Ghost malls: దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం.
Ghost malls: దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. 2022లో 57గా ఉన్న ఈ సంఖ్య 2023 నాటికి 64కు పెరిగింది. ఇంతకీ ఘోస్ట్ మాల్స్ అంటే ఏమిటి? ఎందుకు పెరుగుతున్నాయి?
Ghost malls | ఇంటర్నెట్ డెస్క్: దేశ ప్రజల అభిరుచులు మారుతున్నాయి. ఏదైనా కొనాలంటే ఎక్కువగా ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారు. లేదంటే మెరుగైన షాపింగ్ అనుభూతి కోసం కుటుంబంతో కలిసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీంతో చిన్నచిన్న మాల్స్కు తగిన గిరాకీ ఉండడం లేదు. దీంతో అవి ఘోస్ట్ మాల్స్గా మారిపోతున్నాయి. సాధారణంగా అందుబాటులో మాల్ ప్రాపర్టీలో 40 శాతం ఖాళీగా ఉంటే.. వాటిని ఘోస్ట్ మాల్స్గా (Ghost malls) వ్యవహరిస్తారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇలాంటి మాల్స్ 2022లో 57 ఉండగా.. 2023లో 64కు పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఈమేరకు ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది.
29 నగరాల్లో 58 హైస్ట్రీట్స్, 340 షాపింగ్ సెంటర్లను పరిశీలించాక నైట్ ఫ్రాంక్ ఈ నివేదిక రూపొందించింది. దేశవ్యాప్తంగా గతేడాది 64 ఘోస్ట్ మాల్స్ వల్ల సుమారు 13.3 మిలియన్ చదరపు అడుగుల లీజు స్థలం నిరుపయోగంగా మారినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 58 శాతం పెరిగినట్లు తెలిపింది. దిల్లీ రాజధాని ప్రాంతంలోనే అత్యధిక ఘోస్ట్ షాపింగ్ మాల్స్ ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబయి, బెంగళూరు ఉన్నాయంది. హైదరాబాద్లో మాత్రం 19 శాతం మేర ఘోస్ట్ షాపింగ్ సెంటర్లు తగ్గినట్లు నివేదిక తెలిపింది. దేశవ్యాప్త ట్రెండ్ను పరిశీలించినప్పుడు లక్ష చదరపు అడుగులు లీజు స్థలం కలిగిన చిన్న చిన్న మాల్స్లో వేకెన్సీ రేటు 36 శాతంగా ఉండగా.. 5 లక్షల కంటే ఎక్కువ చదరపు అడుగులు కలిగిన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వేకెన్సీ రేటు 5 శాతం మాత్రమేనని నివేదిక తెలియజేస్తోంది. మిడ్ లెవల్ షాపింగ్ మాల్స్ వేకెన్సీ రేటు 15.5 శాతం ఉంటోందని తెలిపింది.
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
ఈ ఘోస్ట్ మాల్స్ వల్ల రిటైల్ సెక్టార్కు రూ.6,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. చిన్న మాల్స్కు పెద్దగా ఆదరణ ఉండకపోవడం ప్రాపర్టీ యజమానులకు సవాలుగా మారిందని, అద్దెదారులను ఆకర్షించడంలో వారు విఫలమవుతున్నారని పేర్కొంది. గ్రేడ్ ఏ మాల్స్.. వినియోగదారులతో కిటకిటలాడుతుండగా.. గ్రేడ్ సి మాల్స్ ఇలా ఘోస్ట్ సెంటర్లుగా మారుతున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బాలాజీ పేర్కొన్నారు. కొన్ని చిన్న చిన్న మాల్స్ మూతపడుతున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా డైరెక్టర్ గులాం జియా పేర్కొన్నారు. వినియోగదారుల ప్రవర్తన, మార్కెట్ పరిస్థితులకు ఇకపై రిటైల్ స్పేస్ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం.. -
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సలహా అందించారు. -
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు