ఆ ఇద్దరు మంత్రులూ హెచ్సీయూ పూర్వ విద్యార్థులే
తమ పూర్వ విద్యార్థులు రాష్ట్ర మంత్రి వర్గంలో సభ్యులు కావడం పట్ల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆచార్యుల బృందం, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఈనాడు, హైదరాబాద్- గచ్చిబౌలి, న్యూస్టుడే: తమ పూర్వ విద్యార్థులు రాష్ట్ర మంత్రి వర్గంలో సభ్యులు కావడం పట్ల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆచార్యుల బృందం, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లు భట్టివిక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి 1986లో ఎంఏ హిస్టరీ చదవగా.. మంత్రి శ్రీధర్బాబు 1992లో ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యనభ్యసించారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం ఇక్కడి పూర్వవిద్యార్థే. ఆయన 1993లో ఈ విశ్వవిద్యాలయంలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పీజీ పూర్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్