IPS అధికారి జిలేబీ ట్వీట్ వైరల్!
జిలేబీ అంటే ఇష్టం ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన ట్వీట్ నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. తమిళనాడుకు చెందిన డా.సందీప్ మిత్తల్ అనే ఐపీఎస్ అధికారి తనకు............
ఇంటర్నెట్ డెస్క్: జిలేబీ అంటే ఇష్టం ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన ట్వీట్ నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. తమిళనాడుకు చెందిన డా.సందీప్ మిత్తల్ అనే ఐపీఎస్ అధికారి తనకు జిలేబీ తినాలి అనిపిస్తోందనీ, కానీ తన భార్య తిననివ్వడం లేదంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్తా ఆయన భార్య వరకూ వెళ్లింది. ఆమె ‘‘మీరు ఈరోజు ఇంటికి రండి’’ అని రిప్లై ఇచ్చారు. మరి ఇంటికి వెళ్లాక ఆయన జిలేబీ తిన్నారో?లేదో? తెలియదు కానీ ఆ ట్వీట్లు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
‘‘చిన్నప్పుడు 25 పైసలకు పెద్ద జిలేబీ వచ్చేది. పెద్దయ్యాక డబ్బు సంపాదించి అలాంటి జిలేబీలు రోజుకు మూడు లేదా నాలుగు తినొచ్చు అనుకున్నా. ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తున్నా.. కానీ, నా భార్య నన్ను జిలేబీ తిననివ్వడం లేదు’’ అని సదరు ఐపీఎస్ అధికారి ట్వీట్ చేయగా.. ‘‘మీరు ఈరోజు ఇంటికి రండి’’ అని ఆయన భార్య డా. రిచా మిత్తల్ రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్లకు నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!