ఉద్యోగుల ఓట్లకూ గేలం
సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఓటేయకుండా చూడాలనే ప్రభుత్వ పన్నాగంలో భాగంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లకు మోకాలడ్డారన్న విమర్శలున్నాయి.
అడుగడుగునా వైకాపా నాయకుల ప్రలోభాలు
ఈనాడు డిజిటల్, భీమవరం, న్యూస్టుడే బృందం: సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఓటేయకుండా చూడాలనే ప్రభుత్వ పన్నాగంలో భాగంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లకు మోకాలడ్డారన్న విమర్శలున్నాయి. నిబంధనలేమీ వెల్లడించకపోవడంతో ఉద్యోగినులు హ్యాండ్ బ్యాగ్లు, చరవాణులతో వరుసలో నిలబడగా.. వాటిని లోపలికి అనుమతించలేదు.
భీమవరం, ఉండి నియోజకవర్గాలకు ఎస్ఆర్కేఆర్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలవరం, గణపవరం ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోగా వారి ఓట్లు ఇంకా రాకపోవడంపై కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. పాలకొలు ఎంఎంకేఎన్ఎం పాఠశాలలో కుర్చీలు లేకపోవడంతో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడ్డారు. తాడేపల్లిగూడెంలోని కడకట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంపై కొంతమంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆచంటలో మందకొడిగా పోలింగ్ జరిగింది. నరసాపురంలో వై.ఎన్ కళాశాలలో సరైన సమాచారం లేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.
ఆగని పైరవీలు.. ఓటర్లను ఇప్పటికే అనేక ప్రలోభాలకు గురిచేస్తున్న వైకాపా నాయకులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను కొనుగోలుకు సైతం బేరసారాలు సాగించారు. తాడేపల్లిగూడెం కేంద్రం వద్ద వైకాపా నాయకులు నగదు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు దిగారు. ఓటేసి సెల్ఫోన్లో ఫొటో తీసి పంపిస్తే రూ.3 వేలు ఇస్తామని ఆశ చూపారని కొంతమంది వాపోయారు. తణుకులోని జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాల కేంద్రానికి కూత వేటు దూరంలో వైకాపా నాయకులు ప్రలోభాలకు తెర తీశారు. ఆచంట పరిధిలో అధికార పార్టీ నాయకులు ఓటర్లకు వెండి గిన్నెలు పంపిణీ చేశారు.
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: తాడేపల్లిగూడెంలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి కొట్టు సత్యనారాయణ బంధువు నిమ్మల నాని ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. డబ్బుతో కూడిన కవర్లు అందిస్తూ కనిపించారు.
నీ తాడేపల్లిగూడెంలోని కేంద్రం వద్ద అధికార పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కార్లకు వైకాపా జెండాలు కట్టి కేంద్రం వద్దకు వస్తుండగా కొందరు జనసేన నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు పరిస్థితిని సమీక్షించి ఇరువర్గాలను పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో జనసేన నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేశ్ను పోలీసులు అడ్డగించారు. పోలింగ్ జరిగే ప్రాంతంలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకింత.. మాకింత!
[ 02-06-2024]
ఏలూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అక్రమాల ఊబిలో కూరుకుపోయింది. ఆస్తి పన్నుల విషయంలో అధికారుల చేతివాటంతో నగర పాలిక ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. వాణిజ్య భవనాలను నివాసాలుగా చూపించడం, కొత్తగా కట్టిన నిర్మాణాలకు పన్నులు విధించకపోవడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. -
బంధంచర్ల అడవిలో చిరుతపులి సంచారం!
[ 02-06-2024]
టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఫాస్ట్ పాసింజర్ విజయవాడ వరకే
[ 02-06-2024]
నరసాపురం - గుంటూరు మధ్య నడిచే ఫాస్ట్ పాసింజర్ రైలు జూన్ 30 వరకు విజయవాడ వరకే నడవనుందని రైల్వేశాఖాధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ మరమ్మతులు చేపట్టినందున ఈ రైలు సేవలను గత నెలలో రద్దుచేశారు. -
ఎండన పడ్డ పండుటాకులు
[ 02-06-2024]
మండుటెండలో పండుటాకులు విలవిల్లాడారు. ఒకటో తేదీ నుంచి ఇంటికే పింఛను అందించే వ్యవస్థలు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసింది. వేసవి కావడంతో లబ్ధిదారులందరూ పింఛను నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు. -
ప్రతిపాదనలతో నీళ్లొదిలేశారు!
[ 02-06-2024]
వేసవిలో చేపట్టాల్సిన పంట కాలువల నిర్వహణ పనులకు ఆమోదం లభించకుండానే ఈ ఏడాది సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఈ సారి కీలకమైన పూడిక తీత పనులకు అవకాశం లేకుండాపోయింది. -
అంజనీసుతా.. అతులిత బలధామా!
[ 02-06-2024]
హనుమజ్జయంతిని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో శనివారం వైభవంగా నిర్వహించారు. భీమవరంలోని పంచారామక్షేత్రం సోమేశ్వర జనార్దనస్వామి దేవస్థానం ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామి ఉపాలయంలో ఉదయం స్వామికి అభిషేకాలు, లక్ష తమలపాకుల పూజలు, మూలమంత్ర హోమం చేశారు. -
4న భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భీమవరం పట్టణంలో ఈ నెల 4న ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు ఎస్పీ వి.అజిత తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి వాహనాలను వేర్వేరు మార్గాల్లో మళ్లిస్తామన్నారు. లెక్కింపు కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే నిలుపుదల చేయాలని సూచించారు. -
దిక్కు లేని ర.భ.శాఖ
[ 02-06-2024]
ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖకు భవనం నిర్మించాలన్నా రహదారులు భవనాలశాఖ డిజైన్ చేసి అనుమతి ఇవ్వాల్సిందే. రహదారులు అభివృద్ధి నిర్వహణ అంతా ఆ శాఖపైనే ఆధారపడి ఉంటుంది. -
ఎప్పటిలాగే ఏకరవు!
[ 02-06-2024]
జడ్పీటీసీ సభ్యులు పలువురు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఏకరవు పెట్టారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు తమ మండలాల్లోని సమస్యలను ప్రస్తావించారు. -
కళాశాలల్లో సమస్యల స్వాగతం
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతులు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. కళాశాలల పునఃప్రారంభం నేపథ్యంలో వాటి ఆవరణలను పరిశీలిస్తే నాడు-నేడు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్జీ.. ఇప్పటికైనా పగటి కలలు కనడం మానండి: రవిశంకర్
-
తిహాడ్ జైలులో లొంగిపోయిన కేజ్రీవాల్
-
భారత్తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్
-
ట్యాంక్బండ్పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్ సింగ్ తమాంగ్?