Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. మందుల్లేవండి... రోగులను తీసుకెళ్లిపోండి!
ఉమ్మడి కడప జిల్లాకు పెద్దాసుపత్రిగా నిలుస్తున్న కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ప్రతిరోజూ జిల్లా నలుమూలాల నుంచి పెద్దసంఖ్యలో రోగులొస్తుంటారు. వీరిని అక్కున చేర్చుకుని వైద్యసేవలందించాల్సిన ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది ఇక్కడ మందుల్లేవని, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, వేలూరు ప్రభుత్వాసుపత్రులకు గానీ, ప్రైవేటు ఆసుపత్రులకు గానీ వెళ్లాలని చెబుతుంటే భయమేస్తోందని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కథనం
2. క్రికెట్ హోరు.. బెట్టింగ్ జోరు!
గత నెలన్నర రోజులుగా క్రికెట్ ఐపీఎల్ నడుస్తుండడంతో ప్రతి రోజు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. మెదక్, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్, పట్టణాలు, మండల కేంద్రం పాపన్నపేటతో పాటు ఆయా గ్రామాల్లో ప్రతిరోజు జోరుగా నడుస్తోంది. చాయ్ హోటళ్లు, దుకాణాలే కేంద్రంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది.పూర్తి కథనం
3. బిక్కుబిక్కుమంటున్న పాల్వాయి గేటు
గడప గడపకు కార్యక్రమం ద్వారా ఊర్లోకి వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి గ్రామస్థులు పూలతో స్వాగతం పలికారు. కానీ నేడు అదే ఎమ్మెల్యే మహిళలని చూడకుండా ఓ ప్రజాప్రతినిధినని మరిచి వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో బెదిరించాడు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీరుపై పాల్వాయిగేటు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి కథనం
4. 1, 2, 3... దూకేయ్
దర్గాకెళ్లి తిరిగొస్తుండగా.. పీకల్లోతు మత్తులో జోగుతున్న యువకుడు బ్యారేజీలోకి దూకి నీటమునిగి మృతిచెందాడు. ఈ దుర్ఘటన ఈ నెల 19న కర్ణాటక రాష్ట్రం, కమలాపూర్ తాలూకా, పటవాడ గ్రామం సమీపంలో జరిగింది. మృతుడు పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలోని జహంగీరాబాద్ వాసిగా గుర్తించారు.పూర్తి కథనం
5. రక్తపోటు.. మేల్కొనకుంటే చేటు!
నేటి యువత ఆహారపు అలవాట్లు.. జీవనశైలిలో మార్పు, శారీరక, మానసిక రుగ్మతల కారణంగా జిల్లాలో ఎక్కువ మంది రక్తపోటు (బీపీ) బారిన పడుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే ఈ లక్షణాలు నేడు ఉడుకు రక్తంతో మరిగిపోవాల్సిన యువతలోనూ కనిపిస్తోంది.పూర్తి కథనం
6. బిహార్లో దారిమళ్లిన యోగి హెలికాప్టర్
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒకటి బిహార్లో దారిమళ్లింది. ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళ్లింది! లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి గురువారం బిహార్కు వెళ్లారు. భాజపా ముందుగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం- పశ్చిమ చంపారణ్లో ర్యాలీతో రాష్ట్రంలో ఆయన పర్యటన ముగియాలి.పూర్తి కథనం
7. అడ్డొస్తే కొట్టేయ్.. అడగరులే కట్టేయ్.. వైకాపా నేతల బరితెగింపు
‘‘విజయవాడ నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. అది ప్రభుత్వానిదైనా, ప్రైవేటుదైనా.. కబ్జా చేసేయ్.. రాత్రికి రాత్రి నిర్మాణం మొదలెట్టేయ్.. ఎవరైనా అడ్డొస్తే.. కొట్టి పడేయ్..’’ అన్నట్టుగా కొందరు వైకాపా నాయకులు, అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.పూర్తి కథనం
8. పరుగులు పెట్టినా ఫలితం దక్కలే!.. రైలు నిలయంలో ప్రయాణికులకు వెతలు
తూ.కో రైల్వే విశాఖ రైలు నిలయంలో అధికారుల వింత చర్యలతో ప్రయాణికులకు వెతలు తప్పడం లేదు. ప్లాట్ఫామ్ల కొరత నెపంతో విశాఖ నుంచి రెండు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ఒకే సమయంలో ఒక దాని వెనక మరొకటి ఉంచడంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.పూర్తి కథనం
9. నన్ను ఉరి తీసినా ఆప్ను అంతం చేయలేరు
వచ్చే నెల 1వ తేదీన బెయిల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తిహాడ్ జైలుకు తిరిగి వెళ్లేందుకు తనకు ఎటువంటి ఆందోళన లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం తాను చేస్తున్న పోరాటంలో భాగంగా ఆ నిర్బంధాన్ని భావిస్తున్నానని తెలిపారు. దిల్లీ మద్యం విధాన కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్కు లోక్సభ ఎన్నికల ప్రచారానికి వీలుగా సుప్రీంకోర్టు ఈ నెల 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.పూర్తి కథనం
10. శవ రాజకీయాలు మానండి: మంత్రి జూపల్లి
భారాస కార్యకర్త శ్రీధర్రెడ్డి హత్యకు దురలవాట్లు, భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓప్రకటన విడుదల చేశారు.పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
తిరుమల తిరుపతి దేవస్థానమ్స్(తితిదే) నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు. -
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. -
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
తెలంగాణలోని సంక్షేమ శాఖల్లో 581 ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. -
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన
Mineral Blocks Auction: గత 9 ఏళ్లలో ఏ ఒక్క మినరల్ బ్లాక్కూ తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించలేదని కేంద్ర గనులశాఖ తెలిపింది. ఈ నెలాఖరులోగా కనీసం 6 బ్లాకులకు వేలం నిర్వహించాలని సూచించింది. లేదంటే తామే ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుందని పేర్కొంది. -
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
సీసీఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. -
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు
క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు అభివర్ణించారు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. -
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా చేశారు. -
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. -
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛాలెంజింగ్ స్టార్- నటుడు దర్శన్, ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్రాగౌడలతో కలిపి తొమ్మిది మంది పోలీసు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. -
ఎమ్మెల్యే పదవులకు కుమార, బొమ్మై రాజీనామా
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రస్తుత విధానసభ సభ్యులు సాంకేతికంగా ఒకే పదవి అంటిపెట్టుకోవడానికి వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు