YSRCP: రూ.6లక్షల నగదుతో పోలీసులకు చిక్కిన వైకాపా ఎంపీ కార్యదర్శి

విశాఖ ఎంవీపీ కాలనీ సర్కిల్‌లో బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Updated : 10 Apr 2024 19:56 IST

విశాఖపట్నం: ఎన్నికల నేపథ్యంలో విశాఖ ఎంవీపీ కాలనీ సర్కిల్‌లో బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి ప్రైవేటు కార్యదర్శి దశరథరామిరెడ్డి కారును ఆపి పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కారు డ్యాష్‌ బోర్డులో ఉన్న రూ.6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంటి కొనుగోలు కోసం నగదు తీసుకెళ్తున్నట్టు దశరథరామిరెడ్డి పోలీసులకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని