‘కాంగ్రెస్కు చేనేత కార్మికుల కష్టాలు పట్టవు’
కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు ఏ మాత్రం పట్టవని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
మాట్లాడుతున్న భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి
నిజామాబాద్ అర్బన్, న్యూస్టుడే: కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు ఏ మాత్రం పట్టవని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పద్మశాలి కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. భారాస హయాంలో ఏటా బతుకమ్మ చీరల తయారు చేయించడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించామన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో పాటు బీడీ, చేనేత కార్మికులకు పింఛన్ ఇవ్వడం లేదన్నారు. పేదింటి ఆడపిల్లకు పెళ్లి ఖర్చుల నిమిత్తం కల్యాణ లక్ష్మి ద్వారా తాము సాయం అందిస్తే.. దాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పద్మశాలీలను ఆదుకున్నది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మాట్లాడుతూ.. అర్బన్ నియోజకవర్గంలో పద్మశాలి సంఘాలకు రూ.8 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశామన్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు. నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు వెంకటనర్సయ్య, ప్రధాన కార్యదర్శి మురళి, ప్రతినిధులు సత్యపాల్, హన్మాండ్లు, గుండయ్య, యాదగిరి, ధర్మపురి, మహేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమవారం నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
[ 02-06-2024]
జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
[ 02-06-2024]
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్ననాటి మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహయం చేసి చిన్ననాటి మిత్రులు మంచి మనస్సును చాటుకున్నారు. -
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
[ 02-06-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. -
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
[ 02-06-2024]
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలో వేడుకలు నిర్వహించారు. -
కామారెడ్డిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
[ 02-06-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం వివిధ పక్షాల ఆధ్వర్యంలో నిర్వహించారు. -
దశదిశలా ప్రగతి సాగాలి
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్ది ప్రత్యేక స్థానం. అభివృద్ధిలోనూ ప్రత్యేక ముద్ర కనిపించినా.. ఆశించిన ఫలితాలు దక్కలేదు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది. నేటితో 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటోంది. -
ఉద్యమానికి ఊపిరై.. స్వరాష్ట్ర సాధకులై
[ 02-06-2024]
నిజాం చెర నుంచి విముక్తి కోసం జరిగిన విమోచనోద్యమంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యేవరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు పోరాట పటిమతో ఉద్యమం చేపట్టారు. -
రాష్ట్ర గీతం సృష్టికి ఇందూరే స్ఫూర్తి
[ 02-06-2024]
రాష్ట్ర గీతంగా గుర్తించడం అందెశ్రీకి దక్కిన గౌరవం. తెలంగాణ తొలిదశ ఉద్యమానికి దాశరథి ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ ఊపిరిలూదితే.. మలి దశ పోరాటంలో అందరిలో స్ఫూర్తి నింపింది అందెశ్రీ గీతం.. -
తండా రోడ్డు తవ్వేశారు...
[ 02-06-2024]
రైతుల మధ్య ఏర్పడిన పంచాయితీ రోడ్డు తవ్వేయడానికి కారణమైంది. మంచిప్పకు చెందిన ఓ రైతు శివలాల్ తండాకు వెళ్లే రోడ్డును పొక్లెయిన్తో శనివారం తవ్వించేశారు. -
ఉపాధి కల్పిస్తానని మోసం
[ 02-06-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రంలో దక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరిట విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసగించిన ఘటన శనివారం వెలుగుచూసింది. -
డిగ్రీ పరీక్షల్లో ముగ్గురి డిబార్
[ 02-06-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో నిజామాబాద్లోని ఇందూరు ఉషోదయ, బోధన్లోని ఎస్వీ, ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. -
అక్రమ కుళాయిలపై కొరడా
[ 02-06-2024]
నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అక్రమ కుళాయిలపై కొరడా ఝలిపించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు రంగం సిద్ధం చేశారు. -
కలెక్టరేట్లో వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదివారం ఉదయం 8.45కు వినాయక్నగర్లోని అమరవీరుల
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు
-
ఎగ్జిట్ పోల్స్కి విలువ లేదు.. మమత రియాక్షన్ ఇదే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సినీ నటుడి బ్యాగులో 40 బుల్లెట్ల గుర్తింపు