PM Modi: ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్‌లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 08 May 2024 00:07 IST

హైదరాబాద్‌: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్‌లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. హైదరాబాద్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబంతో గొప్ప సమావేశం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పీవీని భారతరత్నతో గౌరవించినందుకు ఆ కుటుంబం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. కొన్నేళ్లుగా దేశం పురోగమించడంపై ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసిందని వెల్లడించారు.  భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు సుసంపన్నం కావడంపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రధాని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని