తెదేపా విజయం ఖాయం
రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని గజపతినగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మరడాం సభలో మాట్లాడుతున్న శ్రీనివాస్
దత్తిరాజేరు, గుర్ల, సంతకవిటి, న్యూస్టుడే: రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని గజపతినగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. దత్తిరాజేరులోని ఇంగిలాపల్లి, కె.కృష్ణాపురం, మరడాం గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రశేఖర్, ఈశ్వరరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ః గుర్ల మండలం వల్లాపురంలో ఉపాధి వేతనదారులకు తెదేపా బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నె సన్యాసినాయుడు, టి.కిరణ్కుమార్, మహేశ్వరరావు, రమేష్రాజు ‘సూపర్-6’ పథకాలను వివరించారు. ః సంతకవిటి మండలం కేఆర్ పురం, కొండగూడెం తదితర గ్రామాల్లో రాజాం అభ్యర్థి కోండ్రు మురళీమోహన్, కొల్ల అప్పలనాయుడు, గట్టిభాను తదితరులు ప్రచారం చేపట్టారు.
మెంటాడలో ప్రచార రథంపై సంధ్యారాణి తదితరులు
చంద్రబాబుతోనే ఉపాధి
మెంటాడ(గజపతినగరం), బొబ్బిలి గ్రామీణం, రామభద్రపురం, బాడంగి: అయిదేళ్లుగా సీఎం జగన్ యువతకు ఉపాధి లేకుండా చేశారని, ఉద్యోగావకాశాలు పెరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని సాలూరు కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కుంటినవలస, చామలాపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొబ్బిలి పట్టణ పరిధి గొల్లపల్లిలోని 10, 11, 12 వార్డుల్లో కూటమి అభ్యర్థి బేబినాయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. 16 వార్డు మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు శ్రీనివాసరావు, ఏడో వార్డుకు చెందిన దిబ్బ లోకేష్, సారధితోపాటు పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ః ఇట్లామామిడిపల్లి గ్రామానికి చెందిన 25 కుటుంబాలు కరణం భాస్కరరావు ఆధ్వర్యంలో వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. ః బాడంగి మండలం పూడివలస, పాల్తేరు గ్రామాల్లో తెదేపా జిల్లా బీసీ సాధికారత కన్వీనర్ కొల్లి అప్పలనాయుడు, రామభద్రపురంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. వాలేసి
[ 18-06-2024]
భూమి లేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై పెద్దలు కన్నేసి గద్దల్లా వాలిపోయారు. గత ప్రభుత్వం అసైన్డ్ భూములకు యజమాన్య హక్కు కల్పించనుందని తెలిసి వాటి అమ్మకాలు, కొనుగోళ్లు చట్ట ప్రకారం చెల్లవని తెలిసినా అనధికార లావాదేవీలతో గుంజుకున్నారు. -
నాటి వైభవం.. చంద్రన్నతో సాధ్యం
[ 18-06-2024]
మన్యంలోని గిరిశిఖర గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు గతంలో తెదేపా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరులో గిరిజన గర్భిణుల వసతి గృహం ఏర్పాటు చేసింది. -
ప్రక్షాళన జరగాలి.. సహకారం అందాలి!!
[ 18-06-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) రైతులే సభ్యులు. గతంలో సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారే పాలకవర్గాలను ఎన్నుకునేవారు. దీంతో మెరుగైన సేవలు అందేవి. -
వర్షాలు మిగిల్చిన విధ్వంసం
[ 18-06-2024]
గత రెండు రోజులుగా మన్యంలో కురుస్తోన్న వర్షాలతో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద తాకిడికి పలు రహదారులు కొట్టుకుపోయాయి. పాచిపెంట మండలంలో తారురోడ్లు ఛిద్రమయ్యాయి. -
వైకాపా విధానాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 18-06-2024]
పట్టణవాసుల నెత్తిపై బండలా మారిన చెత్తపన్నును కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈమేరకు అన్ని జల్లాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘంలో పన్ను విధించేవారు. -
వర్షం పడితే చెరువే
[ 18-06-2024]
సీతానగరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పలు చోట్ల చెరువులా మారింది. వైకాపా అయిదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. -
ఇంటిపై పిడుగుపాటు
[ 18-06-2024]
పాచిపెంట మండల కేంద్రంలోని ఓ ఇంటిపై పిడుగు పడింది. సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. -
గెడ్డగూడ ఘాట్లో వ్యాన్ బోల్తా
[ 18-06-2024]
సీతంపేట మండలం గెడ్డగూడ సమీపంలోని ఘాట్ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృత్యువాత
[ 18-06-2024]
అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతిచెందిన ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ వివరాల మేరకు.. స్థానిక బంగారమ్మ కాలనీకి చెందిన అనూష అలియాస్ తనూజ(22)కు నాలుగు నెలల కిందట వివాహమైంది. -
రైలు ప్రమాదంలో తెగిపడిన కాళ్లు
[ 18-06-2024]
అనుకోని ప్రమాదంలో ఓ వ్యక్తి తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలిసేలోపే తన శరీరం నుంచి తెగిపడడంతో అతడి రోదన వర్ణనాతీతంగా మారింది. -
మద్యం దుకాణం వద్ద ఘర్షణ ముగ్గురికి కత్తి పోట్లు
[ 18-06-2024]
నగరంలోని పూల్బాగ్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
విశాఖలో జరిగిన ఆ కిడ్నాప్.. ఇప్పటికీ ఓ మిస్టరీ!
-
అమెరికాను కలసికట్టుగా ఎదుర్కొంటాం.. కిమ్తో భేటీకి ముందు పుతిన్
-
భవారియా గ్యాంగ్ బరితెగింపు.. పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠా సవాల్
-
5 రోజుల్లో లక్ష మందిని కలిసిన ఒడిశా సీఎం
-
పిల్లలకు హెల్దీ లంచ్బాక్స్.. ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు!