బయటపడితే.. పంట రుణాల బకాయిలు చెల్లించిన రైతులకు నకిలీ రసీదులిచ్చి.. -
ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్
[ 10-06-2024]
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 12,833 మంది నమోదు చేసుకోగా 9,945 మంది పరీక్ష రాయగా, 2,888 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. -
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు
[ 10-06-2024]
వానాకాలంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సి.హెచ్.తరుణ్కుమార్ తెలిపారు. -
హడలెత్తిస్తున్న శునకాలు.. జంకుతున్న జనాలు
[ 10-06-2024]
పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పిల్లలు మొదలుకుని పెద్దల వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. -
కొలతల తకరారు
[ 10-06-2024]
పురపాలకశాఖ పారదర్శకత కోసం తెచ్చిన స్వీయ మదింపు విధానం అక్రమార్కులకు వరంగా మారింది. అనుమతులు ఒకలా పొంది.. నిర్మాణాలు మరొకలా చేపట్టి ఆన్లైన్లో ఆస్తి పన్ను మదింపు కోసం దరఖాస్తు చేసుకోగా తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి. -
గుంతలు పడి.. ప్రమాదకరంగా మారి
[ 10-06-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలంలోని పలు ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. నగరం నుంచి గ్రామాల్లోకి వెళ్లే రోడ్లు ధ్వంసమై ప్రమాదకరంగా మారాయి. -
నాసిరకం చేప పిల్లలంటూ ఆవేదన
[ 10-06-2024]
నాసిరకం చేప పిల్లలు సరఫరా చేయడంతో తాము నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేయగా అవి నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. -
ఠాణా వద్దే వాహనం చోరీ
[ 10-06-2024]
నవీపేట ఠాణా వద్ద ఓ వ్యక్తికి చెందిన వాహనం చోరీ అయిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. నవీపేట మండల కేంద్రంలోని కుమ్మరికాలనీకి చెందిన మల్లేశ్ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. -
నీరు సక్రమంగా వస్తోందా..?
[ 10-06-2024]
జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో ఏర్పాటు చేసిన ఇంటింటా కుళాయిల పరిస్థితిపై సర్కారు దృష్టి సారిచింది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రతి ఇంటా కుళాయిలు ఉన్నాయా..? ఉంటే నీరు సక్రమంగా వస్తోందా..? సరఫరా చేస్తున్న నీరు కుటుంబానికి సరిపోతుందా..? -
సమష్టి కృషితోనే పట్టణ ప్రగతి
[ 10-06-2024]
‘పట్టణాభివృద్ధికి కలిసి కదులుదాం.. రాజకీయాలకు తావు లేకుండా అడుగులు వేద్దాం.. సమష్టి కృషితోనే పట్టణ ప్రగతి సాధ్యమవుతుంది. అభివృద్ధి విషయంలో విలువైన సలహాలు, సూచనలిస్తే అమలుకు చర్యలు చేపడతాం’ అని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. -
నిధులొస్తేనే నిర్వహణ
[ 10-06-2024]
ప్రభుత్వ బడులకు నిధుల కొరత వేధిస్తోంది. సాధారణ కార్యకలాపాలకు కూడా కష్టతరమవుతోంది. రోజురోజుకీ నిర్వహణ భారంగా మారుతోంది. ఏటా విద్యాసంవత్సర ప్రారంభంనాటికి సర్కారు నుంచి నయాపైసా మంజూరు కావడం లేదు. -
మహిళతో వివాహేతర సంబంధం
[ 10-06-2024]
రెంజల్ ఠాణాలో ఓ కానిస్టేబుల్ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో సదరు మహిళ భర్త నిజామాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.