Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1.రాష్ట్రంలో వైకాపా కవ్వింపు చర్యలు, దాడులపై చంద్రబాబు ఆరా
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైకాపా కవ్వింపు చర్యలు, దాడులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయమై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు. పూర్తి కథనం
2. దిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిల్లీకి పయనమయ్యారు. శనివారం దిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం కాంగ్రెస్ పెద్దలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం
3. జీరో వేస్ట్ వెడ్డింగ్.. నెట్టింట వీడియో ట్రెండింగ్
చిన్న వేడుక చేసుకోవాలన్నా ప్లేట్లు, గ్లాసులని ఎక్కడో ఒకచోట ప్లాస్టిక్ను వాడుతుంటాం. ఇక వివాహం జరిపించాలంటే ఈ వ్యర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మండపం అలంకరణ దగ్గర నుంచి అతిధులకు ఇచ్చే గిఫ్ట్ల వరకు అన్నింటా ఎక్కువగా ప్లాస్టిక్నే వినియోగిస్తాం. పూర్తి కథనం
4. 34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.. నెటిజన్ల కామెంటిదే!
చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’. ఈ సినిమా వచ్చి 34 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని డైలాగ్స్, పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుతో కలిసి షాలిని, షామిలి, రిషి చైల్డ్ ఆర్టిస్టులుగా అల్లరి చేశారు. వాళ్లు తాజాగా మెగాస్టార్ని కలిశారు. పూర్తి కథనం
5. భారత్లో వాట్సప్ బిజినెస్ అకౌంట్స్కు మెటా వెరిఫైడ్
భారత్లోని వాట్సప్ బిజినెస్ యూజర్ల కోసం వెరిఫైడ్ ప్రోగ్రామ్ను మెటా (meta) ప్రారంభించింది. ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్లో ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంది. అలాగే, వాట్సప్ బిజినెస్ యాప్ వాడే వారి కోసం గతేడాది సెప్టెంబర్లోనే మెటా వెరిఫైడ్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది. పూర్తి కథనం
6. స్పోర్టీ లుక్తో మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు.. ధర, వివరాలు ఇవే..
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata motors) తన ప్రీమియం హ్యాచ్బ్యాక్లో కొత్త ఆల్ట్రోజ్ రేసర్ను (Altroz Racer) తీసుకొచ్చింది. స్పోర్టీ లుక్లో తీసుకొచ్చిన ఈ కొత్త ఆల్ట్రోజ్ ధర రూ.9.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఆర్1, ఆర్2, ఆర్3 పేరుతో మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. పూర్తి కథనం
7. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాం : మోదీ
ఎన్డీయే లోక్సభాపక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. కూటమి నేతలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. పూర్తి కథనం
8. ‘వందేభారత్’.. సంఖ్య పెరుగుతోంది.. వేగం తగ్గుతోంది !
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల (Vande Bharat trains) సరాసరి వేగం గత మూడేళ్లలో గంటకు 84.48 కి.మీ. నుంచి 76.25 కి.మీ.లకు పడిపోయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈమేరకు సమాచార హక్కు చట్టం ( సహచ) ద్వారా మధ్యప్రదేశ్కు (Madhyapradesh) చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు. పూర్తి కథనం
9. కొందరు ఓట్లేస్తే.. ఇంకొందరు చెంప దెబ్బలు కొడుతున్నారు: ఎంపీ సంజయ్ రౌత్
బాలీవుడ్ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut)ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడంపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) శుక్రవారం స్పందించారు. పూర్తి కథనం
10. ‘భారత్లో కేజ్రీవాల్కు బెయిల్’.. ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు!
ఓ కేసులో పాకిస్థాన్ (Pakistan) సుప్రీంకోర్టు ముందు హాజరైన ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan).. దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. భారత్లో లోక్సభ ఎన్నికల వేళ ప్రచారం కోసం కేజ్రీవాల్కు బెయిల్ దక్కింది. పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..