కూటమిని గెలిపిస్తే నెలకు రూ.4 వేల పింఛను
కూటమి అభ్యర్థులను గెలిపిస్తే పింఛను నెలకు రూ. 4 వేలు అందిస్తారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని జనసేన పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల ముఖ్యవ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీష్కుమార్ అన్నారు.
ఎలమంచిలిలో బుల్లితెర తారల సందడి
తులసీనగర్లో ప్రచారం చేస్తున్న బుల్లితెర తారలతో సతీష్కుమార్
ఎలమంచిలి, న్యూస్టుడే: కూటమి అభ్యర్థులను గెలిపిస్తే పింఛను నెలకు రూ. 4 వేలు అందిస్తారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని జనసేన పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల ముఖ్యవ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీష్కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన టీవీ సీరియల్ తారలు పూజా మూర్తి, హాసిన తారక్, సహస్ర నాయుడుతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. వీరి రాకతో ప్రచారం ప్రత్యేకతను సంతరించుకుంది. వీరిని చూడటానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గాజుగ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి ఎమ్మెల్యేగా విజయ్కుమార్ను, ఎంపీగా సీఎం రమేశ్ను గెలిపించాలని కోరారు. జగన్ని ఇంటికి పంపిస్తే తప్ప రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలతో ముచ్చటించారు. కరపత్రాలు అందజేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కూటమి గెలిస్తే రైతులకు ఏడాదికి రూ. 20 వేలు, ప్రతి కుటుంబానికి మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తారన్నారు. కూటమి నాయకులు లాలం సోమినాయుడు, ఆడారి రమణబాబు, గంధం శివ, సుందరపు శైలజ, సుందరపు దమయంతి, బొద్దపు శ్రీను, ఆడారి ఆదిమూర్తి, మహిళలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
[ 02-06-2024]
రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
[ 02-06-2024]
నగరంలో ఆదివారం ఉదయం ఈదరుగాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలాయి. -
అధికార పార్టీ అండ.. అడ్డులేని దందా..
[ 02-06-2024]
అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు.. మున్సిపల్ నేత పేరు చెప్పి మరికొందరు ఎలమంచిలిలో అక్రమంగా ఇసుక, కంకర వ్యాపారం చేస్తూ రెండు చేతులా అక్రమంగా సంపాదిస్తున్నారు. -
భీమిలి తీరంలో విధ్వంసం ‘విజయ’వంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
విఘాతం కలిగిస్తే సహించం
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని జిల్లా ఎస్పీ మురళీకృష్ణ కోరారు. శనివారం ఇక్కడి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శాంతిభద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు
[ 02-06-2024]
ఈ నెల నాలుగున ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. -
మురుగు సొగసు కనుమా!
[ 02-06-2024]
సాధారణంగా వర్షాకాలం వచ్చేలోపే జీవీఎంసీ అధికారులు గెడ్డలు, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించి పూడికలు తీయాలి. అయితే ఈ ఏడాది పనులు ఆలస్యంగా మొదలు కావడంతో ఇప్పటికీ చాలా చోట్ల పూడిక పనులు పూర్తికాలేదు. -
పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితం
[ 02-06-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి పోలైన ఓట్లను ఈనెల 4న ఉదయం 8 గంటల నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని 21 హాళ్లలో లెక్కిస్తామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
వర్షంతో ఉపశమనం
[ 02-06-2024]
ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లావాసులకు వర్షంతో ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులతో నగరం దద్దరిల్లింది. శుక్రవారం రాత్రి విశాఖలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. -
సింగపూర్కు ‘ఐఎన్ఎస్ శివాలిక్’ నౌక
[ 02-06-2024]
భారత నౌకాదళానికి చెందిన రక్షణ నౌక ‘ఐఎన్ఎస్ శివాలిక్’ సింగపూర్ పర్యటనకు వెళ్లిందని శనివారం నేవీ వర్గాలు తెలిపాయి. దక్షిణ చైనా పసిఫిక్ సముద్ర గస్తీ విధుల్లో భాగంగా శివాలిక్ నౌక -
సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
[ 02-06-2024]
సరకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు సృష్టించిందని ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ‘ఈ ఏడాది మార్చిలో 201 నౌకల ద్వారా 76,22,732 మెట్రిక్ టన్నుల సరకు రవాణా ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది. -
3వ తేదీన విశాఖ- గుణుపురం రైలు రద్దు
[ 02-06-2024]
నౌపడా-గుణుపురం మార్గంలో తిరుగుతున్న విశాఖ- గుణుపురం రైలు ఈ నెల 3వ తేదీన రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్కు ఐదో పెళ్లి
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు