West Nile fever: కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్రిశూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈనేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర (Kerala) ఆరోగ్యశాఖ ఆదేశించింది.
వెస్ట్ నైల్ అనేది వైరల్ జ్వరం. ఇన్ఫెక్షన్ సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా మానవులకు ఇది సంక్రమిస్తుంది. దీనికి ఎటువంటి ఔషధాలు, వ్యాక్సిన్ లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం, వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1937లో తొలిసారిగా దీన్ని ఉగాండాలో గుర్తించారు. మనదేశంలో మొదటిసారిగా కేరళలో 2011లో ఓ ఆరేళ్ల బాలుడిలో వెలుగు చూసింది. అయితే, ఆ అబ్బాయి 2019లో జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.
లక్షణాలు..
తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ, ఎక్కువమంది బాధితుల్లో ఇవి కనిపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం జ్వరం, తలనొప్పి, వాంతులు, దురద వంటి లక్షణాలుంటాయి. కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రం మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. జపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాధితో పోలిస్తే లక్షణాలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువే.
ఈ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. జ్వరం లేదా వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్కు సంబంధించి లక్షణాలు కనిపిస్తే మాత్రం తక్షణమే చికిత్స తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఈ వైరస్ బారినపడిన వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్