ఆ‘రుషి’.. చిన్నారుల చదువుకు కృషి
ఆ గ్రామాల్లో చిన్నారుల చదువులు అంతంత మాత్రమే. బాగా చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారు మరీ అరుదు. మరి అలాంటి చిన్నారులకు ప్రోగ్రామింగ్లో ఆరితేరేలా చేస్తే.. ఆంగ్లం నేర్పించి కోడింగ్లో శిక్షణనిస్తే.. సాంకేతిక విద్యలో అవగాహన కల్పిస్తే.. ఆ ఆలోచనతోనే ముందుకొచ్చింది 16 ఏళ్ల ఆరుషి అగర్వాల్.
చిత్రాలు: ట్విటర్ ద్వారా..
ఇంటర్నెట్ డెస్క్: ఆ గ్రామాల్లో చిన్నారుల చదువులు అంతంత మాత్రమే. బాగా చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారు మరీ అరుదు. మరి అలాంటి చిన్నారులకు ప్రోగ్రామింగ్లో ఆరితేరేలా చేస్తే.. ఆంగ్లం నేర్పించి కోడింగ్లో శిక్షణనిస్తే.. సాంకేతిక విద్యలో అవగాహన కల్పిస్తే.. ఆ ఆలోచనతోనే ముందుకొచ్చింది 16 ఏళ్ల ఆరుషి అగర్వాల్. అమెరికాలో స్థిరపడిన తను వారాంతాల్లో వర్చువల్ పాఠాలు చెబుతుంది. అసలు ఎవరీ ఆరుషి? చిన్నారులకు ప్రోగ్రామింగ్ నేర్పడమేంటి? అసలు తనకు ఆ ఆలోచన ఎలా వచ్చింది. తెలుసుకుందాం.
హరియాణాలో పుట్టిన ఆరుషి బెంగళూరులో స్థిరపడింది. పదేళ్ల వయసులో అమెరికా పయనమైంది. ప్రస్తుతం అక్కడే పదకొండో తరగతి చదువుతోంది. కంప్యూటర్ సైన్స్ అంటే తనకెంతో ఇష్టం. ఏడో తరగతి చదివే వయసులో ఎటువంటి అనుభవం లేకుండా భయపడుతూనే ఓ రోబోటిక్స్ బృందంలో చేరింది. తదుపరి ఆ బృంద సభ్యుల ప్రోత్సాహంతో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం)లో మక్కువ పెంచుకుంది. రోజులో 5గంటలు కోడింగ్, ప్రోగ్రామింగ్, గేమింగ్ తదితర వాటిలో మెళకువలు నేర్చుకుంది. ఈ రంగంలో గల విస్తృత అవకాశాల గురించి తెలుసుకుంది. భారత్లో విద్యను, ఉద్యోగావకాశాలను సులభతరం చేసేందుకు ఈ రంగం ఉపయోగపడుతుందని భావించింది. అప్పుడే ఏనాటికైనా తను నేర్చుకున్న విద్యను భారత్లోని గ్రామీణ ప్రాంతాల చిన్నారులకు చేరవేయాలనుకుంది.
అలా ‘అన్నోన్-16’
తర్వాత ఏడాది తన రోబోటిక్స్ బృందం మిషిగన్లో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో బాలికల శాతం చాలా తక్కువ. స్టెమ్లో మహిళల శాతం తక్కువగా ఉండటానికి భయం, సౌకర్యాలలేమి వారిని వెనకడుగు వేసేలా చేస్తోందని గ్రహించింది. ఎలాగైనా వారిలో భయం పోగొట్టి కావాల్సిన సౌకర్యాలు కల్పించి ఆత్మవిశ్వాసం నింపాలనుకుంది. నిపుణులు, ఆ రంగంలోని ప్రముఖ మహిళలతో చర్చించింది. దీంతో చిన్నతనంలో ‘అన్నోన్-16’ అనే పేరుతో ఓ శిబిరాన్ని ప్రారంభించింది. దీని ద్వారా వివిధ వర్క్షాప్లు నిర్వహిస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ప్రోగ్రామింగ్ పాఠ్యాంశాలను నేర్పేందుకు కృషి చేస్తోంది. వివిధ ఎన్జీఓలతో కలిసి విద్యార్థులకు వనరులు, అవకాశాలు కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.
భారత్లో అలా..
లహంతి క్లబ్ అనే ఎన్జీఓ ద్వారా బిహార్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాల చిన్నారులకు ప్రోగ్రామింగ్, కంప్యూటర్ విద్యలో ఆసక్తి ఉందని తెలుసుకుంది ఆరుషి. కానీ కనీస చదువులకు కూడా సదుపాయాలు లేని ఆ ప్రాంతాల్లో ప్రోగ్రామింగ్ నేర్పడం అంటే అంత సులువైన పనికాదు. అంతేకాదు కోడింగ్ రాసేందుకు ముందుగా రావాల్సింది ఇంగ్లిష్. మారుమూల ప్రాంతాల్లోని ఆ చిన్నారులకు అసలు ఆంగ్ల భాషే తెలియదు. వారికి ఆ భాష నేర్పేందుకు తన వారాంతాలను అంకితం చేసింది. అయినా తన ముందున్న మరో సవాలు. వసతుల లేమి. ఇంటర్నెట్ సదుపాయం, కంప్యూటర్లు, నేర్పేందుకు స్థలం. దీంతో లహంతి క్లబ్ సహాయం తీసుకుని ఆ గ్రామాల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించి విద్య నేర్పడం ప్రారంభించింది. అమెరికా నుంచి ప్రతి శని, ఆదివారాలు ఉదయం 5గంటలకి సుమారు 300మందికి స్కైప్ ద్వారా వారికి అర్థమయ్యే ఉదాహారణలతో ఇంగ్లిషు పాఠాలు చెబుతుంది. తన ‘అన్నోన్-16’ వెబ్సైట్ ద్వారా విద్యార్థులకి పైథాన్, జావా, సీఎస్ఎస్, హెచ్టీఎంఎల్ తదితర వాటిలో శిక్షణా సౌకర్యం కల్పించింది.
భవిష్యత్తు ఆలోచనలు
భవిష్యత్తులో కంప్యూటర్ సైన్స్లో ఉన్నత విద్యను అభ్యసించి, టెక్నాలజీతో పర్యావరణ సమస్యలకు చెక్ పెట్టాలనుకుంటుంది ఆరుషి. తను నేర్చుకున్న విద్యను నలుగురికీ పంచుతానని చెబుతోంది. అంతేకాదు నాణ్యమైన విద్యని మారుమూల ప్రాంత చిన్నారులకు చేరవేసేందుకు తనవంతు కృషి చేస్తానని అంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..