కొడాలి నాని నామినేషన్పై ప్రతిష్టంభనే
గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ ప్రస్తుతానికి ఆమోదం పొందినా చివరి వరకు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
అఫిడవిట్లో లోపాలపై ఆధారాల సమర్పణ
లోపాన్ని కప్పిపుచ్చేందుకు మల్లగుల్లాలు
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-గుడివాడ గ్రామీణం: గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ ప్రస్తుతానికి ఆమోదం పొందినా చివరి వరకు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డీకే బాలాజీ... పూర్తి నివేదిక ఇవ్వాలని గుడివాడ ఆర్డీవో పద్మావతిని కోరారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా తలెత్తిన పరిణామాలపై ఆమె కలెక్టర్కు నివేదికను సమర్పించారు. ఆధారాలు సమర్పించాలని తెదేపా సభ్యులకు నోటీసులు జారీచేసిన ఆర్వో.. మరోవైపు వైకాపా అభ్యర్థి కొడాలి నానికీ నోటీసులిచ్చారు. దీంతో అద్దె భవనం వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అద్దె చెల్లింపు పత్రాల సృష్టి?
నోటీసులకు నాని వివరణ ఇచ్చినట్టు సమాచారం. తెదేపా నేతలు ఎత్తిచూపిన లోపాల్లో ప్రధానమైన పాత మున్సిపల్ కార్యాలయాన్ని.. తాను లీజుకు తీసుకుని అద్దె చెల్లించినట్టు పత్రాలు సృష్టించారని తెలిసింది. మున్సిపల్ కమిషనర్ నుంచి ఈ మేరకు పత్రాలను తీసుకున్నట్టు సమాచారం. తాను బకాయి లేకపోవడం వల్లే.. అఫిడవిట్లో దాన్ని పొందుపరచలేదని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. కానీ.. ప్రభుత్వ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నా ఆ వివరాలనూ కచ్చితంగా అఫిడవిట్లో నమోదుచేయాలని తెదేపా నేతలు చెబుతున్నారు. అంతే తప్ప.. నో అని పెట్టడమేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆధారాల సమర్పణ
కొడాలి నాని నామినేషన్ పత్రాల్లో అభ్యంతరాలకు తగిన ఆధారాలు సమర్పించాలని ఆర్వో పద్మావతి తెదేపాకు నోటీసులు జారీచేశారు. దాంతో వారు శనివారం ఆధారాలు అందజేశారు. తెదేపా నేతలు ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తులసిబాబు, హైకోర్టు న్యాయవాది అరవింద్ కలిసి గుడివాడ ఆర్వో కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలను ఆధారాలతో ఆర్వోకు సమర్పించారు. పాత మున్సిపల్ కార్యాలయాన్ని గత ఐదేళ్లుగా నాని వినియోగించారనేందుకు ఆధారాలను ఇచ్చారు. నాని నామినేషన్ అఫిడవిట్లోని 17వ పేజీలో ప్రభుత్వ అకామడేషన్ను వాడుకోలేదంటూ నో అని పెట్టడం.. నిబంధనల ప్రకారం తప్పని చెప్పారు. ఐదేళ్లు ప్రభుత్వ భవనాన్ని నాని వాడుకున్నారని మున్సిపల్ కమిషనర్ ధ్రువీకరించిన పత్రాలనూ తెదేపా నేతలు అందజేశారు. దీని ఆధారంగా నానిని అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారుల స్పందనను బట్టి.. తాము న్యాయపోరాటం చేస్తామని రావి వెంకటేశ్వరరావు, తులసి వెల్లడించారు.
ఆధారాలతో సహా లోపాలు తెలియజేశాం
- రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, గుడివాడ
నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా మేం లేవనెత్తిన లోపాలకు సంబంధించిన వివరాలు, ఆధారాలను ఆర్వోకు అందజేశాం. మేము శుక్రవారమే ఈ లోపాలను ఆర్వో దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. ఆమె కొడాలి నాని ప్రలోభాలకు లొంగిపోయి మేం చెప్పేది వినిపించుకోలేదు. మమ్మల్ని బయటకు పొమ్మని, కేసులు పెడతామని బెదిరించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో.. ఎట్టకేలకు మా అభ్యంతరాలకు ఆధారాలు చూపించాలంటూ నోటీసులు ఇచ్చారు. అలా ఇచ్చారంటేనే తప్పు జరిగినట్టు అర్థమవుతోంది కదా. గత 20 ఏళ్లుగా కొడాలి నాని గుడివాడను సర్వనాశనం చేశాడు. ఈ ఎన్నికల్లో ఆయన్ను వదిలించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని మాకు రక్షణ కల్పించి, గుడివాడలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి.
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం
- తులసిబాబు, తెదేపా నేత
కొడాలి నాని అఫిడవిట్లో లోపాలున్నా ఆర్వో వత్తాసు పలకడంపై ఇప్పటికే హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశాం. గుడివాడను మట్టిమాఫియా, ఇసుక దోపిడీ, జూదశాలలు, బెట్టింగ్ ముఠాలకు కేంద్రంగా నాని మార్చేశారు. అందుకే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది. ఆర్వో తనకున్న అధికారాన్ని ఉపయోగించుకుని.. నానికి వత్తాసు పలికారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లి మద్దతు షర్మిలకే
రాజశేఖరరెడ్డిని ఎలా ఆదరించారో కడప నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ఆయన ముద్దుబిడ్డ షర్మిలనూ అలాగే ఆశీర్వదించాలని విజయమ్మ కడప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్కు సరిగ్గా 48 గంటల ముందు అమెరికా నుంచి ఆమె వీడియో సందేశం విడుదల చేయడం సీఎం జగన్కు ఊహించని షాక్గా పరిణమించింది. -
జగన్ గెలిస్తే భవిష్యత్తు ఉండదు
ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోకపోతే మళ్లీ వచ్చేది జగనే.. వైకాపా గూండాలే. ప్రజలు బలంగా నిలబడి వైకాపా ప్రభుత్వాన్ని మట్టిలో తొక్కకపోతే భవిష్యత్తు ఉండదు. నేరగాళ్లు రాజకీయాల్లో ఉండకూడదు. -
ఐదేళ్ల పాలనకు విజన్ డాక్యుమెంట్
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని జగన్ ఊరూరా తిరిగి మాయమాటలు చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ కంటే రెండింతలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు. -
సంక్షిప్త వార్తలు
ఏ రిజర్వేషన్కూ తాము వ్యతిరేకం కాదని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకే వ్యతిరేకమని భాజపా జాతీయ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ తెలిపారు. ముస్లింలలోని అగ్రకులాలకు ‘ఈడబ్ల్యూఎస్’ కేటగిరిలో రిజర్వేషన్ ఉంటుందని వివరించారు. -
సినీనటుడు అల్లు అర్జున్పై కేసు నమోదు
నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. -
ఆదోనీలో ఇంటింటికీ డబ్బుల పంపిణీ.. అడ్డుకున్న స్థానికులు
కర్నూలు జిల్లా ఆదోనిలో వైకాపా నేతలు వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
ఏపీలో ఉత్కంఠ పోరు: గతంలో 79.84 శాతం పోలింగ్ .. ఈసారి ఎంతో.. ?
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నిల పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. -
ప్రచారానికి తెర.. తెలుగు రాష్ట్రాల్లో మూగబోయిన మైక్లు
తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. -
32వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే జగన్ ఒక్క మాట మాట్లాడలేదు: పవన్
దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు సీఎం ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. -
తిరుగుబాటు మొదలైంది.. కూటమిదే అధికారం: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. కూటమిదే అధికారమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
పిఠాపురంలో రామ్చరణ్.. జనసైనికుల్లో నూతనోత్సాహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా ప్రముఖ నటుడు రామ్చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలో పర్యటించారు. -
కడప జిల్లా ప్రజల తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సునీత
ఈ ఎన్నికల్లో కడప జిల్లా ప్రజల ఇచ్చే తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. -
పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారు: నాగబాబు
వైకాపా నేతలు పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. -
షర్మిలను గెలిపించండి: వైఎస్ విజయమ్మ
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. -
రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే: చంద్రబాబు
ఉద్యోగాలు కావాలంటే ఎన్డీయేను గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. -
నా సోదరి షర్మిలను లోక్సభకు పంపించాలి: కడప సభలో రాహుల్గాంధీ
తన తండ్రికి వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరుడు లాంటివారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) అన్నారు. వాళ్లిద్దరూ అన్నదమ్ముల్లా ఉండేవారని చెప్పారు. -
ఐటీ కేంద్రంగా తిరుపతిని తీర్చిదిద్దుతాం: జేపీ నడ్డా
ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో కూటమి విజయం ఖాయమని అర్థమవుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
ఇదే ఉత్సాహం ఓటేయడంలోనూ చూపాలి!
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద శుక్రవారం మందుబాబులు బారులుతీరారు. -
వైట్ కాలర్ రాజకీయ మాఫియా!
ఆ సంస్థ ఒక వైట్ కాలర్ రాజకీయ మాఫియా.. విష ప్రచారానికి పుట్టినిల్లు.. అన్నీ కుట్రలు, కుతంత్రాలే.. అంతా మాయాప్రచారమే.. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు వక్రీకరించడమే. -
జగన్.. మీ తల్లీ చెల్లెళ్లకు సమాధానమివ్వండి: సీఎం రేవంత్ కౌంటర్
ఏపీ సీఎం జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. -
పవన్కల్యాణ్ను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిద్దాం: ముద్రగడ కుమార్తె క్రాంతి
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపిద్దామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి కోరారు.