‘కడియం మోసాలు అందరికీ తెలుసు’
దళిత ద్రోహి కడియం శ్రీహరి గురించి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని, ఆయన మోసాలు మొత్తం ప్రజలకు తెలుసని భాజపా లోక్సభ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు.
తాటికొండలో ప్రసంగిస్తున్న భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్
స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్, రఘనాథపల్లి, న్యూస్టుడే: దళిత ద్రోహి కడియం శ్రీహరి గురించి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని, ఆయన మోసాలు మొత్తం ప్రజలకు తెలుసని భాజపా లోక్సభ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునాథపల్లి, ఖిలాషాపురం, ఘన్పూర్, తాటికొండ, ఇప్పగూడెం, జఫర్గఢ్ మండల కేంద్రంలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ.. చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన శ్రీహరి నియోజకవర్గానికి, ఒక్క దళితుడికైనా మేలు చేశాడా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దళితులకు అన్యాయం చేసింది కడియం శ్రీహరేనని విమర్శించారు.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను వర్ధన్నపేటలో మూడోసారి గెలిస్తే ఎక్కడ మంత్రి పదవి వస్తుందోనని.. పనికట్టుకొని డబ్బులు ఖర్చుపెట్టి ఓడించాడని ఆరోపించారు. కేంద్రంలో మళ్లీ భాజపా అధికారంలోకి రానుందని, తనను గెలిపిస్తే ఉమ్మడి జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేస్తానని వివరించారు. రాష్ట్ర నాయకుడు బొజ్జపల్లి సుభాష్, పార్టీ మండలాధ్యక్షులు వెంకటరమణ, నాగేష్, అయోధ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్యం ‘కొని’తెచ్చుకోవడమే..!
[ 01-06-2024]
ఓరుగల్లు నగరంలో గురువారం ఆహార భద్రత తనిఖీ అధికారులు ఆకస్మికంగా మూడు రెస్టారెంట్లపై దాడులు చేయగా అనేక లోపాలను గుర్తించారు. -
మీ సేవ దోపిడీ తోవ
[ 01-06-2024]
ప్రభుత్వశాఖల పౌర సేవల్లో పారదర్శకత.. సులభతరం కోసం ఏర్పాటు చేసిన మీ-సేవ కేంద్రాల్లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. -
అద్దె కారు.. నిబంధనలు బేఖాతరు!
[ 01-06-2024]
‘చేతిలో అధికారం ఉంది.. మనల్ని ఎవరు అడుగుతారులే’ అన్నట్లుగా ఉంది గ్రేటర్ వరంగల్లో వింగ్ అధికారుల తీరు. నాలుగేళ్లుగా టెండర్ పిలవకుండానే అద్దె వాహనాలు నడిపిస్తున్నారు. -
బడి బస్సు..భద్రమిలా!
[ 01-06-2024]
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి. ఎందులో విద్యా ప్రమాణాలు బాగుంటాయి. అక్కడ ఏ విధమైన వసతులున్నాయి. -
పాలు.. ఆరోగ్యానికి మేలు
[ 01-06-2024]
పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా.. బలంగా ఎదగాలన్నా.. పాలు తప్పనిసరి.. అంతేకాదు ఆర్థిక అవసరాలను తీరుస్తూ కుటుంబ పోషణకు నేడు పాడి పరిశ్రమ ఎంతగానో దోహదం చేస్తోంది.. నేడు ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా అటు ఆరోగ్యం.. -
మీసేవ కేంద్రం.. ఇష్టారాజ్యం
[ 01-06-2024]
ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాల నిర్వాహకులు జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -
అవతరణ వేడుకలకు ముస్తాబు
[ 01-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబు అవుతున్నాయి. -
దరిచేరని.. పీఎం మత్స్యయోజన
[ 01-06-2024]
రాష్ట్రంలో మాంసాహార ప్రియులు మేకలు, గొర్రెలు, కోళ్ల మాంసం తర్వాతి స్థానం చేపలకే ఇస్తారు. -
ఉపరితల గనిలో ‘పంచ్ ఎంట్రీ’
[ 01-06-2024]
సింగరేణిలో మరో ‘పంచ్ ఎంట్రీ’ గని ఏర్పాటు చేయనున్నారు. -
రోహిణికార్తె.. నిప్పుల కుంపటి..!
[ 01-06-2024]
ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. -
క్రీడా నైపుణ్యాలకు పదును
[ 01-06-2024]
వివిధ క్రీడాంశాల్లో తన నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దుకొనేందుకు ఔత్సాహిక క్రీడాకారులకు జిల్లాలోని వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు ఊతమిచ్చాయి. -
ధ్రువపత్రాల జారీకి అధిక వసూళ్లు
[ 01-06-2024]
తహసీల్దార్ కార్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ దరఖాస్తుల్లో మీ సేవా కేంద్రం నిర్వాహకులు దొడ్డిదారిలో వసూళ్లకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!
-
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్కు మోదీ నివాళులు
-
అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు: విశాఖ కలెక్టర్