122 హామీల్లో 77 నెరవేర్చాం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగాన్ని వీక్షించేందుకు అసెంబ్లీలో, మండలిలో ప్రత్యేకంగా తెరలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో సంక్షేమరంగానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగం ద్వారా వివరించారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా నెరవేర్చాం.
* ఏడాదిలో 3.98 కోట్ల మంది ప్రజలకు రూ.42వేల కోట్ల సాయం అందించాం.
* మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.
* 45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత. చేయూత కింద నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేలు.
* అమ్మ ఒడి ద్వారా 42.33లక్షల మంది తల్లులకు రూ.6,350 కోట్లు.
* జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు కిట్స్.
* రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.
* గత ఏడాది కంటే తలసరి ఆదాయం 12 శాతం వృద్ధి.
* మనబడి పథకంలో 15,700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన. దశల వారీగా మూడేళ్లలో 45వేల పాఠశాలల అభివృద్ధి.
* జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం.
* విద్యుత్, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు.
* సేవారంగంలో 9.1శాతం, వ్యవసాయ అనుబంధ రంగంలో 8శాతం వృద్ధి సాధించాం. పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధి.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16 శాతం వృద్ధిరేటు సాధించాం.
* వైఎస్సార్ టెలీ మెడిసిన్ పథకం విజయవంతంగా కొనసాగుతోంది.
* పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3,200 కోట్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు