Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. సోనియమ్మ బిడ్డగా మాటిస్తున్నా.. యూత్ డిక్లరేషన్ అమలు చేస్తాం: ప్రియాంక
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సరూర్నగర్లో నిర్వహించిన ‘యువ సంఘర్షణ’ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీకి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అత్యంత వేడిలోనూ సభకు భారీ ఎత్తున తరలివచ్చారని.. తనకు ప్రేమ పూర్వకంగా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. రూ.80కే నగరమంతా తిరిగేయొచ్చు!
నగర మహిళలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టి-24 టికెట్ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.100 ఉన్న టి-24 టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి ఇటీవల టీఎస్ఆర్టీసీ తగ్గించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఐదు శీర్షికలుగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్.. ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో 60 ఏళ్లు పోరాడినా ఆకాంక్షలు నెరవేరలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్నకు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీకి ఆయన ఘన స్వాగతం పలికారు. సరూర్నగర్లో నిర్వహించిన ‘యువ సంఘర్షణ’ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఓయూ, కాకతీయ వర్సిటీలు కేవలం విశ్వవిద్యాలయాలే కావని.. అవి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కర్ణాటకలో ప్రచారానికి తెర.. ఎల్లుండే బిగ్ ఫైట్!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారానికి తెరపడింది. భాజపా- కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రశ్రేణి నాయకులు పోటాపోటీగా సాగించిన ప్రచార అంకం సోమవారంతో ముగిసింది. నెల రోజులకు పైగా బహిరంగ సభలు, రోడ్ షోలతో సందడి వాతావరణం నెలకొన్న కర్ణాటకలో ఒక్కసారిగా మైకులు మూగబోయాయి. తమ చివరి ప్రయత్నంగా నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మోదీ నోట ఆ వ్యాఖ్యలా?.. ఆశ్చర్యపోయానన్న పవార్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ(PM Modi) మతపరమైన నినాదాలు ఇవ్వడం తనను ఆశ్చర్యపర్చిందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్(NCP president Sharad Pawar) అన్నారు. మతం, మతపరమైన అంశాలను ఎన్నికల ప్రచారంలో జొప్పించడం సరికాదని మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. డబ్ల్యూటీసీ ఫైనల్.. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్
టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్కు టెస్టుల్లోకి పిలుపొచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్నకు ఎంపికై గాయం కారణంగా మ్యాచ్కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ను తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. యాపిల్ ఉద్యోగులకు లేఆఫ్లు.. టిమ్ కుక్ ఏమన్నారంటే?
ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్ (Layoffs)లు విధిస్తున్నాయి. గతేడాది ట్విటర్ (Twitter)తో ప్రారంభమై.. అమెజాన్ (Amazon), మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google), మెటా (Meta) వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ, యాపిల్ (Apple) మాత్రం ఇప్పటి వరకు లేఆఫ్ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మరణానంతరం దేహాన్ని భద్రపరుచుకునేందుకు సిద్ధం: బిలియనీర్ ఆసక్తికర నిర్ణయం
మరణం తర్వాత మళ్లీ ప్రాణాన్ని తిరిగితీసుకురావచ్చా..! ఈ అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. జీవితకాలం పెంపుపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ సమయంలో ఓ బిలియనీర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తి కలిగిస్తోంది. మరణానంతరం తన దేహాన్ని భద్రపరుచుకునేందుకు సిద్ధమయ్యారు. భవిష్యత్తులో తిరిగి బతకొచ్చనే ఆలోచనే అందుకు కారణం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కర్ణాటక ‘సార్వభౌమత్వం’ పిలుపుపై దుమారం.. కాంగ్రెస్పై ఈసీకి ఫిర్యాదు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారం చివరి రోజు కీలక పరిణామం. కర్ణాటక (Karnataka) ప్రతిష్ఠకు, సార్వభౌమత్వానికి (Sovereignty), సమగ్రతకు ముప్పు వాటిల్లేలా తమ పార్టీ ఎవరినీ అనుమతించదంటూ సోనియా గాంధీ (Sonia Gandhi) పేరిట కాంగ్రెస్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మైసూరులో నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలను ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త!
వాట్సాప్ అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో చాలా మంది సాధారణ ఎస్ఎంఎస్ల ద్వారానే సందేశాలను పంపించుకునేవారు. కానీ, అనవసర మెసేజ్లు, మోసపూరిత సందేశాలు ఎక్కువవడంతో వాటికి స్వస్తి పలికారు. వాట్సాప్ (WhatsApp)లో ఆ బెడద లేకపోవడంతో అందరూ ఈ వేదికను వాడుకోవడం మొదలుపెట్టారు. కానీ, ఇటీవల వాట్సాప్ (WhatsApp)లోనూ స్కామ్ మెసేజ్లు, కాల్స్ ఎక్కువైపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత