కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి?
ఇంటర్నెట్డెస్క్: భానుడు భగభగ మండుతున్నాడు. ఎండలు (High Temperature) ఠారెత్తిస్తున్నాయి. జూన్ నెలలో అడుగిడుతున్నా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు సరికాదా.. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం దేశ రాజధాని దిల్లీలో (Delhi) అత్యధికంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత భారీ స్థాయిలో నమోదవడం దిల్లీ చరిత్రలోనే ఇది తొలిసారి. హస్తినలోనే కాదు వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి?
సాధారణంగా మే, జూన్, జులై నెలల్లో దిల్లీ, హైదరాబాద్, ముంబయి, కోల్కతా లాంటి మెట్రో పాలిటన్ నగరాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆయా నగరాల్లో పరిసర ప్రాంతాలకంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ఈ ఏడాది ఈ వ్యత్యాసం భారీగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. నగరాల్లో మాత్రం భయపెడుతున్నాయి.
అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్
సాధారణంగా గ్రామీణప్రాంతాలతో పోలిస్తే.. పట్టణాలు, నగరాల్లో సౌకర్యాలు ఎక్కువ. వాటి కోసం పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు వేస్తూ.. దాదాపుగా నేల మొత్తాన్ని కాంక్రీట్తో కప్పేస్తున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా పెద్దపెద్ద భవనాలు. సాధారణంగా నేల కొంత ఎండవేడిని తనలో ఇముడ్చుకుంటుంది. కానీ, కాంక్రీట్ నేల విషయంలో అలా జరగదు. మొత్తం ఉష్ణం తిరిగి వాతావరణంలోకి ఉద్గారమవుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల నుంచి కూడా కొంత వేడి విడుదలవుతుంది. పట్టణాలు, నగరాల్లో వీటి సంఖ్య ఎక్కువ. ఉష్ణోగ్రతలు పెరగడానికి పరోక్షంగా ఇవి కూడా కారణమవుతున్నాయి.
ఎల్నినో ఎఫెక్ట్..
ఎల్నినో అనేది ఒక వాతావరణ పోకడ. మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన వేడి గాలులనే ఎల్నినో అంటారు. ఇవి కూడా భూ ఉపరితల వాతావరణం వేడెక్కడానికి కారణమవుతున్నాయి. ఎల్నినో వేడి దశ కాగా.. లానినా అనే మరో పక్రియ శీతల దశ. ఎల్నినో తర్వాత లానినా వస్తుంది. 2-7 ఏళ్ల కాలవ్యవధి కలిగిన ఒక కాలచక్రంలా ఈ రెండు పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకుంటాయి. గతేడాదిలో ప్రారంభమైన ఎల్నినో జూన్ చివరి వరకు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణంలో నిత్యం రకరకాల మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొంతమేర ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. వీటికితోడు ఎల్నినో ప్రభావంతో వీచిన వేడిగాలుల ప్రభావం భారత్లోని ఉత్తర మధ్య, తూర్పు ప్రాంతాలపై పడటం వల్ల ఆయాచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
గాలిలో తేమ
వేసవికాలంలో మధ్య, వాయవ్య భారత్లో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వడగాల్పులు వీయడం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతున్నాయి. అలాగని తేమ ఎక్కువగా ఉన్నా నష్టమే. పెరిగిన ఉష్ణోగ్రతలు తేమతో చర్యలు జరపడం వల్ల మరింత ఉష్ణం జనిస్తుంది. ఉదాహరణకు సముద్రతీరం వెంబడి ఉండే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఈతరహా పరిస్థితులు కనిపిస్తాయి. సముద్రం ఒడ్డున ఉండటం వల్ల వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనికి వడగాలులు తోడవడం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతాయి. భారత్లోని కోస్తా, మధ్య, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణ వేసవి ఉష్ణోగ్రతల కంటే ఈ ఏడాది 4 నుంచి 5 శాతం పెరిగినట్లు భారత వాతావరణశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు